Arvind Kejriwal: జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలనని ప్రధాని మోడీకి చూపిస్తా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal: ఢిల్లీ సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయనని మరోసారి స్పష్టం చేశారు. శుక్రవారం ఓ జాతీయ ఛానెల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన పదవికి రాజీనామా చేస్తే దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని అన్నారు. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపగలనని ప్రధాని నరేంద్రమోడీకి చూపించబోతున్నానని అన్నారు. తన రాజీనామా గురించి మాట్లాడుతూ..‘‘ నరేంద్రమోడీకి కావాల్సింది ఇదే. ఎన్నికల్లో కేజ్రీవాల్ని ఓడించలేనని ఆయనకు తెలుసు. అందుకే ఈ ప్లాన్కి శ్రీకారం చుట్టారు. వారి తదుపరి లక్ష్యం పశ్చమ బెంగాల్, తమిళనాడు సీఎంలు మమతా బెనర్జీ, ఎంకే స్టాలిన్. తాను రాజీనామా చేస్తే దేశ ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుంది’’ అని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
Read Also: T. Harish Rao: బస్సు తప్పా అన్ని పథకాలు తుస్సే.. కాంగ్రెస్ ప్రభుత్వంపై హరీష్ రావు విమర్శలు
Also Read
- Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
- IMD: భారత్కు ఐఎండీ కీలక హెచ్చరిక.. ఈ ఏడాది కరువు తప్పదా?
- TCS Engineer Suicide: TCSలో సీనియర్ల వేధింపులు.. ఉద్యోగి ఆత్మహత్య..
- Fruit Poisoning: నారాయణగూడలో ఘోరం.. మామిడిపండ్లు తిని ఇద్దరు అక్కాచెల్లెళ్లు మృతి!
తనకు ఏ పదవిపై అత్యాశ లేదని చెప్పారు. ఢిల్లీలో మురికివాడల్లో పనిచేయడం కోసం ఇన్కమ్ ట్యాక్స్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేశానని, 49 రోజులకే ఢిల్లీ సీఎం పదవికి రాజీనామా చేశానని, కానీ ఈ రోజు నా పోరాటంలో భాగంగానే రాజీనామా చేయడం లేదని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని కేజ్రీవాల్ అన్నారు. సీఎం పదవికి రాజీనామాపై వారు పిల్ కూడా దాఖలు చేశారు, కానీ సుప్రీంకోర్టు రాజీనామా చేయమని బలవంతం చేయలేమని చెప్పిందని ఆయన గుర్తు చేశారు. సీఎంగా తన విధుల్ని నిర్వర్తించడానికి నాకు జైలులో ప్రాథమిక సౌకర్యాలను కల్పించాలని కోర్టును కోరుతానని చెప్పారు.
ఎక్కడ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయానా ప్రధాని మోడీ ప్రతిపక్ష ముఖ్యమంత్రుల్ని, ఇతర నేతల్ని అరెస్ట్ చేస్తారని, నేను రాజీనామా చేయకుంటే ఇతర ముఖ్యమంత్రులను ప్రధాని టచ్ చేయడానికి సాహసించరని అన్నారు. ఢిల్లి లిక్కర్ స్కామ్లో ఈడీ మార్చి 12న కేజ్రీవాల్ని అరెస్ట్ చేసింది. అయితే, ఎన్నికల్లో ప్రచారం కోసం సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. జూన్ 2న లొంగిపోవాలని ఆదేశించింది.
తాజావార్తలు
-
India vs Afghanistan: నేడే ఆఫ్గనిస్తాన్ – భారత్ మొదటి వన్డే.. అందరి దృష్టి అతడిపైనే.! మ్యాచ్కు వర్షం ముప్పు..
-
Sing-Geetham : ‘సింగ్-గీతమ్’ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చంటే ?
-
Deva Katta: డ్రాగన్ డైరెక్షన్ రూమర్స్.. దేవా కట్టా కీలక ప్రకటన
-
Explained: ఇథనాల్ పెట్రోల్ వాడకంలో బ్రెజిల్ సక్సెస్.. భారత్లో ఈ85 ఎందుకు సవాల్గా మారుతుంది?
-
200MP కెమెరా, 5000 నిట్స్ AMOLED డిస్ప్లే, మిలిటరీ గ్రేడ్ రక్షణతో Motorola Moto G Max 5G లాంచ్.!
ట్రెండింగ్
-
Sachin Tendulkar: “ఎత్తు ఎంతైనా సరే.. ఆటిట్యూడ్ మారకూడదు.!” ఆకాశంలోనూ క్రికెట్ ఆడిన సచిన్.!
-
Indian Railways: రైలు ఆలస్యమైనా ప్రయాణికుడి తప్పేనా..? ప్లాట్ఫామ్ టికెట్ సమయం ముగిసిందంటూ రూ.520 జరిమానా.! వీడియో వైరల్..
-
Mahabharata Lessons: కురుక్షేత్రం vs ఆధునిక వార్స్.. యుద్ధం కంటే ధర్మమే గొప్పది.. మహాభారతం నేర్పిన సత్యం ఇదే!
-
iQOO Flagship Days Sale ప్రారంభం.. iQOO 15, iQOO 15R, Neo 10పై భారీ తగ్గింపులు.!
-
Bangladesh History: ఆస్ట్రేలియాపై చరిత్ర సృష్టించిన బంగ్లాదేశ్.. క్రికెట్ చరిత్రలోనే మొదటిసారి!