370 ఆర్టికల్ను కాంగ్రెస్ పునరుద్ధరించలేదు: గులాంనబీ ఆజాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్ముకాశ్మీర్లో ఆర్టికల్ 370ను పునరుద్ధరించాలంటే కాంగ్రెస్ వల్ల అయ్యే పని కాదని .. ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. ఎందుకంటే 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 300 స్థానాల్లో గెలుపొందాలని, అది అసాధ్యమని అన్నారు. అధికరణ 370 రద్దుపై తన మౌనం గురించి జమ్మూ-కాశ్మీరులోని పూంఛ్ జిల్లా, కృష్ణఘాటి ఏరియాలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, దీనిని కేవలం సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం మాత్రమే పునరుద్ధరించగలవని ఆయన పేర్కొన్నారు. ‘మేము సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 300 మంది ఎంపీలు అవసరం, 2024 ఎన్నికల్లో 300 మంది ఎంపీలు గెలుపొందాలి. అప్పుడే ఆర్టికల్ 370ని పునరిద్ధరించగలం. అంత మంది ఎంపీలు గెలిచేదేప్పుడు..? ప్రస్తుతం ఆ పరిస్థితి కాంగ్రెస్లో కనిపించడం లేదు. అందుకే అధికరణ 370ని పునరుద్ధరిస్తానని వాగ్దానం చేయలేను’ అని ఆజాద్ వ్యాఖ్యానించారు.
దీంతో కాశ్మీర్లో కాంగ్రెస్ ఓట్లను కోల్పోయే ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని ఆజాద్ అన్నారు. ఇప్పటికి కాంగ్రెస్ గత వైభవాన్ని సాధించలేకుంటే ఇకపై కష్టతరంగా మారుతుందని ఆయన అన్నారు. కేవలం ఒక్క జమ్ము కాశ్మీర్ కాదు.. దేశంలో అన్ని రాష్ర్టాల్లో కాంగ్రెస్ పట్టును కోల్పోతుందని ఆజాద్ వ్యాఖ్యానించారు. దేశంలో బీజేపీని ఎదుర్కొవడానికి యూపీయే కూటమి పోరాడాల్సి ఉన్నా , ప్రస్తుత తరుణంలో ఆ పరిస్థితి కనిపించడం లేదని ఆజాద్ అన్నారు. యూపీఏ కూటమితోనే బీజేపీని ఢీకొనగలమని ఆదిశగా కాంగ్రెస్ అధిష్టానం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా ఆజాద్ అన్నారు.
Also Read
- Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
- Modi-Takaichi: మారుతీ మెగా ప్లాంట్ ప్రారంభించిన మోడీ, తకైచి
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
తాజావార్తలు
-
Harish Rao : జూపల్లి మాట మార్చారు.. చర్చకు రాకుండా తప్పించుకున్నారు
-
Petrol-Diesel: పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా?.. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీ కీలక వ్యాఖ్యలు
-
Retirement Age Increase: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వారందరికీ పదవీ విరమణ వయస్సు పెంపు.!
-
US: అమెరికాలో ఘోరం.. అగ్నిప్రమాదంలో గుజరాత్కు చెందిన కుటుంబం మృతి
-
KTR : రాహుల్, రేవంత్లతో చర్చకు సిద్ధం.. జూపల్లి ఎందుకు దూరాడో తెలీదు
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!