Assam: బంగ్లా చొరబాట్లు, స్థానికులకు తుపాకులు ఇవ్వనున్న అస్సాం ప్రభుత్వం..
- స్థానిక ప్రజలకు ఆయుధాలు ఇవ్వనున్న అస్సాం ప్రభుత్వం..
- చొరబాట్లు, ఆక్రమదారుల్ని అడ్డుకోవడంపై హిమంత సర్కార్ దృష్టి..
- బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి విచ్చలవిడిగా చొరబాట్లు..
- ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Assam: అస్సాంలో స్థానిక ప్రజలు, భారతీయులకు ఆయుధాలు ఇచ్చేందుకు అక్కడి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఆయుధ లైసెన్సులు మంజూరు చేసేందుకు ఒక పోర్టల్ ప్రారంభించాలని యోచిస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ పోర్టల్ ప్రారంభించబడుతుందని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మంగళవారం తెలిపారు. ఆక్రమిత అటవీ, చిత్తడి నేలల నుంచి అక్రమ స్థిర నివాసులు, ఆక్రమణదారులు, ఎక్కువగా బెంగాలీ మాట్లాడే ముస్లింలను తరిమికొట్టడానికి రాష్ట్రం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ఈ చర్య వచ్చింది.
‘‘ఆయుధ లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ఒక పోర్టల్ ఉంటుంది. ఆగస్టు 1-7 మధ్య ప్రారంభం అవుతుంది. డిప్యూటీ కమిషనర్ విచారణ నిర్వహిస్తారు. ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న వారికి ఆయుధ లైసెన్స్ మంజూరు అవుతుంది’’ అని హిమంత ఎక్స్లో ఒక వీడియో పోస్ట్ చేశారు. పోర్టల్ ప్రారంభించిన తర్వాత ప్రజలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగలరని, పోర్టల్ లేకపోయినా ఫిజికల్గా పత్రాలను సమర్పించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎలాంటి పరిమితులు లేవని వెల్లడించారు.
Also Read
- Meenakshi Natarajan: ఇది బీజేపీ రాజనీతి.. నామినేషన్ రద్దుపై మీనాక్షి నటరాజన్ ఆగ్రహం
- DK Shiva Kumar: సగం తిన్న ఆపిల్ విసరడం అహంకారమే.. డీకేపై బీజేపీ ఫైర్..
- Meenakshi Natarajan Nomination Rejected: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్కు బిగ్ షాక్.. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
- Driving License: ఇక లైసెన్స్ టెన్షన్ తీరినట్లే.. ఏకంగా 50 ఏళ్లపాటు చెల్లుబాటు అయ్యేలా సరికొత్త ప్లాన్!
Read Also: Gandikota Murder Case: గండికోట మైనర్ బాలిక హత్య కేసు.. కీలక ఆధారాలు లభ్యం..!
బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారుల ఆక్రమణపై జూలై 21న హిమంత మాట్లాడుతూ.. జనాభాలో మార్పులను నియంత్రించకపోతే స్థానిక అస్సామీలు, హిందువులు 10 ఏళ్లలో రాష్ట్రంలో మైనారిటీలుగా మారుతారని ఆయన చెప్పారు. అక్రమ వలసదారుల నుంచి భూమిని విడిపించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, ఇప్పటికే 18 లక్షల ఎకరాల భూమి ఆక్రమణదారుల కింద ఉందని చెప్పారు.
అయితే, సరిహద్దు, మారుమూల ప్రాంతాల్లో నివసించే స్థానిక భారత ప్రజలకు ఆయుధ లైసెన్సులు ఇవ్వాలనే ప్రభుత్వ నిర్నయాన్ని అస్సాం కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎంపీ గౌరవ్ గొగోయ్ తీవ్రంగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై మే నెలలో నిర్ణయం తీసుకుంది. అస్సాం ప్రజలకు తుపాకులు కాదని, నీరు, ఉపాధి, విద్య, వైద్య సౌకర్యాలను కోరుకుంటున్నారని ఆయన మే నెలలో అన్నారు. రాష్ట్రంలోని ధుబ్రి, నాగావ్, మోరిగావ్, బార్పెట,ర సౌత్ సల్మారా, గోల్పారా జిల్లాల్లోని ప్రజలకు ఆయుధాలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!