Air India: టీమిండియాను ఇంటికి తీసుకురావడానికి అమెరికా విమానం రద్దు.. నివేదిక కోరిన డీజీసీఏ..
- టీమిండియాను స్వదేశానికి చేర్చిన ఎయిర్ ఇండియా..
- దీని కోసం అమెరికా నుంచి రావాల్సిన విమానం రద్దు..
- ఘటనపై నివేదిక కోరిన డీజీసీఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: టీ 20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత క్రికెట్ జట్ట కరేబియన్లోనే చిక్కుకుపోయింది. తుఫాను రావడంతో ఆ ప్రాంతంలో ఫ్లైట్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా టీమిండియా అక్కడే చిక్కుకుపోయింది. టీ 20 కప్ సాధించిన భారత క్రికెటర్లకు స్వాగతం పలిచేందుకు ఫ్యాన్స్ ఎదురుచూడాల్సి వచ్చింది. తాజాగా ఈ రోజు భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. బుధవారం బార్బడోస్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరి, ఈ రోజు ఢిల్లీ చేరుకుంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఏయిరిండియా ఒక వివాదంలో ఇరుక్కుంది. బార్బడోస్ నుంచి టీమిండియాను తీసుకురావడానికి అమెరికాకు నుంచి షెడ్యూల్ చేసిన విమానాన్ని రద్దు చేసింది. వాస్తవానికి నెవార్క్- ఢిల్లీ మధ్య ఎయిరిండియా బోయింగ్ -777 విమానాన్ని నడపాల్సి ఉంది. అయితే, దీనిని క్యాన్సల్ చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దీనిపై నివేదిక కోరింది.
Also Read
- Maharashtra Politics: కాంగ్రెస్లో శరద్ పవార్ పార్టీ విలీనం ? మహారాష్ట్ర రాజకీయాల్లో తెరవెనుక నడుస్తున్న హైడ్రామా ఇదే!
- Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో 'కమిషన్ల' భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
Read Also: NEET Paper Leaks Case: నీట్ పేపర్ లీకేజీకి నిరసన.. నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్..
నిజానికి అమెరికాలోని నెవార్క్ నుంచి ఢిల్లీకి రెగ్యులర్ ఫ్లైట్ నడపాల్సి ఉంది. వాస్తవాలను నిర్ధారించేందుకు ఎయిరిండియాను నివేదిక కోరినట్లు డీజీసీఏ అధికారి వెల్లడించారు. విమానయాన నిపుణుడు మోహన్ రంగనాథన్ మాట్లాడుతూ విమానాన్ని రద్దు చేయడం డిజిసిఎ పౌర విమానయాన నిబంధనలను (సిఎఆర్) తీవ్రంగా ఉల్లంఘించడమేనని అన్నారు.
దీనిపై విషయం తెలిసిన ఎయిర్లైన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. వాస్తవానికి భారత క్రికెట్ జట్టు ప్రయాణించాల్సిన విమానయాన సంస్థ సదరు విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత బీసీసీఐ ఎయిర్ ఇండియాను సంప్రదించినట్లు చెప్పారు. అయితే, నెవార్క్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఎవరూ చిక్కుకోలేదని స్పష్టం చేశారు. నెవార్క్-ఢిల్లీ ఫ్లైట్లో బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ ముందుగానే సమాచారం అందించబడింది మరియు అసౌకర్యాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయం కూడా అందించబడ్డాయని పేర్కొన్నాడు. కొంతమంది ప్రయాణీకులకు సమాచారం గురించి తెలియబడలేదని, వారు విమానాశ్రయం చేరుకోగానే, వారిని రోడ్డు మార్గం ద్వారా న్యూయార్క్ తరలించి అక్కడ నుంచి న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్లో ఎక్కించినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Somu Veerraju: జగన్కు దమ్ముంటే చర్చకు రావాలి.. సోము వీర్రాజు సవాల్
-
FSSAI Energy Drink Notices: ఎనర్జీ డ్రింక్స్ తాగేవారికి అలర్ట్.. 6 ప్రముఖ బ్రాండ్లకు FSSAI నోటీసులు, కారణం ఇదే!
-
Neha Dhupia: ‘ఇదంతా వెంటనే ఆపండి’.. బ్యాక్ షాట్ ఫోటోలపై మండిపడ్డ నేహా ధూపియా..
-
YS Jagan: క్రాంతికుమార్ కుటుంబానికి పరామర్శ.. పోలీసు వ్యవస్థపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
Russia: పుతిన్ దేశంలో పెట్రోల్ బంకులు ఖాళీ! రష్యాకు పెట్రోల్ అమ్ముతున్న భారత్..
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?