Himanta Biswa Sarma: కేసీఆర్ చంద్రుడి మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. దేశంలో సాధ్యం కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Himanta Biswa Sarma: కుటుంబ పార్టీలు వారి కోసమే ఆలోచిస్తాయని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. కేసీఆర్ కొత్త పార్టీ పెట్టుకోవచ్చని.. దేశంలో ప్రతిపక్షాలన్నీ కలిసే ఉన్నాయని.. కొత్తగా కేసీఆర్ వారిని ఏకం చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా అధికారంలోకి వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నయా నిజాం పరిపాలనను తెలంగాణలో అంతం చేస్తామన్నారు. 2024 లో అధికారంలోకి వచ్చేది మోడీనే ఆయన జోస్యం చెప్పారు.
దేశం ఏకంగానే ఉందన్న ఆయన.. రాహుల్కి నిజంగా దేశ భక్తి ఉంటే.. 1947 విభజన ఎక్కడ జరిగిందో అక్కడ యాత్ర చేయాలన్నారు. కుటుంబ పార్టీలు బిడ్డ కూతురు గురించి తప్ప దేశం కోసం ఆలోచించవన్నారు. బీజేపీని దేశ ప్రజల నుంచి ఎవరూ వేరు చేయలేరన్నారు. పార్టీలను ఏకం చేయడం కోసం కేసీఆర్ తిరుగుతుంటే.. బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజల్ని ఏకం చేయడానికి 50 ఏళ్లు పడుతుందేమో అని ఆయన అన్నారు. దేశ ప్రధానిగా మోడీ ఉన్నాడు.. భవిష్యత్లో కూడా ఉంటాడన్నారు. ఇంకో ముప్పై ఏళ్ల వరకు బీజేపీ అధికారంలో ఉంటుందన్నారు.
Also Read
Rahul Gandhi: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడవుతారా?.. ఈ ప్రశ్నకు ఆయన ఏమన్నారంటే?
కెసిఆర్ చంద్రుని మీదనో, సూర్యుని మీదనో సముద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కుంటే చేసుకోవాలి.. కానీ దేశంలో సాధ్యం కాదన్నారు. కేసీఆర్ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయాడు.. అందుకే జాతీయ పార్టీ అని అంటున్నాడన్నారు. కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చాలని… లేకుంటే దేశంలో ఎక్కడ తిరిగిన గౌరవం లభించదన్నారు. ఈడీ, సీబీఐ గురించి మాట్లాడే వారికి అవి అంటే భయం ఉందని… తప్పు చేయకపోతే వాళ్ల కార్యాలయానికి వెళ్లి కాగితాలు చూపెట్టి వచ్చు కదా అన్నారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy Flight Diverted: హైదరాబాద్లో భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి విమానం బెంగళూరుకు డైవర్ట్
-
Family Suicide: ఇంత ఘోరమా? ముక్కుపచ్చలారని పసిబిడ్డల పట్ల విలన్గా మారిన తండ్రి
-
TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
-
Fenya: ‘అమమ్మ’ అంటే డబ్బు, ‘చెత్త’ అంటే పోలీసులు..! దొంగలకు ఆయుధంగా మారిన రహస్య భాష..
-
Netanyahu: నేను ప్రధానిగా ఉన్నంత కాలం ఇరాన్ అణ్వస్త్రంగా మారదు.. నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!