Kejriwal: రాజ్యసభకు కేజ్రీవాల్.. ఏ రాష్ట్రం నుంచంటే..!
- రాజ్యసభకు కేజ్రీవాల్
- పంజాబ్ కాంగ్రెస్ నేత బజ్వా ఆరోపణ
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత కేజ్రీవాల్.. పంజాబ్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ ఆ మధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ అందుకు పంజాబీయులు బయట వ్యక్తులను అంగీకరించబోరని తెలియడంతో కేజ్రీవాల్ వెనక్కి తగ్గినట్లుగా సమాచారం. అయితే ఈ ప్రచారాన్ని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ తోసిపుచ్చారు.
ఇదిలా ఉంటే తాజాగా పంజాబ్ కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా మరో ఆరోపణ చేశారు. కేజ్రీవాల్.. పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లబోతున్నారంటూ పేర్కొన్నారు. ఇటీవల ఈయన.. ఆప్కు చెందిన 32 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్తో టచ్లో ఉన్నారని బాంబ్ పేల్చారు. తాజాగా కేజ్రీవాల్.. రాజ్యసభ మార్గం వెతుకుతున్నారని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు పొలిటికల్గా సంచలనంగా మారాయి.
Also Read
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
- Viral: ‘మీసాల పిల్ల’ అంటూ ఎగతాళి చేశారు.. కట్ చేస్తే ప్రశంసల హోరు..
- Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
ఇది కూడా చదవండి: CM Revanth Reddy: నేడు ప్రధాని మోడీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ!
ఇటీవల పంజాబ్లో ఆప్ ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి చనిపోయారు. ఈ స్థానంలో బైపోల్ జరగనుంది. ఈ ఎన్నిక ద్వారా కేజ్రీవాల్.. పంజాబ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని చూశారని ఆరోపణలు ఉన్నాయి. వ్యతిరేకత కారణంగా ఆయన వెనక్కి తగ్గినట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఉపఎన్నికలో ఆప్ రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను బరిలోకి దింపాలని చూస్తున్నారు. లూథియానా వెస్ట్ అసెంబ్లీ ఉప ఎన్నికలో సంజీవ్ అరోరా పోటీ చేస్తున్నట్లు ఇప్పటికే ఊహాగానాలు అందుకున్నాయి. ఇక ఈ రాజ్యసభ సీటు ఖాళీ అయితే.. ఈ స్థానంలో కేజ్రీవాల్… రాజ్యసభలోకి ఎంట్రీ ఇవ్వాలని భావిస్తున్నట్లు కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అయితే కాంగ్రెస్ ఆరోపణలపై ఆప్ మాత్రం స్పందించలేదు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఓటమి పాలైంది. 70 అసెంబ్లీ స్థానాలకు గాను.. బీజేపీ 48, ఆప్ 22 స్థానాలు గెలుచుకున్నాయి. కేజ్రీవాల్, మనీష్ సిసోడియా లాంటి నేతలంతా ఓటమి పాలయ్యారు. అతిషి మాత్రం అతి స్వల్ప మెజార్టీతో గట్టెక్కింది. ఇక ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ఇది కూడా చదవండి: Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు సజీవదహనం!
తాజావార్తలు
-
Crane Accident : శంకర్పల్లిలో విషాదం.. క్రేన్ కూలి ముగ్గురు మృతి
-
DC Vs RCB: హమ్మయ్య.. ‘49’ తప్పించుకున్నాం.. ఢిల్లీ క్యాపిటల్స్ హ్యాపీ..
-
Bordeaux : ఈ ఒక్క ప్రాంతం వైన్ ప్రపంచాన్ని ఎలా మార్చింది..??
-
Yatra: హీరోగా రజనీకాంత్ మనవడు.. కొడుకు సిల్వర్ స్క్రీన్ ఎంట్రీపై ధనుష్ క్లారిటీ ఇదే!
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
ట్రెండింగ్
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!