Bangladesh: ఇండియాతో సంబంధాలపై బంగ్లా ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- భారత్ ముఖ్యమైన పొరుగుదేశం..
- షేక్ హసీనా ఎపిసోడ్ ‘‘చారిత్రకమైనది’’..
- భారత్తో సంబంధాలపై బంగ్లా ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
Bangladesh: బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత, భారత్-బంగ్లాల మధ్య సంబంధాలు మునుపటిలా లేవు. ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్ భావజాలం, హిందువులపై దాడులు, భారత్ వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. దీనికి తోడు బంగ్లాదేశ్ ఇటీవల కాలంలో పాకిస్తాన్తో సంబంధాలను పెంచుకుంటోంది. ఈ పరిణామాలు భారత్కి ఆందోళనకరంగా మారాయి.
ఇదిలా ఉంటే, భారత్-బంగ్లాదేశ్ మధ్య క్షీణిస్తున్న సంబంధాలపై ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ మౌనం వీడారు. ఆయన డైలీ ప్రోథోమ్ ఆలోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని ‘‘ముఖ్యమైన పొరుగుదేశం’’ అని చెప్పారు. ఇండియాపై బంగ్లాదేశ్ అనేక విధాలుగా ఆధారపడి ఉందని వెల్లడించారు. రెండు దేశాల మధ్య ‘‘గివ్ అండ్ టేక్ రిలేషన్స్’’ ఉన్నాయని, ఇది న్యాయం, సమానత్వంపై ఆధారపడి ఉందని, ఈ సూత్రాల ఆధారంగా ఢాకా, న్యూఢిల్లీతో మంచి సంబంధాలను కొనసాగిస్తుందని చెప్పారు.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: Tragedy: భార్యతో గొడవ, బావిలో దూకిన భర్త.. రక్షించే క్రమంలో మరో నలుగురు మృతి..
“భారతదేశం ఒక ముఖ్యమైన పొరుగు దేశం. మనం అనేక విధాలుగా భారత్పై ఆధారపడి ఉన్నాం. మరియు భారతదేశం కూడా మన నుండి సౌకర్యాలను పొందుతోంది. వారి ప్రజలు పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్లో అధికారికంగా మరియు అనధికారికంగా పనిచేస్తున్నారు. ఇక్కడ నుండి చాలా మంది వైద్య చికిత్స కోసం భారతదేశానికి వెళతారు. మేము వారి నుండి చాలా వస్తువులను కొనుగోలు చేస్తాము. కాబట్టి బంగ్లాదేశ్ స్థిరత్వంపై భారత్కు చాలా ఆసక్తి ఉంది. ఇదీ ఇచ్చిపుచ్చుకునే సంబంధం’’ అని ఆర్మీ చీఫ్ చెప్పారు. రెండు దేశాల సంబంధాలు న్యాయబద్ధతపై ఆధారపడి ఉండాలని, బంగ్లాదేశ్ పౌరులు భారత్ తమపై ఆధిపత్యం చెలాయిస్తుందని భావించకూడదని అన్నారు.
ఈశాన్య భారతదేశం భద్రతను నిర్ధారించడానికి బంగ్లాదేశ్ నుంచి భారత్ సహకారం గురించి ప్రశ్నించగా.. బంగ్లాదేశ్ భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ చేయదని, అదే సమయంలో న్యూఢిల్లీ నుండి అదే విధంగా ఆశిస్తానని హామీ ఇచ్చారు, రెండు దేశాలు తమ ప్రయోజనాలను సమానంగా అనుసరించాలని అన్నారు.
షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోవడాన్ని ఆర్మీ చీఫ్ ‘‘ చారిత్రకమైనది’’గా పిలిచారు. బంగ్లాదేశీయులు ఇప్పుడు స్వేచ్ఛ, న్యాయమైన, శాంతియుత ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం బంగ్లాదేశ్ ఆర్మీ సహకరిస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
-
AP Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టు కీలక నిర్ణయం..
-
Off The Record : ఉమ్మడి కర్నూలులో తమ్ముళ్ల సెగ.. సీనియర్ నేతలు అసంతృప్తితో రగిలిపోవడానికి కారణమేంటి?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!