Amul Milk: సామాన్యుడికి షాక్.. గుజరాత్ మినహా దేశవ్యాప్తంగా పెరిగిన అమూల్ పాల ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amul hikes price of milk by Rs 2 per litre: పండగ సీజన్ ముందు సామాన్యులకు షాకిచ్చే నిర్ణయం తీసుకుంది ప్రముఖ పాల ఉత్పత్తి సంస్థ అమూల్. గుజరాత్ కోఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్, అమూల్ బ్రాండు పేరుతో దేశవ్యాప్తంగా పాలను విక్రయిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థ లీటర్ పాల ధరను రూ.2 పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఫుల్ క్రీమ్ మిల్క్ ధర లీటర్ కు రూ. 61 నుంచి 63కు పెరగనుంది. ఇది సామాన్యుల బడ్జెట్ పై తీవ్ర ప్రభావాన్ని చూపించనుంది.
Read Also: PFI: తెలంగాణలో దాడులకు పీఎఫ్ఐ కుట్ర.. అలర్టైన ఇంటెలిజెన్స్
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
గుజరాత్ మినహా అన్ని రాష్ట్రాల్లో కూడా ఫుల్ క్రీమ్ మిల్క్ ధర, గేదె పాల ధరలను లీటర్ కు రూ.2 పెంచుతున్నట్లు ఆ సంస్థ ఎండీ ఆర్ఎస్ సోధి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగబోతున్న గుజరాత్ లో మాత్రం ధరలను పెంచలేదు. దేశంలో మిగతా రాష్ట్రాల్లో పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. డెయిరీ ఫ్యాట్ ధరల్లో డిమాండ్ పెరగడంతో పాల ధరలను పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. మదర్ డైరీ కూడా పాల సేకరణ ఖర్చుల పెరుగుదలను భర్తీ చేసేందుకు ధరలను పెంచింది.
దీనికి ముందు ఈ ఏడాది మార్చిలో కూడా పాలధరలను పెంచారు. అయితే అమూల్ సంస్థ ఆగస్టులో అమూల్ గోల్డ్, శక్తి పాల బ్రాండ్ల ధరలను లీటర్ కు రూ. 2 పెంచుతున్నట్లు ప్రకటించింది. తాజాగా రెండు నెలల తర్వాత మరోసారి పాల ధరలను పెంచింది. మరోవైపు ఇటీవల లంపీ స్కీన్ వైరస్ వ్యాధి వల్ల గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో పశువులు మృత్యువాత పడ్డాయి. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ రాష్ట్రాల్లో 45 శాతానికి పైగా పాల ఉత్పత్తి తగ్గిపోయింది. దీంతో ఉత్పత్తి, పంపిణీలో తేడాలు వచ్చాయి. ఈ రాష్ట్రాలతో పాటు మొత్తం దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో లంపీ స్కిన్ వ్యాధి ప్రభావాన్ని చూపించింది. ఇప్పటి వరకు ఈ వ్యాధి వల్ల భారతదేశంలో లక్షకు పైగా పశువులు మరణించాయి.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!