Kejriwal: రాజ్యసభకు కేజ్రీవాల్.. ఏ రాష్ట్రం నుంచంటే..!
- రాజ్యసభకు కేజ్రీవాల్
- పంజాబ్ కాంగ్రెస్ నేత బజ్వా ఆరోపణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందుకు పంజాబీయులు బయట వ్యక్తులను అంగీకరించబోరని తెలియడంతో కేజ్రీవాల్ వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. అయితే ఈ ప్రచారాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ తోసిపుచ్చారు.
ఇదిలా ఉంటే తాజాగా పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా మరో ఆరోపణ చేశారు. కేజ్రీవాల్.. పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ పేర్కొన్నారు. ఇటీవల ఈయన.. ఆప్కు చెందిన 32 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని బాంబ్ పేల్చారు. తాజాగా కేజ్రీవాల్.. రాజ్యసభ మార్గం వెతుకుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పొలిటికల్గా సంచలనంగా మారాయి.
Also Read
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
- PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
- Mohan Bhagwat: రిజర్వేషన్లు కొనసాగాలి, వారు వదులుకోవాలి: ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- Mohan Bhagwat: స్వలింగ వివాహాలపై మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
ఇటీవల పంజాబ్లో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి చనిపోయారు. ఈ స్థానంలో బైపోల్ జరగనుంది. ఈ ఎన్నిక ద్వారా కేజ్రీవాల్.. పంజాబ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూశారని ఆరోపణలు ఉన్నాయి. వ్యతిరేకత కారణంగా ఆయన వెనక్కి తగ్గినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఉపఎన్నికలో ఆప్ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను బరిలోకి దింపాలని చూస్తున్నారు. లూథియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో సంజీవ్ అరోరా పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ఊహాగానాలు అందుకున్నాయి. ఇక ఈ రాజ్యసభ సీటు ఖాళీ అయితే.. ఈ స్థానంలో కేజ్రీవాల్… రాజ్యసభలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కాంగ్రెస్ ఆరోపణలపై ఆప్ మాత్రం స్పందించలేదు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను.. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి నేతలంతా ఓటమి పాలయ్యారు. అతిషి మాత్రం అతి స్వల్ప మెజార్టీతో గట్టెక్కింది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం!
తాజావార్తలు
-
RBI Loan Recovery Rules: లోన్ తీసుకున్నవారికి గుడ్న్యూస్.. RBI కీలక ఆదేశాలు..!
-
Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
-
Bhindi Red Chilli Pachadi: వేడి వేడి అన్నంలో ‘బెండకాయ పచ్చడి’ వేసుకొని తింటే.. అబ్బో రుచి అదుర్స్ అంతే.!
-
Hyderabad: ఆ కత్తి ఎక్కడుంది?.. ఐఫోన్ ఏమైంది?.. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిని స్వయంగా విచారించిన సీపీ సజ్జనార్
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
ట్రెండింగ్
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!