All India Muslim Personal Law Board: ముస్లిం పర్సనల్ లాబోర్డ్ అత్యవసర సమావేశం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశంలో ప్రస్తుతం జ్ఞానవాపీ మసీదు అంశం చర్చనీయాంశంగా మారింది. వారణాసి కోర్ట్ ఉత్తర్వుల మేరకు మే 14-16 వరకు మసీదులో వీడియో సర్వే నిర్వహించి మే 17న రిపోర్ట్ ఇవ్వాలని కోర్ట్ నియమించిన కమిషనర్లకు ఆదేశాలు ఇచ్చింది. తాజాగా ఈ రోజే వీడియోగ్రఫీ సర్వే వివరాలను కోర్ట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. అయితే జ్ఞానవాపీ మసీదులోని వజూ ఖానాలోని బావిలో శివలింగ భయటపడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వీడియో సర్వేకు మరింత సమయం కావాలని కోర్ట్ కమిషనర్లు వారణాసి కోర్ట్ ను కోరారు. మరోవైపు ఈ రోజు సుప్రీం కోర్ట్ లో జ్ఞానవాపి మసీదు సర్వేను నిలిపివేయాలని వేసిన పిటిషన్ పై విచారించనుంది.
ఇదిలా ఉంటే జరుగుతున్న పరిణామాలపై ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డ్ నేడు అత్యవసర సమావేశాన్ని నిర్వహిస్తోంది. జ్ఞానవాపి మసీదుతో పాటు , కర్ణాటకలో జామియా మసీద్ విషయాలపై చర్చించనున్నారు. ఈ రెండు కేసులపై ఎలా మందుకు వెళ్లాలనే అంశాలపై పర్సనల్ లా బోర్డ్ చర్చించనుంది. మసీదు అంశాలతో పాటు దేశంలో ప్రస్తుత సమస్యలపై చర్చించి భవిష్యత్ కార్యచరణ ప్రకటించే అవకాశం ఉంది.
Also Read
- Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
- Russia Oil: ముంచుకొస్తున్న సంక్షోభం.. భారత్కు నిలిచిపోనున్న రష్యా చమురు..
- Jobs: నిరుద్యోగులకు గొప్ప అవకాశం.. నెలకు శాలరీ రూ.1.99 లక్షలు..
- Petrol-Diesel Price: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై పుకార్లు.. ఎంత పెరగవచ్చంటే..!
జ్ఞానవాపీ మసీదు అంశం కోర్ట్ పరిధిలో ఉంటే కర్ణాటకలో మరో కొత్త వివాదం రాజుకుంది. మాండ్యాలోని శ్రీరంగపట్టణలోని జామీయా మసీదు ఒకప్పుడు ఆంజనేయ దేవాలయం అని… తమకు పూజలు చేసుకునే అవకాశం ఇవ్వాలని నరేంద్రమోదీ విచార్ మంచ్ అనే గ్రూప్ మాండ్యా డిప్యూటి కమిషనర్ ను అనుమతి కోరింది. గతంలో టిప్పు సుల్తాన్ రాజధాని మైసూర్ కు 18 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ మసీదు ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. టిప్పు సుల్తాన్ హాయాంలో ఆంజనేయ స్వామి ఆలయంగా ఉన్నదాన్ని జామియా మసీదుగా మార్చారని.. ఇప్పటికీ మసీదుల్లోని పిల్లర్ల పై హిందూ శాసనాలు ఉన్నాయని నరేంద్ర మోదీ విచార్ మంచ్ సెక్రటరీ మంజునాథ్ ఆరోపిస్తున్నారు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఉండేదని చరిత్ర చెబుతోందని.. టిప్పు సుల్తాన్, పర్షియన్ రాజుకు రాసిన ఉత్తరాల్లో కూడా ఈ ఆలయం గురించి సాక్ష్యాలు ఉన్నాయని మంజునాథ్ అన్నారు.
తాజావార్తలు
-
Jasprit Bumrah: “ఇక మిగిలింది వన్డే కెప్టెన్సీనే.. కానీ!”.. కెప్టెన్గా తొలి విజయంపై జస్ప్రీత్ బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Dragon: నేషనల్ మీడియా సమక్షంలో ‘డ్రాగన్’ ఫస్ట్ గ్లింప్స్ లాంచ్!
-
Tilak Varma: “నమ్మకమే నా బలం..” అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
-
Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
-
Petrol, Diesel Prices Hiked: వాహనదారులకు బిగ్ షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఎంతంటే?
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!