PFI: తెలంగాణలో దాడులకు పీఎఫ్ఐ కుట్ర.. అలర్టైన ఇంటెలిజెన్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
PFI: ఆర్ఎస్ఎస్, హిందూ ధార్మికసంస్థలు టార్గెట్గా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) దాడులకు పాల్పడవచ్చన్న సమాచారం మేరకు ఇంటిలిజెన్స్ బృందం అప్రమత్తమైంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంతో పాటు ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేలా యువకులను రెచ్చగొడుతుందన్న నెపంతో ఐదేళ్లపాటు కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ఐపై బ్యాన్ విధించింది. దీనిపై ఆ సంస్థ నేతలు, కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమపై కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని, నిషేధం విధించడం దారుణమంటూ వ్యాఖ్యానిస్తున్నారు.
ఇక తాజాగా తెలంగాణ రాష్ట్రంలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సభ్యులు దాడులు కొనసాగించే అవకాశం ఉందన్న హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ ఇంటెలిజెన్స్ అప్రమత్తమైంది. కేరళ, తమిళనాడులలో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కుట్ర పన్నిందని, దీంతో తెలంగాణా ఇంటిలిజెన్స్ అప్రమత్తమైంది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కార్యకలాపాలపై అలర్ట్ గా ఉండాలని, పీఎఫ్ ఐ దాని అనుబంధ సంస్థల పై నిఘా ఉంచాలని హెచ్చరికలు జారీ చేసింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడానికి రంగంలోకి దిగారు.
Also Read
- Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
- Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
- Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
- Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
Read Also: Jammu Kashmir: కాశ్మీర్లో ఉగ్రవాదుల ఘాతుకం.. కాశ్మీర్ పండిట్ హత్య
దేశవ్యాప్తంగా 15 రాష్ట్రాల్లో గతంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సోదాలు నిర్వహించింది. పీఎఫ్ఐ కార్యాలయాలు, కార్యకర్తల ఇళ్లల్లో తనిఖీలు చేపట్టింది. ఈ దాడుల్లో తెలుగు రాష్ట్రాల్లో కూడా పలువురిని అరెస్ట్ చేయడం కలకలం రేపింది. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానంతో దేశవ్యాప్తంగా 45 మంది నేతలను అరెస్ట్ చేసింది. ఈ ఏడాది 12న పాట్నా పర్యటన సమయంలో ప్రధాని మోదీ హత్యకు కూడా పీఎఫ్ఐ కుట్ర చేసినట్లు గుర్తించింది.
దీంతో పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై చర్యలు తీసుకోవాలని, నిషేధం విధించాలని కేంద్ర హోంశాఖకు నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఓ నివేదిక సమర్పించింది. ఈ నివేదికలో ఇచ్చిన అంశాలను కేంద్ర హోంశాఖ క్షుణ్నంగా పరిశీలించింది. అనంతరం చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు, దేశ భద్రతకు ముప్పు వాటిల్లేలా కార్యకలాపాలు నడిపిస్తుందనే కారణంతో పీఎఫ్ఐ, దాని అనుబంధ సంస్థలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిషేధంపై ఎంఐఎం అధినేత అసుదుద్దీన్ ఓవైసీ స్పందించారు. పీఎఫ్ఐపై బ్యాన్ విధించినట్లుగానే ఆర్ఎస్ఎస్పై కూడా నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. పీఎఫ్ఐపై నిషేధం విధించడాన్ని ఆయన ఖండించారు.
తాజావార్తలు
-
Arijit Singh: గూండాల్లా విద్యార్థులపై దాడి చేస్తారా? ఢిల్లీ ఘటనపై ప్రముఖ సింగర్ ధ్వజం
-
Cristiano Ronaldo: అర్జెంటీనాపై వివాదాస్పద పోస్ట్ను రొనాల్డో లైక్ చేశారా? సోషల్ మీడియాలో నెటిజన్ల రచ్చ..
-
Adluri Laxman : అధికారంలో ఉన్నప్పుడు రైతులు కనిపించలేదా..!
-
Oppo Smartphone Price: షాపింగ్ చేయడానికి ముందే చెక్ చేసుకోండి.. అమల్లోకి వచ్చిన ఒప్పో కొత్త రేట్లు..
-
Honeymoon Murder Case: ‘మీ భర్తపై దాడి జరిగినప్పుడు మీరేం చేశారు’ సోనమ్కు సుప్రీంకోర్టు పలు ప్రశ్నలు
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!