Asaduddin Owaisi: కావాలనే బీజేపీ ముస్లింలను టార్గెట్ చేస్తోంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Asaduddin Owaisi on survey of Madrasas in UP, Uttarakhand: బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు కావాలనే ముస్లిం సమాాజాన్ని టార్గెట్ చేస్తున్నాయంటూ.. ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు మదర్సాలపై సర్వే నిర్వహిస్తున్నాయి. దీన్ని అసదుద్దీన్ వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఈ చర్య ఉందని బీజేపీపై విమర్శలు గుప్పించారు.
ఇటీవల ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఆయా రాష్ట్రాల్లో మదరసాలపై సర్వే చేయాలని నిర్ణయించాయి. దీన్ని అసదుద్దీన్ ఖండించారు. ఇది ముస్లిం సమాజాన్ని టార్గెట్ చేయడమే అని మండిపడ్డారు. ప్రైవేటు పాఠశాలలు, ఆర్ఎస్ఎస్ పాఠశాలలు, మిషనరీ పాఠశాలను ఎందుకు సర్వే చేయడం లేదని.. వాటిల్లో కూడా సర్వేలు జరగాలని ఆయన డిమాండ్ చేశారు.
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
Read Also: Madhya Pradesh: యాక్సిడెంట్ బాధితుడిని బుల్డోజర్లో ఆసుపత్రికి తరలింపు.. వీడియో వైరల్
తమ రాష్ట్రంలోని అన్ని మదరసాలపై సర్వే జరుగుతుందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి మంగళవారం తెలియజేసిన తర్వాత ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డారు అసదుద్దీన్ ఓవైసీ. ఇప్పటికే ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మదరసాలపై సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. గుర్తింపు లేని మదరసాలను గుర్తించేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. మంగళవారం ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో సర్వే ప్రారంభం అయింది.
ఇప్పటికే అస్సాంలో బీజేపీ ప్రభుత్వం అక్కడ అక్రమంగా నిర్వహిస్తున్న మదరసాలపై చర్యలు ఆరంభిస్తోంది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో 4 మదరసాలు నేల కూలాయి. అస్సాం రాష్ట్రంలో మదరసా కేంద్రంగా ఉగ్రవాద కార్యక్రమాలు జరుగుతున్న నేపథ్యంలో సీఎం హిమంత బిశ్వ శర్మ రాష్ట్రంలోని అన్ని మదరసాలను సర్వే చేయాలని ఆదేశించారు. ఎవరైనా మదరసాల్లో బోధన చేసేందుకు ఇతర ప్రాంతాల నుంచి వస్తే తప్పకుండా ప్రభుత్వం తీసుకువచ్చిన వెబ్ సైట్లో వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!