High Court: డెడ్ బాడీని రేప్ చేయడం నేరం కాదు.. హైకోర్టు సంచలన తీర్పు
- ఛత్తీస్గఢ్ హైకోర్టు సంచలన తీర్పు
- మృతదేహంపై అత్యాచారం చేయడం నేరం కాదని స్పష్టం
- కేసు గురించి పూర్తి వివరాలివే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఛత్తీస్గఢ్ హైకోర్టు ఓ కేసులో సంచలన తీర్పు వెలువరించి ప్రజలను ఆశ్చర్యపరిచింది. మృతదేహంపై అత్యాచారం చేయడం నేరం కాదని కోర్టు స్పష్టం చేసింది. మృతదేహంపై అత్యాచారం (నెక్రోఫీలియా) అత్యంత హేయమైన చర్య అయినప్పటికీ.. ప్రస్తుతం చట్టంలో ఈ నేరానికి ఎలాంటి శిక్ష లేదని కోర్టు తెలిపింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ సిన్హా, జస్టిస్ బిభు దత్తా గురులతో కూడిన హైకోర్టు డివిజన్ బెంచ్ ఈ మేరకు తీర్పు వెలువరించింది.
READ MORE: Hyderabad: వాహనంలో గంజాయి సరఫరాపై ఖండించిన ఐకియా..
Also Read
కేసు గురించి పూర్తి వివరాలు..
అక్టోబర్ 18, 2018న ఛత్తీస్గఢ్ రాష్ట్రం గరియాబంద్లోని నిర్జన ప్రాంతంలో తొమ్మిదేళ్ల బాలిక మృతదేహం లభ్యమైంది. బాధిత తల్లి ఫిర్యాదు మేరకు.. నిందితులు నితిన్ యాదవ్, నీలకంఠం గణేష్ లను 2018 అక్టోబర్ 22న పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో.. నితిన్ యాదవ్ నేరాన్ని అంగీకరించాడు. బాలికను కిడ్నాప్ చేసి.. హత్య చేసినట్లు తెలిపాడు. అంతటితో ఆగకుండా ఆ బాలిక మృతదేహంపై అత్యాచారానికి ఒడిగట్టినట్లు పేర్కొన్నారు. ఈ ఘటన బయటకు రాకుండా జాగ్రత్త పడ్డారు. వీరిని ట్రయల్ కోర్టులో ప్రవేశపెట్టారు.
READ MORE: Canada: భారత్తో చెలగాటమాడిన కెనడా పరిస్థితి ఆగమాగం.. అమెరికా సాయం చేస్తుందా?
ఇందులో ప్రధాన నిందితుడైన నితిన్ యాదవ్కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ట్రయల్ కోర్టు. సాక్ష్యాలను దొరక్కుండా చేసినందుకు నీలకంఠం నగేష్కు 7 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ.. తీర్పు వెలువరించింది. బాలిక చనిపోయిన తర్వాత ఆమెపై అఘాయిత్యానికి పాల్పడి నీలకంఠం నగేష్ ను మాత్రం అత్యాచారం కేసును పరిగణలోకి తీసుకోలేదు. ఈ కేసులో నిందితుడిని నిర్దోషిగా తీర్పునిచ్చింది. దీంతో బాధిత తల్లి ఛత్తీస్గఢ్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన ధర్మాసనం.. ట్రయల్ కోర్టు తీర్పును సమర్థించింది. శవంపై అఘాయిత్యానికి పాల్పడటం నేరం కాదని చెప్పింది.
తాజావార్తలు
-
Story Board : పాస్ పోర్ట్ కేవలం ప్రయాణ పత్రమేనా..? ఇప్పుడు కేంద్రం వాదనేంటి..?
-
OTR: ధర్మవరం రాజకీయాల్లో హీట్… మంత్రి సత్యకుమార్ వ్యూహం మారిందా?
-
OTR : SIR రూల్తో ఓటర్లలో గందరగోళం – ఏ గట్టు ఎంచుకోవాలి?
-
OTR: మంత్రాలయం కోటను బద్దలు కొట్టేందుకు టీడీపీ మాస్టర్ ప్లాన్?
-
YS Jagan : ఏపీలో నడుస్తోంది గూండాల రాజ్యమా?.. చంద్రబాబుపై వైఎస్ జగన్ ఫైర్..
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!