Anna University Case: లైంగిక వేధింపుల కేసుని రాజకీయం చేస్తున్నారు.. హైకోర్ట్ ఫైర్..
- అన్నా యూనివర్సిటీ ఘటనను రాజకీయం చేస్తున్నారు..
- కీలక వ్యాఖ్యలు చేసిన మద్రాస్ హైకోర్టు..
- ఇటీవల క్యాంపస్లోనే 19 ఏళ్ల విద్యార్థినిపై లైంగిక దాడి..
- తమిళనాడులో సంచలనంగా మారిన ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anna University Case: చెన్నై అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల ఘటన తమిళనాడులో రాజకీయ దుమారానికి కారణమైంది. 19 ఏళ్ల యువతిపై వర్సిటీ క్యాంపస్లోనే లైంగిక దాడి జరిగింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తికి అధికార డీఎంకే పార్టీలో సంబంధాలు ఉండటం సంచలనంగా మారింది. అధికార ఎంకే స్టాలిన్ ప్రభుత్వంపై బీజేపీతో పాటు అన్నాడీఎంకే పార్టీలు మండిపడుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఈ కేసుని మద్రాస్ హైకోర్టు సమోటోగా స్వీకరించింది. అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల ఘటనను రాజకీయం చేస్తు్న్నారంటూ గురువారం హైకోర్టు మండిపడింది. “అన్నా యూనివర్సిటీ లైంగిక వేధింపుల కేసును రాజకీయం చేస్తున్నారు. మహిళల భద్రతపై అసలు ఏకాగ్రత లేదు” అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై చెన్నైలో నిరసనకు పోలీసుల అనుమతి నిరాకరించడంపై పట్టాలి మక్కల్ కట్చి (పిఎంకె) కోర్టుని ఆశ్రయించిన సందర్భంలో హైకోర్టు ఈ కామెంట్స్ చేసింది.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Hyundai Creta EV: హ్యుందాయ్ క్రెటా ఈవీ టీజర్ విడుదల.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 473కి.మీ రేంజ్..
ఈ కేసుని విచారించేందుకు జాతీయ మహిళా కమిషన్ (NCW) రిటైర్డ్ IPS అధికారి ప్రవీణ్ దీక్షిత్తో సహా ఇద్దరు సభ్యుల నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. రెండు రోజుల విచారణలో యూనివర్సిటీని సందర్శించిన కమిటీ, బాధితురాలు, ఆమె కుటుంబం, అధికారులు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశమై క్యాంపస్ భద్రతను అంచనా వేసింది.
డిసెంబర్ 23న అన్నా యూనివర్సిటీ క్యాంపస్లో 19 ఏళ్ల ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగిక దాడి జరిగింది. తనపై, తన స్నేహితుడిపై దాడి చేసి దుండగులు అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఫిర్యాదు అందిన కొద్దిసేపటికే, రోడ్డు పక్కన బిర్యానీ వ్యాపారి జ్ఞానశేఖరన్ నిందితుడిగా గుర్తించి అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై తమిళనాడులో ప్రజాగ్రహం పెల్లుబికింది. ఈ కేసుని విచారించేందుకు ముగ్గురు ఐపీఎస్ అధికారులతో సిట్ని ఏర్పాటు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
తాజావార్తలు
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
-
AP TET 2026: ఏపీ టెట్ షెడ్యూల్ వచ్చేసింది.. జూన్ 5న నోటిఫికేషన్.. పరీక్షలు ఎప్పుడంటే..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!