High Court: డెడ్ బాడీని రేప్ చేయడం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
- ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పు
- మృతదేహంపై అత్యాచారం చేయడం నేరం కాదని స్పష్టం
- కేసు గురించి పూర్తి వివరాలివే..
ఛత్తీస్గఢ్ హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పు వెలువరించి ప్రజలను ఆశ్చర్యపరిచింది. మృతదేహంపై అత్యాచారం చేయడం నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. మృతదేహంపై అత్యాచారం (నెక్రోఫీలియా) అత్యంత హేయమైన చర్య అయినప్పటికీ.. ప్రస్తుతం చట్టంలో ఈ నేరానికి ఎలాంటి శిక్ష లేదని కోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ సిన్హా, జస్టిస్ బిభు దత్తా గురులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది.
READ MORE: Hyderabad: వాహనంలో గంజాయి సరఫరాపై ఖండించిన ఐకియా..
Also Read
- Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
- CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
- Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
- Beetroot Rice Recipe: ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి! హెల్తీ బీట్రూట్ పులావ్ తయారు చేయండిలా..
కేసు గురించి పూర్తి వివరాలు..
అక్టోబర్ 18, 2018న ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్లోని నిర్జన ప్రాంతంలో తొమ్మిదేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు.. నిందితులు నితిన్ యాదవ్, నీలకంఠం గణేష్ లను 2018 అక్టోబర్ 22న పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో.. నితిన్ యాదవ్ నేరాన్ని అంగీకరించాడు. బాలికను కిడ్నాప్ చేసి.. హత్య చేసినట్లు తెలిపాడు. అంతటితో ఆగకుండా ఆ బాలిక మృతదేహంపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. వీరిని ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టారు.
READ MORE: Canada: భారత్తో చెలగాటమాడిన కెనడా పరిస్థితి ఆగమాగం.. అమెరికా సాయం చేస్తుందా?
ఇందులో ప్రధాన నిందితుడైన నితిన్ యాదవ్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ట్రయల్ కోర్టు. సాక్ష్యాలను దొరక్కుండా చేసినందుకు నీలకంఠం నగేష్కు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు వెలువరించింది. బాలిక చనిపోయిన తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి నీలకంఠం నగేష్ ను మాత్రం అత్యాచారం కేసును పరిగణలోకి తీసుకోలేదు. ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా తీర్పునిచ్చింది. దీంతో బాధిత తల్లి ఛత్తీస్గఢ్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. శవంపై అఘాయిత్యానికి పాల్పడటం నేరం కాదని చెప్పింది.
తాజావార్తలు
-
Shocking: 55 ఏళ్ల గ్రామపెద్దతో లేచిపోయిన 22 ఏళ్ల భార్య..
-
Nara Rohit: తండ్రి కాబోతున్న నారా హీరో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోషూట్
-
CM Chandrababu: స్టేజ్పైనే అధికారులకు సీఎం చంద్రబాబు క్లాస్.. పనితీరుపై సీరియస్ వార్నింగ్..
-
IPL Rules: బౌలర్లకు న్యాయం కావాలి.. ఐపీఎల్ నిబంధనల్లో మార్పులు తప్పనిసరి!
-
Ambati Rambabu: అమరావతి నా జన్మలోనే కాదు.. చంద్రబాబు, లోకేష్ జన్మలో కూడా పూర్తి కాదు..!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!