Mehbooba Mufti: “జై శ్రీరాం” నినాదాలు చేయాలని ముస్లింలను సైన్యం బలవంతం చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mehbooba Mufti: జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పిడిపి) నాయకురాలు మెహబూబా ముఫ్తీ సంచలన ఆరోపణలు చేశారు. శనివారం రోజున 50 ఆర్ఆర్కు చెందిన ఆర్మీ దళాలు పుల్వామాలోని మసీదులోకి ప్రవేశించి, అక్కడి ముస్లింలను ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేయమని బలవంతం చేశారని ఆరోపించారు. రెచ్చగొట్టే విధంగా సైన్యం ప్రవర్తించిందని దీనిపై విచారణ ప్రారంభించాలని లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘైనీని ఆమె కోరారు.
Read Also: KTR: తర్వలో జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాలు.. ఈ ప్రక్రియ అల్లం నారాయణకు అప్పగించామన్న కేటీఆర్
Also Read
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
- Operation Sindoor: పాకిస్తాన్ వేడుకున్నా దాడి చేశాం: మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్..
- Operation Sindoor: పాక్ అణుకేంద్రం ‘‘కిరాణా హిల్స్’’పై దాడి.. సంచలన నిజం చెప్పిన మాజీ CDS..
- Rahul Gandhi: కృతి సనన్ రక్షాబంధన్ యాడ్పై కంగనా విమర్శలు.. ఆమె ఇష్టమని రాహుల్గాంధీ మద్దతు
జూన్ 14న పాకిస్తాన్ నియంత్రణ రేఖ, కాశ్మీర్ లో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. వ్యూహాత్మకైన శ్రీనగర్ లోని చినార్ కార్ఫ్స్ ఆఫ్ ఆర్మీకి నాయకత్వం వహిస్తున్నారు. ముఫ్తీ ట్వీట్ చేస్తూ.. ‘‘50 ఆర్ఆర్కి చెందిన ఆర్మీ దళాలు పుల్వామాలోని మసీదులోకి చొరబడి లోపల ఉన్న ముస్లింలను ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేయడాన్ని గురించి విని షాక్ అయ్యాను. అమిత్ షా కాశ్మీర్ లో ఉన్నప్పుడు, అది కూడా యాత్రకు ముందు అలాంటి చర్యలు రెచ్చగొట్టడమే అవుతుంది. దీనిపై విచారణ చేయాలి’’ రాజీవ్ ఘయ్ ని అభ్యర్థించారు.
అంతకుముందు ఏప్రిల్ నెలలో శ్రీనగర్ లో జరిగిన జీ-20 సమావేశానికి ముందు స్థానిక వ్యక్తుల్ని భద్రతా బలగాలు అరెస్ట్ చేసి హింసిస్తున్నాయంటూ ఆమె ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్లో పరిస్థితి గ్వాంటనామో బే కంటే అధ్వాన్నంగా ఉందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం కాశ్మీర్ లో జీ -20 ఈవెంట్ నిర్వహించడానికి సన్నాహాలు ప్రారంభించినప్పటి నుండి, వందలాది మంది స్థానిక పురుషులను అదుపులోకి తీసుకున్నారని అన్నారు.
Shocked to hear about army troops from 50 RR storming into a mosque at Pulwama & forcing muslims inside to chant ‘Jai Shree Ram’. Such a move when @AmitShah is here & that too ahead of yatra is simply an act of provocation. Request @RgGhai to immediately set up a probe.
— Mehbooba Mufti (@MehboobaMufti) June 24, 2023
తాజావార్తలు
-
Sandeep Reddy Vanga : ప్రభాస్ ‘స్పిరిట్’ కి A సర్టిఫికెట్ పక్కా.. నేను ఎంత గింజుకున్నా అంతే!
-
Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
-
Sandeep Reddy Vanga : ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్!
-
Power Bank Explosion : పవర్ బ్యాంక్ పేలి విద్యార్థికి తీవ్ర గాయాలు
-
OTR: మంత్రి కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పిస్తారా..?
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!