Rahul Gandhi: ‘‘లిక్కర్ స్కామ్కి సూత్రధారి’’.. కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ విమర్శలు..
- కేజ్రీవాల్పై రాహుల్ గాంధీ సంచలన విమర్శలు..
- లిక్కర్ స్కామ్ సూత్రధారి అంటూ ఆరోపణలు..
- ఆప్పై విరుచుకుపడిన కాంగ్రెస్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: ఇండియా కూటమిలో భాగస్వాములుగా ఉన్న కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా లోక్సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్పై సంచలన ఆరోపణలు చేశారు. కేజ్రీవాల్ ‘‘మద్యం కుంభకోణానికి మూలకర్త’’ అని దుయ్యబట్టారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా మంగళవారం రాహుల్ గాంధీ పట్పర్ గంజ్లో జరిగిన ర్యాలీలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
Read Also: Tucker Carlson: జో బైడెన్ పాలనలో పుతిన్ని చంపాలని ప్రయత్నించారు..
Also Read
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
పట్పర్ గంజ్ నుంచి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం, ఆప్ నేత మనీష్ సిసోడియా పోటీ చేస్తున్నారు. కేజ్రీవాల్ వచ్చినప్పుడు చిన్న కార్ ఉండేది, కొత్త తరహా రాజకీయాలు చేస్తానని ప్రకటించారు. ఢిల్లీని మారుస్తానని చెప్పాడు. కానీ ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఢిల్లీలో 2020 అల్లర్లు జరిగినప్పుడు కనిపించలేదు. ఆయన క్లీన్ పాలిటిక్స్ గురించి మాట్లాడారు, కానీ అతిపెద్ద మద్యం కుంభకోణం ఢిల్లీలోనే జరిగింది’’ అని రాహుల్ గాంధీ విమర్శించారు. ఢిల్లీ సీఎంగా ఉన్న సమయంలో ‘‘శీష్ మహల్’’ కోసం రూ. 45 కోట్లు ఖర్చు చేసిందనే బీజేపీ ఆరోపణలను కూడా ప్రస్తావించారు. ‘‘ప్రధాని నరేంద్రమోడీ తనను తన ఇంటి నుంచి బయటకు నెట్టారు. ఆ సమయంలో ఇంటి కీని వారికి ఇచ్చి ఉంచుకోవచ్చని చెప్పాను. కానీ కేజ్రీవాల్ శీష్ మహల్లోనే ఉంటున్నారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు.
లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల నుంచి కాంగ్రెస్, ఆప్ మధ్య తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. కలిసి పోటీ చేద్దామనే నిర్ణయాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదని ఆప్ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కూడా విడివిడిగా పోటీ చేస్తున్నాయి. కేజ్రీవాల్, ఆప్ లక్ష్యంగా కాంగ్రెస్ విరుచుకుపడుతోంది. ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగనుండగా, ఫిబ్రవరి 08న ఓట్ల లెక్కింపు ఉండనుంది.
తాజావార్తలు
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
-
Story Board : మహా సంక్షోభం ఎవరి చేతుల్లో లేదా? ప్రజలు జాగ్రత్తలు పాటించాల్సిందేనా?
-
PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
-
Off The Record : మొక్కుబడి తంతుగా ట్రైనింగ్ క్యాంపెయిన్
-
Peddi Suspense : రామ్ చరణ్ పెద్దికి లైన్ క్లియర్ అవ్వలేదా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..