Asaduddin Owaisi: చైనా పేరు చెబితేనే ప్రధాని మోదీ భయపడుతున్నారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi’s reaction on the border clash between India and China: అరుణాచల్ ప్రదేశ్ లో ఎల్ఏసీ వెంబడి తవాంగ్ సెక్టార్ వద్ద భారత్, చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది. గల్వాన్ ఘర్షణలు జరిగిన 30 నెలల తరువాత ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ప్రస్తుతం ఈ ఘర్షణలపై పొలిటికల్ వివాదం రాజుకుంటోంది. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. డిసెంబర్ 6న ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తలెత్తితే.. డిసెంబర్ 9న కేంద్ర రక్షణశాఖ మంత్రి ప్రకటన చేయడాన్ని తప్పపడుతున్నాయి విపక్షాలు.
రాజకీయ నాయకత్వాన్ని ప్రదర్శించడంతో ప్రధాని నరేంద్రమోదీ విఫలం అవుతున్నారని..ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. డిసెంబర్ 6న ఘర్షణ జరిగితే.. డిసెంబర్ 9న ప్రకటన చేశారని.. మీడియా రిపోర్ట్ చేయకపోతే మీరు దీనిపై మాట్లాడేవారు కాదని మండిపడ్డారు. అన్ని పార్టీలను ఘర్షణ జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. చైనా పేరు చెబితేనే ప్రధాని భయపడుతున్నారని.. చైనా గురించి మాట్లాడేందుకు ఆయన ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.
Also Read
- EPFO WhatsApp Service: PF క్లెయిమ్ స్టేటస్ నుంచి బ్యాలెన్స్ వరకు.. అన్నీ వాట్సాప్లోనే..
- West Bengal: మదర్సాలపై బెంగాల్ ప్రభుత్వం ఉక్కుపాదం.. 252 మూసివేత.. 100 సంస్థలకు షోకాజ్ నోటీసులు
- Bushra Bano: 'అస్సలాము అలైకుమ్, ఇన్షా అల్లా, జజాకల్లాహ్" అంటూ మతపరమైన వ్యాఖ్యలు చేసిన IPS.. ఫిర్యాదు దాఖలు.!
- Gurugram Road Rage: మహిళా బైకర్ను వెంబడించి ఢీకొట్టిన కారు? కెమెరాలో షాకింగ్ దృశ్యాలు
Read Also: Son Chops Up Father: శ్రద్ధా కేసును తలపించేలా.. తండ్రి శరీరాన్ని 32 ముక్కలు చేసిన కొడుకు
జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ఘటనపై స్పందించారు. పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలు కొనసాగించలేవకపోవడం విచారకరం అని అన్నారు. పాకిస్తాన్ తో మా సంబంధాలు బాగా లేవని.. కానీ చైనాతో కూడా మనకు మంచి సంబంధాలు లేవని అన్నారు. మాజీ ప్రధాని దివంగత ఏజీ అటల్ బీహారీ వాజ్ పేయి స్నేహితులను మార్చుకోవచ్చు అని.. మన పొరుగువారిని మార్చుకోలేమని అన్నారనే వ్యాఖ్యలను గుర్తు చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ ఘర్షణలపై స్పష్టత ఇవ్వడానికి అవకాశం ఇస్తామని సభా నాయకుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తో చెప్పినప్పటికీ.. అధికార పార్టీ మా మాట వినేందుకు సిద్ధంగా లేదని.. ఇది దేశానికి మంచింది కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం మన సైనికులతో ఉంటాం అని అన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన ప్రకటన చదివి బయటకు వెళ్లారని.. ఎలాంటి చర్చకు సిద్ధంగా లేరని విమర్శించారు.
తాజావార్తలు
-
Jasprit Bumrah Record: రీఎంట్రీ అదుర్స్.. జస్ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత!
-
Nawazuddin Siddiqui: ఒక్క సినిమా.. టేబుల్పై 200 స్క్రిప్టులు, బ్లాంక్ చెక్కులు.. నవాజుద్దీన్కు స్టార్ ఇమేజ్ తెచ్చిన మూవీ ఇదే!
-
India vs Afghanistan: భారత క్రికెట్లో చారిత్రక ఘట్టం.. మ్యాచ్కు ముందు తొలిసారి పూర్తి ‘వందేమాతరం’..
-
Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
-
Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
ట్రెండింగ్
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
-
Chamari Athapaththu: మేము చెత్తగా ఆడాం.. కన్నీరు ఆపుకోలేకపోయాను.. శ్రీలంక కెప్టెన్ భావోద్వేగం!
-
Vinayaka Vrata Katha: ‘వినాయక చవితి’ నాడు విజ్ఞాలను తొలిగించే ‘వినాయక వ్రత కథ’ మీకోసం..!