Sunetra Pawar: రూ. 25,000 కోట్ల బ్యాంకు కుంభకోణంలో అజిత్ పవార్ భార్యకు క్లీన్ చిట్..
Sunetra Pawar: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి, ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ భార్య సునేత్ర పవార్కి రూ. 25,000 కోట్ల కుంభకోణంలో ముంబై పోలీసులు క్లీన్ చిట్ ఇచ్చారు. ప్రస్తుతం సునేత్ర పవార్ బారామతి స్థానం నుంచి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలేపై పోటీ చేస్తున్నారు. మహారాష్ట్ర స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ (MSCB) కేసును దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసుల ఆర్థిక నేరాల విభాగం (EOW) జనవరిలో దాఖలు చేసిన క్లోజర్ రిపోర్టులో ఎలాంటి క్రిమినల్ నేరం జరగలేదని పేర్కొంది.
ఈ కుంభకోణంలో అజిత్ పవార్ ఆయన భార్య సునేత్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముంబై పోలీసుల నిర్ణయంపై ప్రతిపక్ష శివసేన(ఉద్ధవ్ ఠాక్రే) స్పందించింది, ఈ నిర్ణయాన్ని ఖండించింది. ‘‘ప్రధాని మోడీ గతంలో పవార్ల కుటుంబం అవినీతి కుటుంబం అని ఆరోపించారు. కానీ, ఈ రోజు ఆమెకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆర్థిక నేరాల విభాగం ఎలాంటి నేరం లేదని ముగింపు నివేదికలో పేర్కొంది’’ అని శివసేన(ఉద్ధవ్) నేత ఆనంద్ దూబే అన్నారు.
Also Read
- West Bengal: బెంగాల్లో తృణమూల్ హైడ్రామా.. స్ట్రాంగ్ రూం ముందు ఆందోళన..
- Supreme Court : 31 వారాల గర్భస్రావానికి గ్రీన్ సిగ్నల్.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు!
- Boat sink: మధ్యప్రదేశ్లో ఘోర విషాదం.. 30 మందితో వెళ్తున్న పడవ మునక..
- Employees: ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న బేసిక్ పే...
Read Also: Asaduddin Owaisi: అల్లర్లు చెలరేగితే మీదే బాధ్యత.. ముస్లింలపై ప్రధాని వ్యాఖ్యలపై ఓవైసీ ఫైర్..
గతేడాది ఎన్సీపీలో అజిత్ పవార్ చీలిక తీసుకువచ్చారు. మెజారిటీ ఎమ్మెల్యేలు అజిత్ పవార్ వైపు ఉండటంతో నిజమైన ఎన్సీపీ అతడిదే అని ఎన్నికల సంఘం చెప్పింది. దీంతో శరద్ పవార్కి షాక్ తగిలింది. ప్రస్తుతం బీజేపీ-శివసేన(షిండే) ప్రభుత్వంలో అజిత్ పవార్ కూటమి భాగంగా ఉంది. మరోవైపు శరద్ పవార్ కాంగ్రెస్ పక్షంతో ఇండియా కూటమిలో భాగంగా ఉన్నారు. ఎన్సీపీకి కంచుకోటగా ఉన్న బారామతిలో శరద్ పవార్ కుమార్తె, సిట్టింగ్ ఎంపీ సుప్రియా సూలేపై సునేత్ర పోటీ చేస్తోంది. దీంతో ఈ స్థానం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే బీజేపీ ‘వాషింగ్ మెషన్’ విమర్శలను ప్రతిపక్షాలు మరోసారి లేవనెత్తాయి. బీజేపీ తన వ్యతిరేకులపై ఈడీ, సీబీఐ, ఐటీలను ప్రయోగిస్తోందని, వారు బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత విచారణ నెమ్మదించడం లేదా క్లీన్ చిట్ ఇస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. బీజేపీ వాషింగ్ మెషన్ అంటూ పిలుస్తున్నారు.
తాజావార్తలు
-
LPG Cylinder Price: భారీగా పెరిగిన గ్యాస్ ధరలు.. 19 కిలోల వాణిజ్య LPG సిలిండర్ ధర రూ. 993 పెంపు
-
Astrology: మే 1 శుక్రవారం దినఫలాలు.. ఏ రాశివారు ఏ పరిహారం చెల్లించాలంటే..!
-
RCB vs GT : బెంగళూరును చిత్తు చేసిన టైటాన్స్.. గిల్ మెరుపులు
-
Screen Time Effects : స్క్రీన్ సమయం పెరగడం వల్ల మైగ్రేన్లు వస్తాయా.?
-
Off The Record : సీఎం సరికొత్త టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారా? బీజేపీ టార్గెట్ గా వ్యూహాలు?
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!