Same-Gender Marriage: స్వలింగ వివాహాలను వ్యతిరేకించిన కేంద్రం.. ఇది కోర్టుల పని కాదని సూచన..
Same-Gender Marriage: కేంద్ర మరోసారి స్వలింగ వివాహాలను వ్యతిరేకించింది. ఈ వివాహాలకు చట్టపరమైన అనుమతిని మంజూరు చేయడాన్ని కేంద్రం ఈ రోజు మరోసారి వ్యతిరేకించింది. ప్రస్తుతం ఉన్న వివాహ వ్యవస్థతో సమానంగా పరిగణించాలనేది ప్రతీ పౌరుడి ప్రయోజనాలను తీవ్రంగా ప్రభావితం చేస్తుందని కేంద్రం పేర్కొంది. స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టపరమైన ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లను ‘‘పట్టణ ఉన్నతవర్గం’’ దృక్పథాన్ని ప్రతిబింబించేదిగా పేర్కొంటూ, వివాహాన్ని గుర్తించడం తప్పనిసరిగా చట్టబద్ధమైన విధి అని, దీనిని కోర్టులు నిర్ణయించడం మానుకోవాలని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. స్వలింగ వివాహాలకు సంబంధించి చట్టబద్ధమైన ధ్రువీకరణను కోరుతూ దాఖలైన పిటిషన్లపై కేంద్రం తన స్పందనను తెలియజేసింది.
గ్రామీణ, పట్టణ జనాభా విస్తృత అభిప్రాయాలను, వారి వ్యక్తిగత చట్టాలు, వివాహ వ్యవస్థను నియంత్రించే ఆచారాలను దృష్టిలో ఉంచుకుని మతపరమైన అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని పార్లమెంట్ చట్టాలు చేస్తుందని సుప్రీంకోర్టుకు తెలిపింది. వివాహం అనేది సామాజిక చట్టపరమైన సంస్థ అని పేర్కొంటూ..భారత రాజ్యాంగంలోని ఆర్టికట్ 246 ప్రకారం పార్లమెంట్ ద్వారా మాత్రమే ఇది గుర్తించబడుతుందని, చట్టపరమైన గుర్తింపు ఇస్తుందని కేంద్రం తెలిపింది. హిందూ, ముస్లిం వివాహ చట్టాల్లో వివాహం అనేది కేవలం పురుషుడు, స్త్రీ మధ్య జరిగే ఓ ప్రక్రియ మాత్రమే అని కేంద్రం పేర్కొంది.
Also Read
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
- Ajit Doval: యూఏఈలో అజిత్ దోవల్ పర్యటన.. దౌత్య సంబంధాలపై చర్చ
- Mamata Banerjee: మోడీ ‘ఝల్మురి’.. మమత ‘ఫ్రూట్స్’ కొనుగోలు.. ఫొటోలు వైరల్
- PM Modi: ఇదే నా చివరి బహిరంగ సభ.. తిరిగి ప్రమాణస్వీకారానికి వస్తా.. బెంగాల్లో మోడీ కీలక ప్రసంగం
Read Also: Gidugu Rudraraju: బీజేపీ అంటే బాబు, జగన్, పవన్.. పార్టీని వీడినవారు తిరిగి రండి..!
ఈ విషయాన్ని ప్రజాప్రతినిధులతో కూడిన పార్లమెంట్ కే వదిలేయాలని సుప్రీంకోర్టును కోరింది. దేశంలో స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలని కోరతూ దాఖలైన పిటిషన్లను మంగళవారం ఐదుగురు న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం విచారించనుంది. ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు ఎస్కె కౌల్, ఎస్ రవీంద్ర భట్, పిఎస్ నరసింహా, హిమ కోహ్లీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
హక్కులను సృష్టించడం, బంధాలను గుర్తించడం, చట్టబద్ధమైన పవిత్రతను ఇవ్వడం చట్టసభల ద్వారానే సాధ్యం అవుతుందని, న్యాయవ్యవస్థ పనికాదని కేంద్రం సూచించింది. కేవలం పట్టణ ప్రాంతాల్లోని కొద్ది మంది అభిప్రాయాలను ప్రతిబింబించే పిటిషన్లు అందరి అభిప్రాయాలను ప్రతిబింభించదని, సెమ్ సెక్స్ మ్యారేజ్ అనేది విస్తృతమైన ప్రజాభిప్రాయాన్ని కలిగి ఉంటుందని కేంద్రం పేర్కొంది.
తాజావార్తలు
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!