Kejriwal: ఇప్పుడు ఎన్నికలు జరిగినా గెలిచేది ఆమ్ ఆద్మీ పార్టీనే : కేజ్రీవాల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kejriwal: గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా చివరకు గెలిచేది ఆమ్ ఆద్మీ పార్టీనేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. ఇదే విషయాన్ని ఇంటెలిజెన్స్ బ్యూరో నివేదిక కూడా వెల్లడించిందని తెలిపారు. తక్కువ మార్జిన్ తోనే అయినప్పటికీ గుజరాత్ లో ఆప్ ప్రభుత్వం వస్తుందని ఐబీ రిపోర్ట్ చెపుతోందని అన్నారు. ఆప్ ఓట్లను చీల్చాలని బీజేపీ, కాంగ్రెస్ లు ఒక్కటయ్యాయని ఆరోపించారు. గుజరాత్ లో బీజేపీ పరిస్థితి చాలా విచిత్రంగా ఉందని… బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలిపోవాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని బీజేపీ బలోపేతం చేస్తోందని చెప్పారు. ఆప్ కు పడే ఓట్లలో వీలైనంత వరకు చీల్చే బాధ్యతను కాంగ్రెస్ కు అప్పగించారని అన్నారు. ఈ నేపథ్యంలో చాలా అప్రమత్తంగా ఉండాలని గుజరాత్ ప్రజలను కోరుతున్నానని చెప్పారు.
‘ఐబీ నివేదికతో బీజేపీ కుంగిపోయింది. కాంగ్రెస్, బీజేపీలు రహస్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నాయి. బీజేపీ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు ఆ పార్టీ నేతలు.. కాంగ్రెస్ను బలోపేతం చేయడానికి యత్నిస్తున్నారు. ఆప్ ఓట్లను కొల్లగొట్టే బాధ్యత కాంగ్రెస్కు అప్పగించారు’ అని రాజ్కోట్లో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Also Read
- PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
- Tamil Politics: విజయ్పై మొదలైన డీఎంకే విమర్శలు.. ఏం జరిగిందంటే..?
- PM Modi: మే 15 లోపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగొచ్చా.. మోడీ వ్యాఖ్యల ఆంతర్యం ఏమిటి.?
- CM Vijay Simplicity: దటీజ్ దళపతి.. సీఎం హోదాలో ఉన్నా.. టేబుల్ మోసి సింప్లిసిటీ చాటుకున్న విజయ్!
Read Also: Durga Puja: జాతిపితకు అసుర రూపం.. దుర్గా మండపంపై దుమారం
గుజరాత్ అసెంబ్లీలో కాంగ్రెస్ 10 సీట్లకు మించి గెలవదని.. విజయం సాధించిన వారూ బీజేపీలో చేరతారని కేజ్రీవాల్ పేర్కొన్నారు. ‘కాంగ్రెస్కు ఓటు వేయడం వృథా. బీజేపీ పాలనతో విసిగిపోయిన వారందరూ ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటు వేయండి. దిల్లీ, పంజాబ్ రికార్డులను బద్దలు కొట్టండి’ అని కేజ్రీవాల్ గుజరాత్ ప్రజలను అభ్యర్థించారు.
కాగా, గుజరాత్ కు ఈ ఏడాది డిసెంబర్ నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాని మోడీ స్వరాష్ట్రం కావడంతో దేశంలోని ప్రధాన పార్టీలన్నీ గుజరాత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. దశాబ్దాల పాటు రాష్ట్రాన్ని పాలిస్తున్న బీజేపీ ఈ దఫా అధికారం తమదేనన్న ధీమాతో ఉండగా.. బీజేపీని ఎలాగైనా ఓడించి అధికారం కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ , ఆప్ ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఇప్పటికే ప్రధాని మోడీ, అమిత్ షా, రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Modi : ‘రాముడు, కృష్ణుడిని చూడలేదు.. వారి అంశ ఉన్న మోడీని చూశా’ .. తనికెళ్ల భరణి ఎమోషనల్!
-
Trisha: అదే డ్రెస్, ఆ మాటే హింట్!.. విజయ్’తో లవ్ రూమర్స్’పై త్రిష రియాక్షన్!
-
Murder Case: జైలు నుంచే స్కెచ్.. రిటైర్డ్ ఐపిఎస్ హత్య కేసులో బయటపడుతున్న సంచలన విషయాలు.!
-
Kriti Sanon: మేమూ సమానంగా కష్టపడుతున్నాం.. హీరోలపై కృతి సనన్ ఫైర్!
-
SRH vs GT: ప్లేఆఫ్స్ హీట్.. హై వోల్టేజ్ ఫైట్.. హైదరాబాద్, గుజరాత్కు కీలక సమరం!
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?