Rahul Gandhi: ‘‘లిక్కర్ స్కామ్కి సూత్రధారి’’.. కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ విమర్శలు..
- కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ సంచలన విమర్శలు..
- లిక్కర్ స్కామ్ సూత్రధారి అంటూ ఆరోపణలు..
- ఆప్పై విరుచుకుపడిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా లోక్సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ‘‘మద్యం కుంభకోణానికి మూలకర్త’’ అని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ పట్పర్ గంజ్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Tucker Carlson: జో బైడెన్ పాలనలో పుతిన్ని చంపాలని ప్రయత్నించారు..
Also Read
- Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
- Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్పై కీలక విషయాలు
- Nepal Floods: నేపాల్ ప్రళయంలో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు
- Nepal Floods: నేపాల్ వరదల్లో 288 మంది భారతీయులు గల్లంతు.. కేంద్రం ప్రకటన..
పట్పర్ గంజ్ నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా పోటీ చేస్తున్నారు. కేజ్రీవాల్ వచ్చినప్పుడు చిన్న కార్ ఉండేది, కొత్త తరహా రాజకీయాలు చేస్తానని ప్రకటించారు. ఢిల్లీని మారుస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఢిల్లీలో 2020 అల్లర్లు జరిగినప్పుడు కనిపించలేదు. ఆయన క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు, కానీ అతిపెద్ద మద్యం కుంభకోణం ఢిల్లీలోనే జరిగింది’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ‘‘శీష్ మహల్’’ కోసం రూ. 45 కోట్లు ఖర్చు చేసిందనే బీజేపీ ఆరోపణలను కూడా ప్రస్తావించారు. ‘‘ప్రధాని నరేంద్రమోడీ తనను తన ఇంటి నుంచి బయటకు నెట్టారు. ఆ సమయంలో ఇంటి కీని వారికి ఇచ్చి ఉంచుకోవచ్చని చెప్పాను. కానీ కేజ్రీవాల్ శీష్ మహల్లోనే ఉంటున్నారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్, ఆప్ మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. కలిసి పోటీ చేద్దామనే నిర్ణయాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆప్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కేజ్రీవాల్, ఆప్ లక్ష్యంగా కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 08న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
తాజావార్తలు
-
Nepal Floods: నేపాల్లకు మరో ముప్పు.. 72 గంటల్లో మరో సరస్సు బద్ధలయ్యే ఛాన్స్!
-
Maharashtra: ఆటో, క్యాబ్ డ్రైవర్లకు ఊరట.. వివాదం వేళ మరాఠీ నేర్చుకునేందుకు ఏడాది గడువు
-
India Test Record: లంక గడ్డపై టీమ్ ఇండియా చరిత్ర.. 2010 నుంచి చెక్కుచెదరని రికార్డు
-
Operation Sindoor: S-400లను గుర్తించేందుకు పాకిస్తాన్ గూఢచారులు.. ఆపరేషన్ సిందూర్పై కీలక విషయాలు
-
Nepal Floods: నేపాల్ ప్రళయంలో మాజీ కేంద్ర మంత్రి కోడలు గల్లంతు
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!