Anti Hijab Protests: మహ్సా అమిని చంపబడలేదు, మరణించింది.. ఇరాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Anti Hijab Protests: ఈ ఏడాది సెప్టెంబరులో ఇరాన్లో పోలీసు కస్టడీలో ఉన్న 22 ఏళ్ల మహ్సా అమిని మరణించిన సంగతి తెలిసిందే. మహ్సా అమిని హిజాబ్ సరిగ్గా ధరించలేదని చెబుతూ ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తరువాత ఆమె మరణించింది. ఇది జరిగినప్పటి నుంచి ఇరాన్ వ్యాప్తంగా మహిళలు, యువత పెద్ద ఎత్తున నిరసన, ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా మహిళలు హిజాబ్ తీసేస్తూ జట్టు కత్తిరించుకుని నిరసన తెలుపుతున్నారు. ప్రభుత్వం ఈ నిరసనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదిలా ఉండగా.. ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి అలీ బఖేరీ తన ప్రభుత్వాన్ని సమర్థించారు. మహ్సా అమిని చంపబడలేదు అని.. ఆమె మరణించిందని ఆయన ఇరాన్ సర్కారును సమర్థించుకున్నారు. ఇలా సమర్థించడం వల్ల పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి.
ఆయన ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మహ్సా అమినీ చంపబడలేదు, ఆమె మరణించింది. ఇరాన్లో అభివృద్ధికి సంబంధించి కొన్ని పాశ్చాత్య మీడియాలు సృష్టించిన వాతావరణాన్ని చూశాము. ఇరాన్ దేశ హక్కులను ఈ పాశ్చాత్య శక్తులు ఉల్లంఘిస్తున్నాయి” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ పాశ్చాత్య శక్తులు ఆఫ్ఘనిస్తాన్, పాలస్తీనా లేదా యెమెన్ ప్రజల గురించి మాట్లాడవు. ఆ శక్తులు ఆ దేశాల్లోని చర్యలను ఖండించరని ఆయన పేర్కొన్నారు. సెప్టెంబర్ 13న పోలీసులు నిర్బంధించిన కుర్దిష్-ఇరానియన్ మహిళ మరణం తర్వాత ఇరాన్ ఇటీవలి చరిత్రలో అతిపెద్ద అసమ్మతిని ఎదుర్కొంటోంది.
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
US Diplomats Drive Auto: బుల్లెట్ ప్రూప్ కార్లు వదిలి.. ఆటో నడిపిన ఫారినర్స్ ఇంతలోనే..
ఇదిలా ఉండగా, ఇరాన్లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలపై ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనుంది. మంగళవారం యూఎన్ మానవ హక్కుల కార్యాలయం ఇరాన్లో గత వారంలో ఇద్దరు యువకులతో సహా 40 మందికి పైగా మరణించారు. అమిని మరణం తర్వాత శాంతియుత నిరసనల్లో చేరినందుకు ఇరాన్ అంతటా వేలాది మంది నిరసనకారులను అదుపులోకి తీసుకున్నారు. నిరసనలకు మద్దతుగా అనేక మంది సెలబ్రిటీలు, క్రీడాకారులు ఆందోళనలు చేపట్టారు. యూఎన్ హక్కుల కార్యాలయం ప్రకారం, సెప్టెంబర్ 16న దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగినప్పటి నుంచి 40 మంది పిల్లలతో సహా 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి అనేక మంది భద్రతా దళ సిబ్బంది మరణించినట్లు ఇరాన్ అధికారులు నివేదించారు.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!