Air India: టీమిండియాను ఇంటికి తీసుకురావడానికి అమెరికా విమానం రద్దు.. నివేదిక కోరిన డీజీసీఏ..
- టీమిండియాను స్వదేశానికి చేర్చిన ఎయిర్ ఇండియా..
- దీని కోసం అమెరికా నుంచి రావాల్సిన విమానం రద్దు..
- ఘటనపై నివేదిక కోరిన డీజీసీఏ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Air India: టీ 20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత క్రికెట్ జట్ట కరేబియన్లోనే చిక్కుకుపోయింది. తుఫాను రావడంతో ఆ ప్రాంతంలో ఫ్లైట్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా టీమిండియా అక్కడే చిక్కుకుపోయింది. టీ 20 కప్ సాధించిన భారత క్రికెటర్లకు స్వాగతం పలిచేందుకు ఫ్యాన్స్ ఎదురుచూడాల్సి వచ్చింది. తాజాగా ఈ రోజు భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. బుధవారం బార్బడోస్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరి, ఈ రోజు ఢిల్లీ చేరుకుంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఏయిరిండియా ఒక వివాదంలో ఇరుక్కుంది. బార్బడోస్ నుంచి టీమిండియాను తీసుకురావడానికి అమెరికాకు నుంచి షెడ్యూల్ చేసిన విమానాన్ని రద్దు చేసింది. వాస్తవానికి నెవార్క్- ఢిల్లీ మధ్య ఎయిరిండియా బోయింగ్ -777 విమానాన్ని నడపాల్సి ఉంది. అయితే, దీనిని క్యాన్సల్ చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దీనిపై నివేదిక కోరింది.
Also Read
Read Also: NEET Paper Leaks Case: నీట్ పేపర్ లీకేజీకి నిరసన.. నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్..
నిజానికి అమెరికాలోని నెవార్క్ నుంచి ఢిల్లీకి రెగ్యులర్ ఫ్లైట్ నడపాల్సి ఉంది. వాస్తవాలను నిర్ధారించేందుకు ఎయిరిండియాను నివేదిక కోరినట్లు డీజీసీఏ అధికారి వెల్లడించారు. విమానయాన నిపుణుడు మోహన్ రంగనాథన్ మాట్లాడుతూ విమానాన్ని రద్దు చేయడం డిజిసిఎ పౌర విమానయాన నిబంధనలను (సిఎఆర్) తీవ్రంగా ఉల్లంఘించడమేనని అన్నారు.
దీనిపై విషయం తెలిసిన ఎయిర్లైన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. వాస్తవానికి భారత క్రికెట్ జట్టు ప్రయాణించాల్సిన విమానయాన సంస్థ సదరు విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత బీసీసీఐ ఎయిర్ ఇండియాను సంప్రదించినట్లు చెప్పారు. అయితే, నెవార్క్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఎవరూ చిక్కుకోలేదని స్పష్టం చేశారు. నెవార్క్-ఢిల్లీ ఫ్లైట్లో బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ ముందుగానే సమాచారం అందించబడింది మరియు అసౌకర్యాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయం కూడా అందించబడ్డాయని పేర్కొన్నాడు. కొంతమంది ప్రయాణీకులకు సమాచారం గురించి తెలియబడలేదని, వారు విమానాశ్రయం చేరుకోగానే, వారిని రోడ్డు మార్గం ద్వారా న్యూయార్క్ తరలించి అక్కడ నుంచి న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్లో ఎక్కించినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Delhi: జంతర్మంతర్ దగ్గర ఇంటర్నెట్, మొబైల్ సేవలు నిలిపివేత.. భారీగా పోలీసులు మోహరింపు
-
ZIM vs IND: జింబాబ్వేపై టీమిండియా ఘన విజయం.. 19 బంతుల్లో వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీ!
-
Sidiri Appala Raju : మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు 14 రోజుల రిమాండ్.!
-
Rahul Gandhi: విద్యార్థులు ఒంటరి కాదు.. అండగా ఉంటాం.. ఇండియా కూటమి ప్రకటన
-
Bangladesh: షేక్ హసీనాకు అధ్యక్షుడి పిలుపు.. బంగ్లాదేశ్లో రాజకీయ కల్లోలం..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?