PM Modi: డీఎంకేపై కోపంతో బీజేపీ వైపు తమిళ ప్రజలు.. అన్నామలైపై ప్రధాని ప్రశంసలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PM Modi: తమిళ పార్టీ డీఎంకేతో పాటు దానితో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన వ్యతిరేక వైఖరిని అవలంభిస్తున్న డీఎంకేతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడానికి కారణమేంటని ప్రశ్నించారు. డీఎంకేపై తమిళ ప్రజల్లో విపరీతమైన ఆగ్రహం ఉందని, ఇది ప్రజల్ని బీజేపీ వైపు మళ్లేలా చేస్తుందని ప్రధాని ఈరోజు ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. బీజేపీ ఐదు తరాలుగా దక్షినాది రాష్ట్రాల్లో పనిచేస్తోందని, ప్రజలు కాంగ్రెస్పై నిరాశ చెందినప్పుడు ప్రాంతీయ పార్టీల వైపు వెళ్లారని, ఇప్పుడు వాటితో విసుగు చెందిన బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రధాని అన్నారు.
వివిధ రాష్ట్రాల్లో నివసిస్తున్న తమిళ ప్రజలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధిని అక్కడి వాళ్లకు చెబుతున్నారని, ‘‘తమిళ కాశీ సంగమాన్ని’’ నిర్వహించే సమయంలో డీఎంకే పార్టీ తమను ‘పానీపూరి వాలా’ అంటూ ఎగతాళి చేసింది. కానీ తమిళ ప్రజలు కాశీ సంగమానికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగే అభివృద్ధిని చూసి, తాము వినేది నిజం కాదని గమనించారని ప్రధాని అన్నారు.
Also Read
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
- IndiGo Flights Suspended: విదేశీ ప్రయాణికులకు అలర్ట్.. కీలక రూట్లలో ఇండిగో సర్వీసులు రద్దు
- Religious Conversion: ‘‘ఇస్లాంలోకి మారాలని ఒత్తిడి’’.. TCS తర్వాత విప్రోపై ఆరోపణలు..
Read Also: Abhishek Sharma: సిద్ధూ మూసేవాలాకు బిగ్ ఫ్యాన్ను.. నా ఆరాధ్యదైవం ఎవరో తెలుసా..?
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలైపై ప్రధాని ప్రశంసలు కురిపించారు. ఆయన మంచి నాయకుడని, బీజేపీ కుటుంబ పార్టీ కాదని అందరికి అవకాశాలు ఉంటాయని చెప్పారు. యువకుడు ఐపీఎస్ క్యాడర్ వదిలేసి బీజేపీలో చేరారని, ఒక వేళ ఆయన డీఎంకేలోకి వెళ్తే పెద్ద పేరు తెచ్చుకునే వారు కానది అన్నారు. ప్రతీ కార్యకర్తకు బీజేపీ అవకాశం ఇస్తుందని, కుటుంబ పార్టీల్లో ఇలాంటివి ఉండవని చెప్పారు. మహాత్మా గాంధీ పేరుతో సంబంధం ఉన్న కాంగ్రెస్ పార్టీ, మెడలో రద్రాక్ష మాల ధరించిన ఇందిరా గాంధీతో సంబంధం ఉన్న కాంగ్రెస్, సనాతన ధర్మాన్ని హేళన చేస్తున్న డీఎంకేతో ఎందుకు అంటకాగుతుందని ప్రధాని ప్రశ్నించారు.
డీఎంకే నేతలు ప్రత్యేక దేశం అని పలుమార్లు వ్యాఖ్యానించడం మాట్లాడుతూ.. భారత్ పూర్తిగా వైవిధ్యం కలిగిన దేశమని ప్రధాని సమాధానమిచ్చారు. బీజేపీ 400 స్థానాలు గెలిస్తే ఒకే భాష, ఒకే మతం అని ఆరోపిస్తున్న కాంగ్రెస్పై ప్రధాని ఫైర్ అయ్యారు. ఐక్యరాజ్యసమితికి వెళ్లి ప్రపంచంలోనే అతి పురాతన భాష ‘తమిళం’ అని చెప్పిన వ్యక్తి గురించి ఎలా విమర్శి్స్తున్నారో నాకు అర్థం కావడం లేదని అన్నారు.
తాజావార్తలు
-
Lufthansa Boeing 787 : గేట్ వద్దే కుప్పకూలిన బోయింగ్ 787 విమానం.. వైరల్ వీడియోలతో కలకలం
-
Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
-
DMK: లోక్సభలో కాంగ్రెస్తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
-
Janvi Kapoor : ‘అచ్చియమ్మ’ కూడా అచ్చి రాలేదే!
-
Ram Charan: ‘చిట్టిబాబు’ వర్సెస్ ‘పెద్దిగాడు’: రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ ఏది?
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!