Amit Shah: రేపటి నుంచి ఛత్తీస్గఢ్లో అమిత్ షా పర్యటన.. నక్సల్స్ వ్యతిరేక చర్యలపై సమీక్ష
- రేపటి నుంచి మూడు రోజుల పాటు ఛత్తీస్గఢ్లో అమిత్ షా పర్యటన..
- నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో భద్రతపై జరిగిన సమీక్షలో పాల్గొననున్న షా..
- ఛత్తీస్గఢ్ను మావోయిస్టు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: అమిత్ షా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amit Shah: ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. ఆగస్టు నెలలో నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలపై ఉన్నత స్థాయి సమావేశం జరిగిన తర్వాత ప్రస్తుతం ఆయన అధ్యక్షతన జరగబోయే భద్రతా సమీక్ష సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టులు లొంగిపోవాలి లేదా భయంకరమైన పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇక, గత ఏడాది డిసెంబర్లో ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నక్సలైట్ల తిరుగుబాటును పరిష్కరించడంలో సక్సెస్ అయిందన్నారు. ఈ సంవత్సర కాలంలో 90 మంది మావోయిస్టులు మృతి చెందారని, 123 మంది అరెస్ట్ కాగా, మరో 250 మంది పోలీసుల ముందు లొంగిపోయారని కేంద్ర మంత్రి అమిత్ షా గుర్తు చేశారు.
Read Also: Telangana Weather: ఉమ్మడి జిల్లాలో మళ్ళీ పెరిగిన చలి తీవ్రత.. సింగిల్ డిజిట్కు కనిష్ట ఉష్ణోగ్రతలు
Also Read
- Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
- Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. సుఖేందు శేఖర్ రాయ్ టీఎంసీని వీడి రాజ్యసభ ఎంపీ పదవికి రాజీనామా
- Relationship Controversy: అందానికి ముగ్ధుడై పిల్లనిచ్చిన అత్తతో ప్రేమలో పడ్డ అల్లుడు.. లేచిపోయి వివాహం
- INDIA Alliance Meeting: విజయ్ పార్టీకి ఊహించని పరిణామం.. టీవీకేను పక్కన పెట్టిన ఇండియా కూటమి?
ఇక, బస్తర్లోని భద్రతా బలగాల ఫార్వర్డ్ బేస్లో ఒక రాత్రి ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్లాన్ చేస్తున్నారు. అలాగే, అక్కడ నక్సల్స్ నియంత్రణ నుంచి విముక్తి పొందే ప్రాంతాలలో మౌలిక సదుపాయాల పనులను సమీక్షించనున్నారు. హింసను విస్మరించి జనజీవన స్రవంతిలో కలవాలని సూచించారు. దశాబ్దాల నాటి నక్సల్ సమస్యను అంతం చేసి, ఈ ప్రాంతానికి కొత్త గుర్తింపును నెలకొల్పాలని స్థానిక ప్రజలు కోరుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఈ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలకు భారీ షాక్ ఇచ్చాం.. ఇక, బస్తర్లో సేఫ్ జోన్లు లేవు.. అక్కడ శాంతిని నెలకొల్పడం మా యొక్క ప్రధాన లక్ష్యం అని అమిత్ షా వెల్లడించారు. అయితే, బుధవారం నాడు ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఢిల్లీలో అమిత్ షాను కలిసి.. రాష్ట్రంలో కొనసాగుతున్న మావోయిస్టు వ్యతిరేక కార్యకలాపాలపై పూర్తి సమాచారాన్ని వివరించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఇప్పుడు రైతుల భూ రికార్డులను ఎవరూ ట్యాంపర్ చేయలేరు!
-
Praggnanandhaa: సీఎం విజయ్కు చెక్మేట్.. సత్కారంతో పాటు రూ.50 లక్షల నగదు బహుమతి.!
-
Jasprit Bumrah: ఐపీఎల్ పూర్తి సీజన్ ఆడుతాడు, భారత్ మ్యాచ్లు మాత్రం ఆడడా.. బుమ్రాపై మాజీ క్రికెటర్ ఫైర్!
-
ATM Withdrawals: ఏటీఎం నుంచి డబ్బు తీసేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా.. మీ ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదం ఉంది!
-
Vivo X Fold 6: ఏఐ ఫీచర్లు, న్యూ యూజర్ ఇంటర్ఫేస్తో.. వివో ఎక్స్ ఫోల్డ్ 6 త్వరలో విడుదల
ట్రెండింగ్
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!