Son Chops Up Father: శ్రద్ధా కేసును తలపించేలా.. తండ్రి శరీరాన్ని 32 ముక్కలు చేసిన కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karnataka Man Chops Up Father’s Body Into 32 Pieces: ఢిల్లీ శ్రద్ధా వాకర్ ఉదంతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న వ్యక్తి అఫ్తాబ్ పూనావాలా, శ్రద్ధాను అత్యంత దారుణంగా హత్యచేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా చేసి, ఢిల్లీ సరిహద్దుల్లోని వివిధ ప్రదేశాల్లో పారేశాడు. శ్రద్ధా తండ్రి ఫిర్యాదు చేసిన తర్వాత 6 నెలల అనంతరం ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ఈ కేసు తర్వాత పలువురు కూడా శ్రద్ధాలాగే చంపుతాం అంటూ మహిళలు, యువతులను బెదిరించిన ఘటనలు కూడా చూశాం. కొందరైతే అదే తరహాలో హత్య చేసేందుకు ప్రయత్నించారు.
Read Also: India-China border clash: అరుణాచల్ ప్రదేశ్ ఘర్షణపై స్పందించిన చైనా..
Also Read
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
- Borewell Rescue: 10 గంటల పాటు రెస్క్యూ ఆపరేషన్.. 300 అడుగుల బోర్వెల్లో చిక్కుకున్న చిన్నారి సురక్షితం.!
ఇదిలా ఉంటే శ్రద్ధా కేసును తలపించేలా కర్ణాటకలో దారుణం జరిగింది. బాగల్ కోట్ కు చెందిన ఓ వ్యక్తి తన తండ్రిని హత్య చేసి, మృతదేహాన్ని 32 ముక్కలుగా చేసి బోర్ వెల్ లో పడేశాడు. ఈ హత్య కేసు వెలుగులోకి రావడంతో పోలీసులు బోర్ వెల్ నుంచి వ్యక్తి శరీరభాగాలను వెలికితీశారు. నిందితుడు విఠల కులాలీని అరెస్ట్ చేసి జ్యూడిషియల్ కస్టడీకి తరలించారు.
డిసెంబర్ 6న తండ్రి పరుశురామ్ కులాలి(53)ను కొడుకు విఠల(20) ఆవేశంతో ఇనుపరాడ్ తో కొట్టి హత్య చేశాడు. పరుశురాం నిత్యం మద్యం తాగి వచ్చి ఇద్దరు కొడుకుల్లో చిన్నవాడైన విఠలను తిడుతూ ఉండే వాడు. పరుశురాం భార్య, పెద్ద కొడుకు వేర్వేరుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో గత మంగళవారం వేధింపులు తాళలేక విఠల ఇనుపరాడ్ తో తండ్రిని కొట్టి హత్య చేశాడు. హత్య తర్వాత పరుశురామ్ మృతదేహాన్ని 32 ముక్కలుగా నరికి, బాగల్ కోట్ జిల్లాలోని ముధోల్ నగర శివార్లలోని మంటూర్ బైపాస్ సమీపంలో సొంత పొలంలోని ఓపెన్ బోర్ వెల్ లో శరీర భాగాలను పారేశాడు.
తాజావార్తలు
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..