Amazon: “ఆన్లైన్ లెర్నింగ్ అకాడమీ”కి గుడ్ బై చెప్పిన అమెజాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon To Shut Online Learning Academy: ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ దిగ్గజాలు ఖర్చులను తగ్గించే పనిలో తమ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా, గూగుల్ ఇలా పలు సంస్థలు తమ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. కొన్ని సంస్థలు తమ కంపెనీ సేవల్లో కోతలు విధిస్తున్నాయి. ఇదిలా ఉంటే భారతదేశంలో కూడా ఈ పరిమాణాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ లెర్నింగ్ అకాడమీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇ-కామర్స్ దిగ్గజం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Anti Hijab Protests: మహ్సా అమిని చంపబడలేదు, మరణించింది.. ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Bharat Taxi Launch: ఓలా, ఉబర్లకు చెక్.. రంగంలోకి కేంద్ర ప్రభుత్వ ‘భారత్ టాక్సీ’.. అమిత్ షా మెగా ప్లాన్!
- PM Modi: సీషెల్స్లో మోడీ పర్యటన.. వృక్ష ఉద్యానవనం సందర్శన
- NCERT: 9వ తరగతి సిలబస్లో భారీ మార్పు.. ఫ్రెంచ్, రష్యా విప్లవాలు తొలగింపు..
- Gold Scam : ‘గోల్డ్ మ్యాన్’ గేమ్ ఓవర్.. రూ.30 లక్షల గోల్డ్ స్కామ్.!
భారతదేశంలో హైస్కూల్ విద్యార్థుల కోసం అమెజాన్ తన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించిన రెండేళ్లలోపు ఎటువంటి కారణం చూపకుండా మూసివేస్తున్నట్లు గురువారం తెలిపింది. కోవిడ్-19 సమయంలో వర్చువల్ లర్నింగ్ కోసం అమెజాన్ అకాడమి ప్లాట్ఫారమ్ ప్రారంభించింది. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషణ్(జేఈఈ)తో సహా పలు పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ అందించింది. కోవిడ్-19 లాక్ డౌన్ తర్వాత ప్రస్తుతం కరోనా వ్యాప్తి దేశంలో తగ్గడంతో పాటు పాఠశాలలు ప్రారంభం కావడం, కోచింగ్ సెంటర్లు ప్రత్యక్షంగా సేవలను అందిస్తుండటంతో ఆన్లైన్ లెర్నింగ్ అకాడమీలు నష్టపోతున్నాయి. ఈ కారణంగానే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్ బౌజూస్ 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తామని గత నెలలో ప్రకటించింది.
ప్రస్తుతం పరిణామాలు ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్ దెబ్బగా మారాయి. ఇదిలా ఉంటే మరోవైపు టెక్ కంపెనీలు కూడా ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్భనం భయాల కారణంగా తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. ప్రకటనలపై ఆధాయం తగ్గడంతో పాటు బ్రిటన్, అమెరికా వ్యాప్తంగా మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో తక్కువ మందితోనే కంపెనీలను నడిపించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే రానున్న 6-12 నెలల్లో తప్పకుండా మాంద్యం వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2008తో పోలిస్తే ఈ సారి మాంద్యం ప్రభావం చాలా ఉంటుందని చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, కోవిడ్ -19 పరిస్థితులు, చైనాలో ఉత్పత్తి తగ్గడం ఇలా అన్ని పరిణామాలు ఆర్థిక సమస్యలకు కారణం అవుతున్నాయి.
తాజావార్తలు
-
Phone, Laptop: వాడిన ఫోన్ లేదా ల్యాప్టాప్ కొనాలని ఆలోచిస్తున్నారా? ఈ విషయాలు మర్చిపోకండి..!
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!