Madhya Pradesh: యాక్సిడెంట్ బాధితుడిని బుల్డోజర్లో ఆసుపత్రికి తరలింపు.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
patient was taken to the hospital in a bulldozer In madhya pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో వైద్యారోగ్య పరిస్థితి ఏ విధంగా ఉండో నిరూపించే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ రాష్ట్రంలో గతంలో అంబులెన్సులు లేకపోవడం, చికిత్స పొందుతూ..చనిపోయిన వారికి అంబులెన్స్ సౌకర్యాన్ని కూడా కల్పించకపోవడంతో బైకుపై మృతదేహాలను సొంతూరుకు తరలించిన ఘటనలు చూశాం. గతంలో మధ్యప్రదేశ్ మొరేనా జిల్లాలో ఓ ఎనిమిదేళ్ల పిల్లవాడు.. తన రెండేళ్ల తమ్ముడి శవాన్ని ఒడిలో పెట్టుకుని కూర్చున్న ఫోటోలు దేశవ్యాప్తంగా మారాయి.
తాజాగా మరోసారి ఆ రాష్ట్రంలో వైద్య సౌకర్యాలు ఎలా తెలిపే సంఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని బుల్డోజర్ లో ఆస్పత్రికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన మధ్యప్రదేవ్ కట్నీలో చోటు చేసుకుంది. యాక్సిడెంట్ కావడంతో తీవ్ర గాయాలైన ఓ వ్యక్తిని జేసీబీ బకెట్ లో పెట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంబులెన్స్ కు ఫోన్ చేసినా.. సకాలంలో అధికారులు స్పందించలేదు. అరగంట వేచి చూసినా.. అంబులెన్స్ రాకపోవడంతో, బాధితుడి రక్తం పోతుండటంతో చేసేదేం లేక స్థానికంగా ఉన్న బుల్డోజర్ ముందు బకెట్ లో బాధితుడిని పడుకోపెట్టుకని ఆస్పత్రికి తీసుకువచ్చారు. రెండు ద్విచక్రవాహనాలు ఢీకొనడంతో మహేష్ బర్మన్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.
Also Read
- PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
- King Cobra Rescue: అమ్మబాబోయ్.. 10 అడుగుల రాచనాగుని చుట్టుకుని బయటకు వచ్చిన మహిళ (వీడియో)
- BMC Taj Mahal Palace Hotel: 26/11 తర్వాత రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు.. తాజ్ హోటల్కు రూ. 22 కోట్ల నోటీసు జారీ
- NDA Majority: మెజారిటీకి కేవలం ఆరుగురు ఎంపీల దూరం.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ.. ఎన్డీఏ వ్యూహం ఫలిస్తుందా?
READ ALSO: Icrisat: ఇండియాలోనే తొలిసారి.. పల్లీలను ఎక్స్రే తీసి క్వాలిటీ అందిస్తామంటున్న ఇక్రిశాట్
అరగంట తర్వాత కూడా అంబులెన్స్ రాకపోవడంతో.. పుష్పేంద్ర విశ్వకర్మ అనే వ్యక్తి జేసీబీ సహయంతో బాధితుడని ఆస్పత్రిలో చేర్పించేందుకు ముందుకు వచ్చాడు. ప్రస్తుతం యాక్సిడెంట్ లో గాయపడిన వ్యక్తిని జేసీబీలో తరలిస్తున్న వీడియో వైరల్ గా మారింది. గతంలో కూడా మధ్య ప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి సంఘటలు అనేకం జరిగాయి. తలకు గాయంతో వచ్చిన ఓ వ్యక్తికి కండోమ్ రేపన్ తో డ్రెస్సింగ్ చేశారు. అంతకుముందు అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు సకాలంలో అంబులెన్స్ రాకపోవడంతో తోపుడు బండిలో ఆస్పత్రికి తరలించిన ఘటనలు చూశాం. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ రాష్ట్రంలో వైద్యారోగ్య సౌకర్యాలకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
साइकिल, ठेले, कंधे के बाद अब मरीज सीधे जेसीबी में! कटनी का मामला है लोगों का कहना है कि एंबुलेंस सेवा को कॉल किया था लेकिन मिली नहीं. @ndtv @ndtvindia pic.twitter.com/CfxRlNfXEM
— Anurag Dwary (@Anurag_Dwary) September 13, 2022
తాజావార్తలు
-
Diljit Dosanjh: రూ.1 రెమ్యునరేషన్ తీసుకున్న స్టార్ హీరో.. షాకింగ్ నిజం బయటపెట్టిన దర్శకుడు
-
Hyderabad: డ్రగ్స్ కలకలం.. ఎమ్మెల్సీ కుమారుడితో సహా ముగ్గురు అదుపులో, నలుగురు పరారీ..!
-
PM Modi: ఘనంగా ప్రారంభమైన పూరీ జగన్నాథ రథయాత్ర.. దేశ ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు..
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
Allu Arjun : అల్లు అర్జున్ తెలుగు డైరెక్టర్స్ను పట్టించుకోడా?
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
Team India Coaching Staff: టీమిండియా కోచింగ్ స్టాఫ్లో విభేదాలు.. ఆ ఇద్దరిలో ఒకరిపై వేటు తప్పదు?
-
12-అంగుళాల 2.8K OLED డిస్ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 10100mAh బ్యాటరీతో HUAWEI MatePad Air (2026) లాంచ్..!
-
Harry Brook: అదే మా ఓటమికి కారణం.. రెండో వన్డేలో టీమిండియాను దెబ్బ కొడతాం!
-
OLED డిస్ప్లే, 200MP కెమెరా, 100W ఫాస్ట్ ఛార్జింగ్తో HUAWEI Pura 90s Pro, Pura 90s Pro Max గ్లోబల్ లాంచ్..!