Asaduddin Owaisi: చైనా పేరు చెబితేనే ప్రధాని మోదీ భయపడుతున్నారు..
Asaduddin Owaisi’s reaction on the border clash between India and China: అరుణాచల్ ప్రదేశ్ లో ఎల్ఏసీ వెంబడి తవాంగ్ సెక్టార్ వద్ద భారత్, చైనా దళాల మధ్య ఘర్షణ జరిగింది. గల్వాన్ ఘర్షణలు జరిగిన 30 నెలల తరువాత ఇరు దేశాల మధ్య ఘర్షణలు తలెత్తాయి. ప్రస్తుతం ఈ ఘర్షణలపై పొలిటికల్ వివాదం రాజుకుంటోంది. బీజేపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. డిసెంబర్ 6న ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణ తలెత్తితే.. డిసెంబర్ 9న కేంద్ర రక్షణశాఖ మంత్రి ప్రకటన చేయడాన్ని తప్పపడుతున్నాయి విపక్షాలు.
రాజకీయ నాయకత్వాన్ని ప్రదర్శించడంతో ప్రధాని నరేంద్రమోదీ విఫలం అవుతున్నారని..ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ విమర్శించారు. డిసెంబర్ 6న ఘర్షణ జరిగితే.. డిసెంబర్ 9న ప్రకటన చేశారని.. మీడియా రిపోర్ట్ చేయకపోతే మీరు దీనిపై మాట్లాడేవారు కాదని మండిపడ్డారు. అన్ని పార్టీలను ఘర్షణ జరిగిన ప్రదేశానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. చైనా పేరు చెబితేనే ప్రధాని భయపడుతున్నారని.. చైనా గురించి మాట్లాడేందుకు ఆయన ప్రభుత్వం భయపడుతోందని విమర్శించారు.
Also Read
- India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
- Elections 2026: ఓటర్ల సునామీ.. బెంగాల్, తమిళనాడులో 1947 తర్వాత రికార్డ్ పోలింగ్
- Extramarital affair: భర్త స్నేహితుడితో ఏమిటా పని.. పైగా వాట్సాప్ స్టేటస్ కూడా పెట్టేసింది..
- Ration Cards: రేషన్ కార్డుదారులకు బిగ్ షాక్.. లక్షల కార్డులు రద్దు..
Read Also: Son Chops Up Father: శ్రద్ధా కేసును తలపించేలా.. తండ్రి శరీరాన్ని 32 ముక్కలు చేసిన కొడుకు
జమ్మూ కాశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కూడా ఈ ఘటనపై స్పందించారు. పొరుగు దేశాలతో భారత్ సత్సంబంధాలు కొనసాగించలేవకపోవడం విచారకరం అని అన్నారు. పాకిస్తాన్ తో మా సంబంధాలు బాగా లేవని.. కానీ చైనాతో కూడా మనకు మంచి సంబంధాలు లేవని అన్నారు. మాజీ ప్రధాని దివంగత ఏజీ అటల్ బీహారీ వాజ్ పేయి స్నేహితులను మార్చుకోవచ్చు అని.. మన పొరుగువారిని మార్చుకోలేమని అన్నారనే వ్యాఖ్యలను గుర్తు చేశారు.
అరుణాచల్ ప్రదేశ్ ఘర్షణలపై స్పష్టత ఇవ్వడానికి అవకాశం ఇస్తామని సభా నాయకుడు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ తో చెప్పినప్పటికీ.. అధికార పార్టీ మా మాట వినేందుకు సిద్ధంగా లేదని.. ఇది దేశానికి మంచింది కాదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం మన సైనికులతో ఉంటాం అని అన్నారు. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తన ప్రకటన చదివి బయటకు వెళ్లారని.. ఎలాంటి చర్చకు సిద్ధంగా లేరని విమర్శించారు.
తాజావార్తలు
-
Off The Record : కాంగ్రెస్ పెద్దలకు తలనొప్పిగా ఆర్మూర్ వ్యవహారాలు
-
Rose Lassi Recipe: ఎప్పుడైనా రోజ్ లస్సీని రుచి చూశారా..? ఇలా సింపుల్గా తయారు చేయండి.. వన్ మోర్ అనాల్సిందే..
-
Telangana Cabinet: రాష్ట్ర కేబినెట్లో కీలక నిర్ణయాలు.. అక్కడ అతి పెద్ద స్టేడియం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్..
-
India New Gaming Rules 2026: సర్కార్ సరి కొత్త గేమింగ్ రూల్స్.. ప్రయోజనకరమా లేక హానికరమా..?
-
Sanju Samson: సంజూ శాంసన్ వీర విహారం.. దెబ్బకు ఆ రికార్ట్స్ అన్నీ బ్రేక్..
ట్రెండింగ్
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!
-
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!
-
మిడ్-రేంజ్లో ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!
-
Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!