Mid-Air “Peeing” Incident: తోటి ప్రయాణికురాలిపై మూత్ర విసర్జన.. ఎయిరిండియా విమానంలో మరో ఘటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mid-Air “Peeing” Incident: ఇటీవల న్యూయార్క్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానంలో తోటి ప్రయాణికురాలిపై మూత్రవిసర్జన చేశాడు ఓ వ్యక్తి. దీనిపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) తీవ్ర ఆగ్రహంతో ఉంది. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఈ కేసులో జాతీయ మహిళా కమిషన్ కూడా ఇన్వాల్వ్ అయింది. ఎయిరిండియా అంతర్గత విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు ఇటు డీజీసీఏ, అటు ఎయిరిండియా సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తిపై ఎయిరిండియా 30మ రోజుల నిషేధాన్ని విధించింది. ప్రస్తుతం నిందితుడు ముంబైలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన నవంబర్ 26న జరిగింది. అయితే మహిళ ఎయిరిండియా యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి వచ్చింది.
Read Also: Prince Harry : మా అన్న నన్ను పడేసి తన్నాడు.. అందుకే నడుం నొప్పి వచ్చింది
Also Read
- Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
- Parliament Monsoon Session: 'వందే మాతరం'ను అవమానిస్తే జైలుకే.. కేంద్రం కీలక బిల్లు సిద్ధం
- Parliament: పార్లమెంట్ సమావేశాల్లో కాంగ్రెస్ వ్యూహం ఇదే! గరంగరమేనా?
- CM Vijay: అవినీతిపై సీఎం విజయ్ సీరియస్.. మంత్రులకు స్ట్రాంగ్ వార్నింగ్
ఈ ఘటన మరవకముందే ఇలాంటిదే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 6న పారిస్-ఢిల్లీ ఎయిరిండియా విమానంలో కూడా ఓ వ్యక్తి మద్యం మత్తులో ఓ మహిళ ప్రయాణికురాలి దుప్పటిపై మూత్ర విసర్జన చేశారు. అయితే ప్రయాణికుడు వ్రాత పూర్వక క్షమాపణ చెప్పడంతో ఆ వివాదం అక్కడితో సద్దుమణిగింది. దీంతో అతనిపై ఎలాంటి శిక్షార్హమైన చర్య తీసుకోలేదని అధికారులు గురువారం తెలిపారు.
డిసెంబర్ 6న ఎయిరిండియా ఫ్లైట్ 142లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటన జరిగిన వెంటనే ఫ్లైట్ పైలట్ విషయాన్ని ఢిల్లీ ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ)కి నివేదించాడు, ఆ తర్వాత ప్రయాణీకుడిని పట్టుకున్నారు. మద్యం మత్తులో ఉన్న ప్రయాణికుడు క్యాబిన్ సిబ్బంది సూచనలను పాటించలేదని అధికారులు తెలిపారు. విమానం దిగిన వెంటనే సదరు ప్రయాణికుడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) పట్టుకుంది. అయితే ప్రయాణికుడు, మహిళ ప్రయాణికురాలికి వ్రాతపూర్వక క్షమాపణలు చెప్పడంతో పరస్పరం రాజీ కుదిరింది. మహిళా ప్రయాణికురాలు పోలీస్ కేసు పెట్టడానికి నిరాకరించింది. దీంతో ఇమ్రిగ్రేషన్, కస్టమ్స్ ఫార్మాలిటీలు పూర్తయిన తర్వాత ప్రయాణికుడిని బయటకు అనుమతించారు.
తాజావార్తలు
-
Bank Loan: ఎలాంటి పూచీ కత్తు లేకుండా రూ.20 లక్షల లోన్ .. ప్రాసెస్ ఇదే..
-
MG Motors: MG నుంచి కొత్త ADAPT టెక్నాలజీ.. EVలు, హైబ్రిడ్ కార్ల తయారీలో సంచలనం..
-
Kejriwal: సోనం వాంగ్చుక్కు కేజ్రీవాల్ మద్దతు.. యువత డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్
-
IND vs ENG 2nd ODI: సిరీస్ చేజిక్కించుకోవాలంటే బౌలర్ల చేతుల్లోనే.. ఇంగ్లాండ్ లక్ష్యం ఎంతంటే..
-
The Odyssey: ‘ది ఒడిస్సీ’ ప్రీ రివ్యూ ..
ట్రెండింగ్
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?
-
TGEAPCET 2026: రేపటి నుంచి రెండో విడత ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ప్రారంభం..!
-
50MP సోనీ కెమెరా, 7100mAh బ్యాటరీ, 2K 144Hz LTPO AMOLED డిస్ప్లేతో Motorola Edge 70 Max భారత్లో లాంచ్..!
-
144Hz డిస్ప్లే, 50MP కెమెరా, 8000mAh భారీ బ్యాటరీతో Realme NARZO 100x 5G భారత్లో లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!