Air India: టీమిండియాను ఇంటికి తీసుకురావడానికి అమెరికా విమానం రద్దు.. నివేదిక కోరిన డీజీసీఏ..
- టీమిండియాను స్వదేశానికి చేర్చిన ఎయిర్ ఇండియా..
- దీని కోసం అమెరికా నుంచి రావాల్సిన విమానం రద్దు..
- ఘటనపై నివేదిక కోరిన డీజీసీఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: టీ 20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత క్రికెట్ జట్ట కరేబియన్లోనే చిక్కుకుపోయింది. తుఫాను రావడంతో ఆ ప్రాంతంలో ఫ్లైట్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా టీమిండియా అక్కడే చిక్కుకుపోయింది. టీ 20 కప్ సాధించిన భారత క్రికెటర్లకు స్వాగతం పలిచేందుకు ఫ్యాన్స్ ఎదురుచూడాల్సి వచ్చింది. తాజాగా ఈ రోజు భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. బుధవారం బార్బడోస్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరి, ఈ రోజు ఢిల్లీ చేరుకుంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఏయిరిండియా ఒక వివాదంలో ఇరుక్కుంది. బార్బడోస్ నుంచి టీమిండియాను తీసుకురావడానికి అమెరికాకు నుంచి షెడ్యూల్ చేసిన విమానాన్ని రద్దు చేసింది. వాస్తవానికి నెవార్క్- ఢిల్లీ మధ్య ఎయిరిండియా బోయింగ్ -777 విమానాన్ని నడపాల్సి ఉంది. అయితే, దీనిని క్యాన్సల్ చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దీనిపై నివేదిక కోరింది.
Also Read
- Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
- Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
- Unknown Gunmen: పాకిస్తాన్లో ‘‘ధురంధరులు’’.. 5 ఏళ్లలో 26 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హతం..
- Sergio Gor: అమెరికాలో భారత పెట్టుబడులు కొత్త శిఖరాలకు చేరుకుంటున్నాయి.. సెర్జియో గోర్ కీలక వ్యాఖ్యలు
Read Also: NEET Paper Leaks Case: నీట్ పేపర్ లీకేజీకి నిరసన.. నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్..
నిజానికి అమెరికాలోని నెవార్క్ నుంచి ఢిల్లీకి రెగ్యులర్ ఫ్లైట్ నడపాల్సి ఉంది. వాస్తవాలను నిర్ధారించేందుకు ఎయిరిండియాను నివేదిక కోరినట్లు డీజీసీఏ అధికారి వెల్లడించారు. విమానయాన నిపుణుడు మోహన్ రంగనాథన్ మాట్లాడుతూ విమానాన్ని రద్దు చేయడం డిజిసిఎ పౌర విమానయాన నిబంధనలను (సిఎఆర్) తీవ్రంగా ఉల్లంఘించడమేనని అన్నారు.
దీనిపై విషయం తెలిసిన ఎయిర్లైన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. వాస్తవానికి భారత క్రికెట్ జట్టు ప్రయాణించాల్సిన విమానయాన సంస్థ సదరు విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత బీసీసీఐ ఎయిర్ ఇండియాను సంప్రదించినట్లు చెప్పారు. అయితే, నెవార్క్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఎవరూ చిక్కుకోలేదని స్పష్టం చేశారు. నెవార్క్-ఢిల్లీ ఫ్లైట్లో బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ ముందుగానే సమాచారం అందించబడింది మరియు అసౌకర్యాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయం కూడా అందించబడ్డాయని పేర్కొన్నాడు. కొంతమంది ప్రయాణీకులకు సమాచారం గురించి తెలియబడలేదని, వారు విమానాశ్రయం చేరుకోగానే, వారిని రోడ్డు మార్గం ద్వారా న్యూయార్క్ తరలించి అక్కడ నుంచి న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్లో ఎక్కించినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Ebola outbreak: ఎబోలా వైరస్పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
-
Viral: వైద్యుడి నిర్లక్ష్యానికి ప్రాణం బలి.. కుడి కిడ్నీకి బదులు ఎడమ కిడ్నీ తొలగింపు.. రూ. 2 కోట్ల పరిహారం విధించిన NCDRC..
-
IPL Block Tickets Mafia : ఉప్పల్ స్టేడియం దగ్గర బ్లాక్ టికెట్ల దందా.. రూ. 10 వేల టికెట్ ఏకంగా రూ. 2 లక్షలు!
-
New Railway Line: తెలంగాణకు కేంద్రం మరో బంపర్ గిఫ్ట్.. రూ.5,818 కోట్లతో కొత్త రైల్వే లైన్.!
-
Team India: ఇండియా-A జట్టులోకి మరో ఆల్రౌండర్ .. హర్ష్ దూబే అవుట్..
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!