Atiq Ahmed Murder: అతిక్ అహ్మద్ హత్యపై సుప్రీంకోర్టులో పిటిషన్లు.. సీబీఐ ఎంక్వైరీ చేయాలని…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Atiq Ahmed Murder: గ్యాంగ్ స్టర్, పొలిటికల్ లీడర్ అతీక్ అహ్మద్ హత్యపై సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. జ్యూడీషియల్ కమిటీ ద్వారా దర్యాప్తు చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జి నేతృత్వంలోని జ్యుడీషియల్ కమిటీతో దర్యాప్తు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయబడింది. 2017 నుంచి ఉత్తర్ ప్రదేశ్ లో జరిగిన 183 ఎన్కౌంటర్లపై కమిటీ విచారణ జరిపించాలని పిటిషనర్ న్యాయవాది విశాల్ తివారీ కూడా కోరారు. ఇదే కాకుండా గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే ఎన్కౌంటర్పై కూడా సీబీఐ చేత దర్యాప్తు చేపట్టాలని పిటిషనర్ కోరారు.
Read Also: Same-Gender Marriage: స్వలింగ వివాహాలను వ్యతిరేకించిన కేంద్రం.. ఇది కోర్టుల పని కాదని సూచన..
Also Read
- KTR: ధాన్యం కుప్పల మీదే రైతన్నల చావులు.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్
- TCS: లేఆఫ్స్ మధ్య TCS కొత్త పే పాలసీ.. ఉద్యోగుల్లో భయం
- Supreme Court: చిన్నారుల మిస్సింగ్లపై కిడ్నాప్ కేసు నమోదు చేయాల్సిందే.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
- Modi-Marco Rubio: వైట్హౌస్ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్యానికి, చట్ట పాలలనకు తీవ్రమైన ముప్పు అని, ఇది పోలీస్ రాజ్యం, అరాచకాలకు దారి తీస్తుందని, శిక్షించే అధికారం కేవలం న్యాయస్థానాలకు మాత్రమే ఉంటుందని, పోలీసులు డేర్ డెవిల్స్ గా మారినప్పుడు న్యాయవ్యవస్థకు కుప్పకూలే ప్రమాదం ఉందని పిటషన్ లో పేర్కొన్నాడు. జీవించే హక్కు, స్వేచ్ఛను ఉల్లంఘించడం, ప్రజాప్రయోజనాలను ప్రభావితం చేస్తున్నందు వల్ల ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని కోరాడు. పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో ఒక వ్యక్తిని హత్యచేయడం పోలీస్ వ్యవస్థ వైఫల్యాన్ని సూచిస్తుందని పేర్కొన్నాడు పిటిషనర్.
ఇదిలా ఉంటే అతిక్ మరణంపై మరో పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు అయింది. ఈ హత్యకేసును సీబీఐకి బదిలీ చేయాలని రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అమితాబ్ ఠాకూర్ పిటిషన్ దాఖలు చేశారు. శనివారం రాత్రి అతిక్ అహ్మద్, అష్రాఫ్ అహ్మద్ ను వైద్య పరీక్షల కోసం ప్రయాగ్ రాజ్ ఆస్పత్రికి తీసుకువచ్చిన సమయంలో జర్నలిస్టులుగా నటిస్తున్న ముగ్గురు వ్యక్తులు అతి సమీపం నుంచి వారిని కాల్చి చంపారు. ఈ ఘటన తర్వాత ముగ్గురిని పోలీసులు పట్టుకున్నారు. అతీక్ అహ్మద్ హత్యకు ముందు అతని కొడుకు అసద్ పోలీసుల ఎన్కౌంటర్ లో చనిపోయాడు. వీరంతా ఉమేష్ పాల్ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు.
తాజావార్తలు
-
Asim Munir: ఉద్రిక్తతల వేళ టెహ్రాన్లో అసిమ్ మునీర్ పర్యటన.. కీలక నేతలతో భేటీ
-
Bakrid Holiday Change: బక్రీద్ సెలవు మార్పు.. మే 28న జరగాల్సిన పరీక్షలు వాయిదా!
-
Elon Musk: మస్క్కు చైనా గూఢచారుల విందు?.. ట్రంప్ చైనా పర్యటనపై కొత్త వివాదం
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
Botsa Satyanarayana : యుద్ధం సాకుతో ఇష్టారీతన ప్రజలపై భారంమోపుతున్నారు
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!