Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
- ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’
- నిందితులపై కనికరం చూపించకూడదు
- జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాయకష్టం చేసి సంపాదించిన డబ్బంతా సైబర్ నేరగాళ్లు చిటికలో మాయం చేసేస్తున్నారు. వృద్ధాప్యంలో బతికేందుకు దాచుకున్న డబ్బంతా కంత్రీగాళ్లు కొట్టేసి ముసలోళ్ల కడుపు కొడుతున్నారు. ఇలాంటి తరుణంలో సైబర్ నేరగాళ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.
బుధవారం సైబర్ నేరగాడికి సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవుల వంటివారు.’’ అని వ్యాఖ్యానించారు. సైబర్ మోసం కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ.. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
Also Read
- EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
- Prof V Kamakoti: ప్రియాంకా గాంధీ ‘‘గోమూత్ర నిపుణుడు’’ అని పిలిచిన ప్రొఫెసర్ కామకోటి ఎంత గొప్పవారో తెలుసా.?
- Tamil Nadu: విజయ్ సర్కార్ షాకింగ్ నిర్ణయం.. 3 రాష్ట్రాలకు నిర్మాణ సామగ్రి రవాణాపై నిషేధం
- Dharmendra Pradhan: ధర్మేంద్ర ప్రధాన్కు మరో మంత్రి పదవి ఆఫర్! బీజేపీ క్లారిటీ
సైబర్ నేరగాళ్లు ప్రజల కష్టార్జితాన్ని మోసం చేసి సమాజానికి తీవ్ర నష్టం కలిగించే ‘పరాన్నజీవుల’ వంటి వారని వ్యాఖ్యానించింది. అటువంటి నేరగాళ్ల పట్ల ఉదారంగా వ్యవహరించకూడదని.. వారిని జైలులో ఉంచడమే సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఉత్తమమని సీజేఐ స్పష్టంగా పేర్కొన్నారు. సైబర్ నేరాల నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించిందని వ్యాఖ్యానించారు. నిందితులు ఒక రాష్ట్రంలో మోసాలకు పాల్పడి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తారని.. దీనివల్ల ఈ నేరాలను నియంత్రించడం మరింత సవాలుగా మారుతుందని తెలిపారు. ఇటువంటి వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ధర్మాసనం నొక్కి చెప్పింది.
పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్టులు’, సైబర్ మోసాల కేసులను సుప్రీం కోర్టు ఇటీవల సుమోటోగా స్వీకరించింది. అంబాలాకు చెందిన ఒక వృద్ధ దంపతులు తమ జీవితకాలపు పొదుపును కోల్పోవడానికి కారణమైన మోసాన్ని వివరిస్తూ ఒక లేఖ రాసిన తర్వాత ఈ చర్య తీసుకోబడింది. గతంలో దేశవ్యాప్తంగా డిజిటల్ మోసాల కేసులలో చర్యలు తీసుకోవడానికి దర్యాప్తు సంస్థ సీబీఐకి సుప్రీంకోర్టు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు అటువంటి కేసులను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కఠినమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
తాజావార్తలు
-
HYDRAA : హైడ్రా తీరుపై హైకోర్టు మరోసారి ఆగ్రహం
-
EPFO New Portal: PF డబ్బులు ఎక్కడున్నాయో ఇక ఈజీగా తెలుసుకోండి.. EPFO కీలక మార్పులు
-
AP Government: వారసత్వ భూములపై గుడ్న్యూస్.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం..
-
Melania Trump: మెలానియా ట్రంప్కు హత్యా బెదిరింపులు.. ఇరాన్ వీడియో కలకలం
-
Off The Record: మంత్రులకు ఎమ్మెల్యేల షాక్? చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఆధిపత్య పోరు
ట్రెండింగ్
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?
-
Home Cleaning Hacks : టీ, కాఫీ కప్పుల మొండి మరకలా.? ఈ టిప్స్తో సులభంగా 5 నిమిషాల్లో క్లీన్ చేయండి.!
-
Clean Fridge Door Rubber: ఫ్రిజ్ డోర్ రబ్బర్కు మరకలా..? ఈ ట్రిక్తో 10 నిమిషాల్లో తలతల మెరిసిపోవాల్సిందే..!
-
రూ.5,499కే 120 అంగుళాల స్క్రీన్.. Zebronics Zeb-PixaPlay 72 Plus స్మార్ట్ ప్రొజెక్టర్ లాంచ్.!