Amazon: “ఆన్లైన్ లెర్నింగ్ అకాడమీ”కి గుడ్ బై చెప్పిన అమెజాన్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Amazon To Shut Online Learning Academy: ప్రపంచవ్యాప్తంగా పలు టెక్ దిగ్గజాలు ఖర్చులను తగ్గించే పనిలో తమ ఉద్యోగులను తొలగించేస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా, గూగుల్ ఇలా పలు సంస్థలు తమ ఉద్యోగులను తొలగించే పనిలో ఉన్నాయి. కొన్ని సంస్థలు తమ కంపెనీ సేవల్లో కోతలు విధిస్తున్నాయి. ఇదిలా ఉంటే భారతదేశంలో కూడా ఈ పరిమాణాలు ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపిస్తున్నాయి. తాజాగా అమెజాన్ కీలక నిర్ణయం తీసుకుంది. భారతదేశంలో నిర్వహిస్తున్న ఆన్లైన్ లెర్నింగ్ అకాడమీని నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఇ-కామర్స్ దిగ్గజం ఓ ప్రకటనలో వెల్లడించింది.
Read Also: Anti Hijab Protests: మహ్సా అమిని చంపబడలేదు, మరణించింది.. ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
భారతదేశంలో హైస్కూల్ విద్యార్థుల కోసం అమెజాన్ తన ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్ను ప్రారంభించిన రెండేళ్లలోపు ఎటువంటి కారణం చూపకుండా మూసివేస్తున్నట్లు గురువారం తెలిపింది. కోవిడ్-19 సమయంలో వర్చువల్ లర్నింగ్ కోసం అమెజాన్ అకాడమి ప్లాట్ఫారమ్ ప్రారంభించింది. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషణ్(జేఈఈ)తో సహా పలు పోటీ పరీక్షలకు సంబంధించి కోచింగ్ అందించింది. కోవిడ్-19 లాక్ డౌన్ తర్వాత ప్రస్తుతం కరోనా వ్యాప్తి దేశంలో తగ్గడంతో పాటు పాఠశాలలు ప్రారంభం కావడం, కోచింగ్ సెంటర్లు ప్రత్యక్షంగా సేవలను అందిస్తుండటంతో ఆన్లైన్ లెర్నింగ్ అకాడమీలు నష్టపోతున్నాయి. ఈ కారణంగానే అమెజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే ప్రముఖ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్ బౌజూస్ 2,500 మంది ఉద్యోగులను తొలగిస్తామని గత నెలలో ప్రకటించింది.
ప్రస్తుతం పరిణామాలు ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫారమ్ దెబ్బగా మారాయి. ఇదిలా ఉంటే మరోవైపు టెక్ కంపెనీలు కూడా ఆర్థిక మాంద్యం, ద్రవ్యోల్భనం భయాల కారణంగా తమ సిబ్బందిని తగ్గించుకుంటున్నాయి. ప్రకటనలపై ఆధాయం తగ్గడంతో పాటు బ్రిటన్, అమెరికా వ్యాప్తంగా మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీంతో తక్కువ మందితోనే కంపెనీలను నడిపించేలా చర్యలు తీసుకుంటున్నాయి. ఇదిలా ఉంటే రానున్న 6-12 నెలల్లో తప్పకుండా మాంద్యం వస్తుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. 2008తో పోలిస్తే ఈ సారి మాంద్యం ప్రభావం చాలా ఉంటుందని చెబుతున్నారు. ఉక్రెయిన్ యుద్ధం, కోవిడ్ -19 పరిస్థితులు, చైనాలో ఉత్పత్తి తగ్గడం ఇలా అన్ని పరిణామాలు ఆర్థిక సమస్యలకు కారణం అవుతున్నాయి.
తాజావార్తలు
-
Scene: పోలీస్ ఆఫీసర్గా సూర్య మాస్ ఎంట్రీ.. జితు మాధవన్ తో ‘సీన్’ ఎలా ఉండబోతోందంటే?
-
Russia-NATO Tensions: రష్యా డ్రోన్లు, క్షిపణులతో NATO దేశాలపై దాడి చేయొచ్చు.. పోలాండ్ ప్రధాని టస్క్ హెచ్చరిక
-
Abhishek Sharma: అభిషేక్ విధ్వంసకర సెంచరీ చూడలేకపోయారా.? ఏం పర్లేదు.. ఇక్కడ చూసేయండి.!
-
Shreyas Iyer: అది నేను ముందే ఊహించా.. ఆ ఐదుగురు సూపర్.. శ్రేయాస్ సంతోషం!
-
F-16 Fighter Jet Crash: అమెరికాలో F-16 ఫైటర్ జెట్ క్రాష్.. వీడియో వైరల్, దర్యాప్తు షురూ
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!