India: ఆల్ టైమ్ రికార్డ్.. రూ.1.46 ట్రిలియన్లకు చేరుకున్న రక్షణ ఉత్పత్తి..
- భారత రక్షణ రంగ ఉత్పత్తుల్లో ఆల్ టైమ్ రికార్డ్..
- రూ. 1.46 ట్రిలియన్లకు చేరుకున్న ప్రొడక్షన్స్..
- ఎగుమతులు కూడా పెరిగినట్లు చెప్పిన రాజ్నాథ్ సింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
India: భారతదేశ రక్షణరంగ ఉత్పత్తులు 2024-25(FY25)లో ఆల్ టైమ్ రికార్డ్కి చేరుకున్నాయి. ఏకంగా 1.46 ట్రిలియన్లకు చేరుకున్నట్లు, ఇది 2024 ఆర్థిక సంవత్సరం(FY24)తో పోలిస్తే రూ. 1.27 ట్రిలియన్ల నుంచి దాదాపుగా 15 శాతం పెరిగిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం తెలిపారు. రక్షణ రంగ ఎగుమతులు కూడా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే రికార్డు స్థాయిలో గరిష్టానికి చేరుకున్నాయని వెల్లడించారు. FY24లో రూ.21,083 కోట్ల నుండి ఎగుమతులు దాదాపు 14 శాతం పెరిగాయని ఆయన అన్నారు.
రక్షణ రంగంలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని రాజ్నాథ్ సింగ్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రైవేట్ రంగం షేర్ రూ. 32,000 కోట్లకు పైగా ఉందని అన్నారు. ఇది మొత్తం రక్షణ ఉత్పత్తిలో దాదాపు 22 శాతం. న్యూఢిల్లీలో జరిగిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) వార్షిక వ్యాపార శిఖరాగ్ర సమావేశంలో ఆయన ప్రసంగించారు. FY24లో ఉత్పత్తి విలువలో ప్రైవేట్ రంగం వాటా 20.8 శాతంగా ఉండేది.
Also Read
- Ketan Agarwal Murder: పూణే కేతన్ అగర్వాల్ హత్యలో కీలక పరిణామం.. ఏం జరిగిందంటే.?
- Saharanpur Mosque: కూల్చివేసిన మసీదు కింద పురాతన బావి.. ASI ఎంట్రీ..
- Bypolls: తమిళనాడు సహా 5 రాష్ట్రాల్లో బైపోల్స్ షెడ్యూల్ విడుదల.. పోలింగ్ ఎప్పుడంటే..!
- PM Modi: తొలిసారి ‘బుక్మైషో’లో మోడీ ఈవెంట్.. 30 నిమిషాల్లోనే హౌస్ఫుల్ బోర్డు
రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఇటీవల ఆమోదించిన 5వ తరం యుద్ధ విమాన తయారీకి సంబంధించి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (AMCA) ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ మోడల్ కింద, మొదటిసారిగా, ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ రంగానికి కూడా ఒక ప్రధాన రక్షణ ప్రాజెక్టులో పాల్గొనే అవకాశం ఉంటుందని నొక్కి చెప్పారు. AMCA ప్రాజెక్ట్ కింద, ఐదు ప్రోటోటైప్లను తయారు చేయాలనేది ప్రణాళిక, దీని తర్వాత ఉత్పత్తి జరుగుతుంది. ఇది మేక్-ఇన్-ఇండియా కార్యక్రమం చరిత్రలో కీలక మైలురాయిగా రాజ్నాథ్ అభివర్ణించారు.
Read Also: PM Modi: కెనడా “G-7 సమ్మిట్”కు ప్రధాని మోడీ వెళ్లడం లేదు.. రెండు దేశాల మధ్య సంబంధాలే కారణం.!
భారతదేశం ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడం గర్వకారణమని ఆయన అన్నారు. దేశ వృద్ధిలో రక్షణ రంగం విలువైన పాత్ర పోషిస్తుందని చెప్పారు. 10 సంవత్సరాల క్రితం మన రక్షణ రంగ ఉత్పత్తి సుమారుగా రూ. 43,000 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ.1.46 ట్రిలియన్లకు చేరుకుందని వెల్లడించారు. 10 ఏళ్ల క్రితం భారత రక్షణ ఎగుమతులు రూ.600-700 కోట్లు ఉంటే, ప్రస్తుతం రూ. 24,000 కోట్ల రికార్డును అధిగమించినట్లు రాజ్నాథ్ సింగ్ వెల్లడించారు. భారత ఆయుధాలు, పరికలు, సేవలు దాదాపు 100 దేశాలకు చేరుకున్నాయని అన్నారు.
గత ఐదేళ్లలో మొదటిసారిగా ప్రభుత్వ బడ్జెట్ని ఆధునీకకరించామని, రూ. 2 ట్రిలియన్ల విలువైన ఒప్పందాలపై సంతకాలు చేశామని, ఇది 2024 ఆర్థిక సంవత్సరంలో దాదాపు రూ. 1 ట్రిలియన్ రికార్డు కంటే రెట్టింపు అని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. GDPలో 1.9 శాతం ఉన్నప్పటికీ రక్షణ బడ్జెట్ గణనీయంగా ఉందని ఆయన చెప్పారు.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!