Madhya Pradesh: యాక్సిడెంట్ బాధితుడిని బుల్డోజర్లో ఆసుపత్రికి తరలింపు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
patient was taken to the hospital in a bulldozer In madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వైద్యారోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండో నిరూపించే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో గతంలో అంబులెన్సులు లేకపోవడం, చికిత్స పొందుతూ..చనిపోయిన వారికి అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించకపోవడంతో బైకుపై మృతదేహాలను సొంతూరుకు తరలించిన ఘటనలు చూశాం. గతంలో మధ్యప్రదేశ్ మొరేనా జిల్లాలో ఓ ఎనిమిదేళ్ల పిల్లవాడు.. తన రెండేళ్ల తమ్ముడి శవాన్ని ఒడిలో పెట్టుకుని కూర్చున్న ఫోటోలు దేశవ్యాప్తంగా మారాయి.
తాజాగా మరోసారి ఆ రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు ఎలా తెలిపే సంఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని బుల్డోజర్ లో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మధ్యప్రదేవ్ కట్నీలో చోటు చేసుకుంది. యాక్సిడెంట్ కావడంతో తీవ్ర గాయాలైన ఓ వ్యక్తిని జేసీబీ బకెట్ లో పెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ కు ఫోన్ చేసినా.. సకాలంలో అధికారులు స్పందించలేదు. అరగంట వేచి చూసినా.. అంబులెన్స్ రాకపోవడంతో, బాధితుడి రక్తం పోతుండటంతో చేసేదేం లేక స్థానికంగా ఉన్న బుల్డోజర్ ముందు బకెట్ లో బాధితుడిని పడుకోపెట్టుకని ఆస్పత్రికి తీసుకువచ్చారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో మహేష్ బర్మన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
Also Read
- Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
READ ALSO: Icrisat: ఇండియాలోనే తొలిసారి.. పల్లీలను ఎక్స్రే తీసి క్వాలిటీ అందిస్తామంటున్న ఇక్రిశాట్
అరగంట తర్వాత కూడా అంబులెన్స్ రాకపోవడంతో.. పుష్పేంద్ర విశ్వకర్మ అనే వ్యక్తి జేసీబీ సహయంతో బాధితుడని ఆస్పత్రిలో చేర్పించేందుకు ముందుకు వచ్చాడు. ప్రస్తుతం యాక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తిని జేసీబీలో తరలిస్తున్న వీడియో వైరల్ గా మారింది. గతంలో కూడా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటలు అనేకం జరిగాయి. తలకు గాయంతో వచ్చిన ఓ వ్యక్తికి కండోమ్ రేపన్ తో డ్రెస్సింగ్ చేశారు. అంతకుముందు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో తోపుడు బండిలో ఆస్పత్రికి తరలించిన ఘటనలు చూశాం. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో వైద్యారోగ్య సౌకర్యాలకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
साइकिल, ठेले, कंधे के बाद अब मरीज सीधे जेसीबी में! कटनी का मामला है लोगों का कहना है कि एंबुलेंस सेवा को कॉल किया था लेकिन मिली नहीं. @ndtv @ndtvindia pic.twitter.com/CfxRlNfXEM
— Anurag Dwary (@Anurag_Dwary) September 13, 2022
తాజావార్తలు
-
SRH vs GT : గుజరాత్ ధాటికి సన్రైజర్స్ కుప్పకూలింది.. 86 పరుగులకే ఆలౌట్.!
-
Off The Record : ఆపరేషన్ ఆకర్ష్ రివర్స్? టీడీపీ నేతలపై వైసీపీ కన్ను.. ఏపీ రాజకీయాల్లో కొత్త మలుపు!
-
Piyush Goyal: అందరం కలిసి ముందుకెళ్లాల్సిన సమయం వచ్చింది.. పరిశ్రమలకు పీయూష్ గోయల్ హెచ్చరిక
-
Anjali Sardana: 23 ఏళ్ల యువతి.. రూ.1700 కోట్ల సామ్రాజ్యం!
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!