Rahul Gandhi: ‘‘లిక్కర్ స్కామ్కి సూత్రధారి’’.. కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ విమర్శలు..
- కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ సంచలన విమర్శలు..
- లిక్కర్ స్కామ్ సూత్రధారి అంటూ ఆరోపణలు..
- ఆప్పై విరుచుకుపడిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా లోక్సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ‘‘మద్యం కుంభకోణానికి మూలకర్త’’ అని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ పట్పర్ గంజ్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Tucker Carlson: జో బైడెన్ పాలనలో పుతిన్ని చంపాలని ప్రయత్నించారు..
Also Read
- Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
- Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
- National Mourning: ఖతార్ మాజీ ఎమిర్ కన్నుమూత.. భారత్ కీలక నిర్ణయం..
- Success story: గ్రామీణ నేపథ్యం, IIT చదువు లేదు.. కానీ, రూ. 2.6 కోట్ల ప్యాకేజీ సాధించిన కుర్రాడు..
పట్పర్ గంజ్ నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా పోటీ చేస్తున్నారు. కేజ్రీవాల్ వచ్చినప్పుడు చిన్న కార్ ఉండేది, కొత్త తరహా రాజకీయాలు చేస్తానని ప్రకటించారు. ఢిల్లీని మారుస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఢిల్లీలో 2020 అల్లర్లు జరిగినప్పుడు కనిపించలేదు. ఆయన క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు, కానీ అతిపెద్ద మద్యం కుంభకోణం ఢిల్లీలోనే జరిగింది’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ‘‘శీష్ మహల్’’ కోసం రూ. 45 కోట్లు ఖర్చు చేసిందనే బీజేపీ ఆరోపణలను కూడా ప్రస్తావించారు. ‘‘ప్రధాని నరేంద్రమోడీ తనను తన ఇంటి నుంచి బయటకు నెట్టారు. ఆ సమయంలో ఇంటి కీని వారికి ఇచ్చి ఉంచుకోవచ్చని చెప్పాను. కానీ కేజ్రీవాల్ శీష్ మహల్లోనే ఉంటున్నారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్, ఆప్ మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. కలిసి పోటీ చేద్దామనే నిర్ణయాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆప్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కేజ్రీవాల్, ఆప్ లక్ష్యంగా కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 08న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
తాజావార్తలు
-
Shabad: 48 గంటలు దాటినా దొరకని నిందితుడు.. రూ.2 లక్షల రివార్డు ప్రకటించిన పోలీసులు.!
-
Vaibhav-BCCI: వైభవ్కు అవకాశం ఇవ్వాల్సింది కాదు.. బీసీసీఐ తప్పు చేసింది.. మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్బస్టర్ గ్యారెంటీ
-
Nag Ashwin: నేను ఏమి చేస్తున్నానో నాకు తెలుసు… ‘కల్కి’పై విమర్శలకు నాగ్ అశ్విన్ స్ట్రాంగ్ కౌంటర్
-
Bihar Bank Account Glitch: పింఛను తీసుకునే తండ్రీకొడుకుల ఖాతాలో.. ఏకంగా రూ. 1500 కోట్ల బ్యాలెన్స్..!
ట్రెండింగ్
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!
-
Kitchen Hacks : ఉల్లిపాయలు కోసేటప్పుడు కన్నీళ్లకు బైబై.. కళ్లమంటను తగ్గించే సింపుల్ చిట్కాలు.!
-
Health Tips : వర్షాకాలంలో అల్లం-పసుపు టీ ఎందుకు తాగాలి.?
-
Team India Coach: టీమిండియా కోచింగ్ స్టాఫ్ నుంచి ఒకరు అవుట్.. నెక్స్ట్ ఎవరు?.. భారీ ప్రక్షాళన తప్పదా?