Bangladesh: ఇండియాతో సంబంధాలపై బంగ్లా ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- భారత్ ముఖ్యమైన పొరుగుదేశం..
- షేక్ హసీనా ఎపిసోడ్ ‘‘చారిత్రకమైనది’’..
- భారత్తో సంబంధాలపై బంగ్లా ఆర్మీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bangladesh: బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వ పతనం తర్వాత, భారత్-బంగ్లాల మధ్య సంబంధాలు మునుపటిలా లేవు. ఆ దేశంలో ఇస్లామిక్ రాడికల్ భావజాలం, హిందువులపై దాడులు, భారత్ వ్యతిరేకత నానాటికి పెరుగుతోంది. దీనికి తోడు బంగ్లాదేశ్ ఇటీవల కాలంలో పాకిస్తాన్తో సంబంధాలను పెంచుకుంటోంది. ఈ పరిణామాలు భారత్కి ఆందోళనకరంగా మారాయి.
ఇదిలా ఉంటే, భారత్-బంగ్లాదేశ్ మధ్య క్షీణిస్తున్న సంబంధాలపై ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ మౌనం వీడారు. ఆయన డైలీ ప్రోథోమ్ ఆలోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇరు దేశాల సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని ‘‘ముఖ్యమైన పొరుగుదేశం’’ అని చెప్పారు. ఇండియాపై బంగ్లాదేశ్ అనేక విధాలుగా ఆధారపడి ఉందని వెల్లడించారు. రెండు దేశాల మధ్య ‘‘గివ్ అండ్ టేక్ రిలేషన్స్’’ ఉన్నాయని, ఇది న్యాయం, సమానత్వంపై ఆధారపడి ఉందని, ఈ సూత్రాల ఆధారంగా ఢాకా, న్యూఢిల్లీతో మంచి సంబంధాలను కొనసాగిస్తుందని చెప్పారు.
Also Read
- Rajya Sabha 2026: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఆంధ్రప్రదేశ్ లో నాలుగు స్థానాలు
- Tamil Nadu Govt: విజయ్ సర్కార్ మరో సంచలన నిర్ణయం.. 8,000 కొత్త ఆస్పత్రులకు గ్రీన్ సిగ్నల్..!
- Cockroach Janta Party: ఎంతకీ వదలని కాక్రోజ్.. ఎక్స్ అకౌంట్ బ్లాక్ చేసిన వెంటనే కొత్త అకౌంట్ ప్రత్యక్షం!
- Cabinet Meeting: ప్రధాని మోడీ నేతృత్వంలో 4.5 గంటల కేబినెట్ భేటీ.. ఏం చర్చించారంటే..?
Read Also: Tragedy: భార్యతో గొడవ, బావిలో దూకిన భర్త.. రక్షించే క్రమంలో మరో నలుగురు మృతి..
“భారతదేశం ఒక ముఖ్యమైన పొరుగు దేశం. మనం అనేక విధాలుగా భారత్పై ఆధారపడి ఉన్నాం. మరియు భారతదేశం కూడా మన నుండి సౌకర్యాలను పొందుతోంది. వారి ప్రజలు పెద్ద సంఖ్యలో బంగ్లాదేశ్లో అధికారికంగా మరియు అనధికారికంగా పనిచేస్తున్నారు. ఇక్కడ నుండి చాలా మంది వైద్య చికిత్స కోసం భారతదేశానికి వెళతారు. మేము వారి నుండి చాలా వస్తువులను కొనుగోలు చేస్తాము. కాబట్టి బంగ్లాదేశ్ స్థిరత్వంపై భారత్కు చాలా ఆసక్తి ఉంది. ఇదీ ఇచ్చిపుచ్చుకునే సంబంధం’’ అని ఆర్మీ చీఫ్ చెప్పారు. రెండు దేశాల సంబంధాలు న్యాయబద్ధతపై ఆధారపడి ఉండాలని, బంగ్లాదేశ్ పౌరులు భారత్ తమపై ఆధిపత్యం చెలాయిస్తుందని భావించకూడదని అన్నారు.
ఈశాన్య భారతదేశం భద్రతను నిర్ధారించడానికి బంగ్లాదేశ్ నుంచి భారత్ సహకారం గురించి ప్రశ్నించగా.. బంగ్లాదేశ్ భారతదేశ వ్యూహాత్మక ప్రయోజనాలకు విరుద్ధంగా ఏమీ చేయదని, అదే సమయంలో న్యూఢిల్లీ నుండి అదే విధంగా ఆశిస్తానని హామీ ఇచ్చారు, రెండు దేశాలు తమ ప్రయోజనాలను సమానంగా అనుసరించాలని అన్నారు.
షేక్ హసీనా పదవీ నుంచి దిగిపోవడాన్ని ఆర్మీ చీఫ్ ‘‘ చారిత్రకమైనది’’గా పిలిచారు. బంగ్లాదేశీయులు ఇప్పుడు స్వేచ్ఛ, న్యాయమైన, శాంతియుత ఎన్నికల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని పేర్కొన్నారు. ఎన్నికల నిర్వహణ కోసం మహ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ఎన్నికల నిర్వహణ కోసం బంగ్లాదేశ్ ఆర్మీ సహకరిస్తుందని చెప్పారు.
తాజావార్తలు
-
Roti Calories: గోధుమ నుంచి రాగి వరకు.. ఆరోగ్యానికి ఏ రొట్టె బెస్ట్..? ఏ రొట్టెలో ఎన్ని కేలరీలు..?
-
Naga Chaitanya: తమిళ మాస్ డైరెక్టర్తో.. చైతూ కొత్త ప్రాజెక్ట్ ఫిక్స్..!
-
HMD Vibe 2 5G: 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో.. HMD వైబ్ 2 5G భారత్ లో విడుదల.. తక్కువ ధరకే
-
Shubman Gill: శుభ్మన్ గిల్ సరికొత్త చరిత్ర.. క్రికెట్ దేవుడు ‘సచిన్ టెండూల్కర్’ రికార్డు బద్దలు..
-
SBI Bank Closure: ఎస్బీఐ కస్టమర్లకు షాక్.. రేపటి నుండి ఏకంగా ఆరు రోజుల పాటు..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!