Maharashtra: మాకు 80-90 సీట్లు కావాల్సిందే.. బీజేపీ కూటమిలో అజిత్ పవార్ పట్టు..
- మహారాష్ట్ర సీట్ల షేరింగ్పై హాట్ హాట్ చర్చ..
- 80-90 సీట్ల కావాలని అజిత్ పవార్ పట్టు..
- అమిత్ షాతో భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Maharashtra: ఈ ఏడాది చివర్లో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత బీజేపీ కూటమి అసెంబ్లీ ఎన్నికలపై దృష్టిపెట్టింది. 288 స్థానాలు ఉన్న మహా అసెంబ్లీలో బీజేపీ-ఎన్సీపీ(అజిత్ పవార్)-శివసేన(షిండే) పార్టీలు ‘మహాయుతి’ పేరుతో కూటమిగా పోటీ చేయబోతున్నాయి. ఈ మేరకు సీట్ల షేరింగ్పై చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో సమావేశమైన సందర్భంగా ఎన్సీపీ వచ్చే ఎన్నికల్లో 80-90 సీట్లు కావాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల్లో జరిగిన విధంగా కాకుండా, వీలైనంత తొందరగా సీట్ల పంపిణీని ఖరారు చేయాలని అజిత్ పవార్ కోరారని తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏక్నాథ్ షిండే శివసేన 100 స్థానాల్లో, బీజేపీ 160-170 సీట్లలో పోటీ చేయాలని చూస్తున్నాయి.
Read Also: Paris: ఆస్ట్రేలియా మహిళపై గ్యాంగ్ రేప్.. ఒలింపిక్స్కి ముందు ఘటన..
Also Read
- PM Modi: నార్వే నుంచి ఇటలీకి బయల్దేరిన మోడీ.. జార్జియా మెలోనితో భేటీకానున్న ప్రధాని
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు పండగలాంటి న్యూస్.. ఇకపై నిమిషాల్లోనే జేబుల్లోకి క్యాష్!
- PM Modi: భారత్-నార్వే ప్రపంచ శాంతిని కోరుకుంటున్నాయి.. ఉగ్రవాదం విషయంలో రాజీపడబోమన్న మోడీ
- CM Vijay: రాజీవ్గాంధీ హంతకుడికి సీఎం విజయ్ నివాళి.. రాజకీయ దుమారం రేపుతోన్న వ్యవహారం
2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఎన్సీపీ గెలిచిన 54 స్థానాల్లో పోటీ చేయాలని అజిత్ పవార్ పట్టుదలతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే కాకుండా పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా, ఉత్తర్ మహారాష్ట్ర(ఖండేష్) ప్రాంతంలో కాంగ్రెస్పై 20 స్థానాల్లో పోటీ చేయాలని అజిత్ పవార్ భావిస్తున్నారు. మైనారిటీ వర్గం అధికంగా ఉండే ముంబైలోని 4-5 స్థానాల్లో కాంగ్రెస్కి వ్యతిరేకంగా పోటీ చేసేందుకు అజిత్ పవార్ ఆసక్తి కనబరుస్తున్నారు. ముగ్గురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో పాటు ఏడుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎన్సీపీ నుంచి పోటీకి దింపేందుకు అజిత్ పవార్ సిద్ధంగా ఉన్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
సీట్ల పంపకంపై చర్చలు నడుస్తున్న నేపథ్యంలో బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా అధిష్టానాన్ని కలిసేందుకు ఈ రోజు ఉదయాన్నే ఢిల్లీ చేరుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఉత్తర్ ప్రదేశ్ తర్వాత ఎక్కువ ఎంపీ స్థానాలు(48) ఉన్న మహారాష్ట్రలో బీజేపీ కూటమి దారుణంగా విఫలమైంది. కేవలం 17 చోట్లనే ఎన్డీయే కూటమి విజయం సాధించింది. ఇందులో 09 స్థానాల్లో బీజేపీ గెలిచింది. ఇక కాంగ్రెస్-శివసేన(ఠాక్రే)-ఎన్సీపీ(అజిత్ పవార్) కూటమి మహావికాస్ అఘాడీ ఏకంగా 30 స్థానాల్ని కైవసం చేసుకుంది.
- Tags
- Ajit Pawar
- Amit Shah
- bjp
- Maharashtra
- NCP
తాజావార్తలు
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
-
RR Vs LSG: మార్ష్ వీర విహారం.. రాజస్థాన్ రాయల్స్ ముందు భారీ టార్గెట్..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!