Asaduddin Owaisi: కావాలనే బీజేపీ ముస్లింలను టార్గెట్ చేస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi on survey of Madrasas in UP, Uttarakhand: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కావాలనే ముస్లిం సమాాజాన్ని టార్గెట్ చేస్తున్నాయంటూ.. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మదర్సాలపై సర్వే నిర్వహిస్తున్నాయి. దీన్ని అసదుద్దీన్ వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చర్య ఉందని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో మదరసాలపై సర్వే చేయాలని నిర్ణయించాయి. దీన్ని అసదుద్దీన్ ఖండించారు. ఇది ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేయడమే అని మండిపడ్డారు. ప్రైవేటు పాఠశాలలు, ఆర్ఎస్ఎస్ పాఠశాలలు, మిషనరీ పాఠశాలను ఎందుకు సర్వే చేయడం లేదని.. వాటిల్లో కూడా సర్వేలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
- Exam Paper: ‘డార్లింగ్.. నీ కోసం పరీక్ష పేపర్లు లీక్ చేస్తా’ అంటూ.. విద్యార్థినిని లైంగికంగా వేధించిన ప్రొఫెసర్..
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మె బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
- Petrol and Diesel Prices: మళ్లీ పెరగనున్న పెట్రో ధరలు..! ఇంధన ధరలపై నిపుణుల హెచ్చరిక
Read Also: Madhya Pradesh: యాక్సిడెంట్ బాధితుడిని బుల్డోజర్లో ఆసుపత్రికి తరలింపు.. వీడియో వైరల్
తమ రాష్ట్రంలోని అన్ని మదరసాలపై సర్వే జరుగుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం తెలియజేసిన తర్వాత ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మదరసాలపై సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. గుర్తింపు లేని మదరసాలను గుర్తించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సర్వే ప్రారంభం అయింది.
ఇప్పటికే అస్సాంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ అక్రమంగా నిర్వహిస్తున్న మదరసాలపై చర్యలు ఆరంభిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 4 మదరసాలు నేల కూలాయి. అస్సాం రాష్ట్రంలో మదరసా కేంద్రంగా ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలోని అన్ని మదరసాలను సర్వే చేయాలని ఆదేశించారు. ఎవరైనా మదరసాల్లో బోధన చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తే తప్పకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన వెబ్ సైట్లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
-
Virat Kohli: “నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు”.. వారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిపడేశాడుగా.!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..