Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
- ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’
- నిందితులపై కనికరం చూపించకూడదు
- జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాయకష్టం చేసి సంపాదించిన డబ్బంతా సైబర్ నేరగాళ్లు చిటికలో మాయం చేసేస్తున్నారు. వృద్ధాప్యంలో బతికేందుకు దాచుకున్న డబ్బంతా కంత్రీగాళ్లు కొట్టేసి ముసలోళ్ల కడుపు కొడుతున్నారు. ఇలాంటి తరుణంలో సైబర్ నేరగాళ్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం సంచలన వ్యాఖ్యలు చేసింది.
బుధవారం సైబర్ నేరగాడికి సంబంధించిన బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవుల వంటివారు.’’ అని వ్యాఖ్యానించారు. సైబర్ మోసం కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరిస్తూ.. సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది.
Also Read
- Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
- Suvendu Adhikari: దీదీ ‘ఖతం’ చేయాలనుకున్న గూర్ఖా దళానికి ఊపిరి పోస్తున్న సువేందు అధికారి.. బెంగాల్లో రాజకీయాల్లో కొత్త రచ్చ!
- IMD Rain Alert: తెలంగాణతో పాటు ఈ రాష్ట్రాల్లో రుతుపవనాలు.. ఎప్పటి నుంచి వర్షాలంటే..!
- Melodi: ‘‘ఇన్స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్గా మోడీ-మెలోనీ
సైబర్ నేరగాళ్లు ప్రజల కష్టార్జితాన్ని మోసం చేసి సమాజానికి తీవ్ర నష్టం కలిగించే ‘పరాన్నజీవుల’ వంటి వారని వ్యాఖ్యానించింది. అటువంటి నేరగాళ్ల పట్ల ఉదారంగా వ్యవహరించకూడదని.. వారిని జైలులో ఉంచడమే సమాజ శ్రేయస్సు దృష్ట్యా ఉత్తమమని సీజేఐ స్పష్టంగా పేర్కొన్నారు. సైబర్ నేరాల నెట్వర్క్ దేశవ్యాప్తంగా విస్తరించిందని వ్యాఖ్యానించారు. నిందితులు ఒక రాష్ట్రంలో మోసాలకు పాల్పడి.. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను కొనసాగిస్తారని.. దీనివల్ల ఈ నేరాలను నియంత్రించడం మరింత సవాలుగా మారుతుందని తెలిపారు. ఇటువంటి వ్యవస్థీకృత నేరాలను ఎదుర్కోవడానికి కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ధర్మాసనం నొక్కి చెప్పింది.
పెరుగుతున్న ‘డిజిటల్ అరెస్టులు’, సైబర్ మోసాల కేసులను సుప్రీం కోర్టు ఇటీవల సుమోటోగా స్వీకరించింది. అంబాలాకు చెందిన ఒక వృద్ధ దంపతులు తమ జీవితకాలపు పొదుపును కోల్పోవడానికి కారణమైన మోసాన్ని వివరిస్తూ ఒక లేఖ రాసిన తర్వాత ఈ చర్య తీసుకోబడింది. గతంలో దేశవ్యాప్తంగా డిజిటల్ మోసాల కేసులలో చర్యలు తీసుకోవడానికి దర్యాప్తు సంస్థ సీబీఐకి సుప్రీంకోర్టు పూర్తి స్వేచ్ఛను ఇవ్వడంతో పాటు అటువంటి కేసులను ఎదుర్కోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కఠినమైన మార్గదర్శకాలను కూడా జారీ చేసింది.
తాజావార్తలు
-
Supreme Court: ‘సైబర్ నేరగాళ్లు పరాన్నజీవులు’’.. నిందితులు జైల్లో ఉండడమే ఉత్తమమన్న సూర్యకాంత్
-
Tea and Biscuits: ఖాళీ కడుపుతో టీ, బిస్కెట్లు తింటున్నారా..? ఎయిమ్స్ వైద్యుల కీలక హెచ్చరిక
-
INDA Vs AFGA: ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. ఆప్ఘనిస్థాన్పై భారీ విజయం..
-
G7 Summit: ఉక్రెయిన్కు పెరిగిన సైనిక, ఇంధన మద్దతు.. రష్యాపై ఆంక్షలకు జీ7 దేశాలు గ్రీన్సిగ్నల్
-
Anil Ravipudi: రేపే అనిల్ రావిపూడి కొత్త సినిమా గ్రాండ్ లాంచ్!
ట్రెండింగ్
-
Cleaning Hacks : బాత్రూమ్ బకెట్లు నల్లగా మారాయా.? ఈ ఒక్క చిట్కాతో కొత్తవాటిలా మెరిపించండి.!
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!