Air India: టీమిండియాను ఇంటికి తీసుకురావడానికి అమెరికా విమానం రద్దు.. నివేదిక కోరిన డీజీసీఏ..
- టీమిండియాను స్వదేశానికి చేర్చిన ఎయిర్ ఇండియా..
- దీని కోసం అమెరికా నుంచి రావాల్సిన విమానం రద్దు..
- ఘటనపై నివేదిక కోరిన డీజీసీఏ..
Air India: టీ 20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత క్రికెట్ జట్ట కరేబియన్లోనే చిక్కుకుపోయింది. తుఫాను రావడంతో ఆ ప్రాంతంలో ఫ్లైట్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా టీమిండియా అక్కడే చిక్కుకుపోయింది. టీ 20 కప్ సాధించిన భారత క్రికెటర్లకు స్వాగతం పలిచేందుకు ఫ్యాన్స్ ఎదురుచూడాల్సి వచ్చింది. తాజాగా ఈ రోజు భారత క్రికెట్ జట్టు స్వదేశానికి చేరుకుంది. బుధవారం బార్బడోస్ నుంచి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరి, ఈ రోజు ఢిల్లీ చేరుకుంది.
ఇదిలా ఉంటే, ఇప్పుడు ఏయిరిండియా ఒక వివాదంలో ఇరుక్కుంది. బార్బడోస్ నుంచి టీమిండియాను తీసుకురావడానికి అమెరికాకు నుంచి షెడ్యూల్ చేసిన విమానాన్ని రద్దు చేసింది. వాస్తవానికి నెవార్క్- ఢిల్లీ మధ్య ఎయిరిండియా బోయింగ్ -777 విమానాన్ని నడపాల్సి ఉంది. అయితే, దీనిని క్యాన్సల్ చేసినట్లు నివేదికలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఏవియేషన్ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) దీనిపై నివేదిక కోరింది.
Also Read
- India Defense Budget: సాహో భారత్.. పాకిస్థాన్ను గజగజలాడిస్తున్న ఇండియా రక్షణ బడ్జెట్.. చైనా సాయం ఉన్నా దాయాదికి వణుకు పుట్టాల్సిందే!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
- Producing States in India: భారత్లో 'పెట్రోల్' బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
- Amrit Bharat Express: రైల్వే ప్రయాణికులు శుభవార్త.. పట్టాలపైకి మరో రెండు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..
Read Also: NEET Paper Leaks Case: నీట్ పేపర్ లీకేజీకి నిరసన.. నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్..
నిజానికి అమెరికాలోని నెవార్క్ నుంచి ఢిల్లీకి రెగ్యులర్ ఫ్లైట్ నడపాల్సి ఉంది. వాస్తవాలను నిర్ధారించేందుకు ఎయిరిండియాను నివేదిక కోరినట్లు డీజీసీఏ అధికారి వెల్లడించారు. విమానయాన నిపుణుడు మోహన్ రంగనాథన్ మాట్లాడుతూ విమానాన్ని రద్దు చేయడం డిజిసిఎ పౌర విమానయాన నిబంధనలను (సిఎఆర్) తీవ్రంగా ఉల్లంఘించడమేనని అన్నారు.
దీనిపై విషయం తెలిసిన ఎయిర్లైన్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. వాస్తవానికి భారత క్రికెట్ జట్టు ప్రయాణించాల్సిన విమానయాన సంస్థ సదరు విమానాన్ని రద్దు చేయాల్సి వచ్చింది, ఆ తర్వాత బీసీసీఐ ఎయిర్ ఇండియాను సంప్రదించినట్లు చెప్పారు. అయితే, నెవార్క్ విమానాశ్రయంలో ప్రయాణికులు ఎవరూ చిక్కుకోలేదని స్పష్టం చేశారు. నెవార్క్-ఢిల్లీ ఫ్లైట్లో బుక్ చేసుకున్న ప్రయాణీకులందరికీ ముందుగానే సమాచారం అందించబడింది మరియు అసౌకర్యాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయం కూడా అందించబడ్డాయని పేర్కొన్నాడు. కొంతమంది ప్రయాణీకులకు సమాచారం గురించి తెలియబడలేదని, వారు విమానాశ్రయం చేరుకోగానే, వారిని రోడ్డు మార్గం ద్వారా న్యూయార్క్ తరలించి అక్కడ నుంచి న్యూయార్క్-ఢిల్లీ ఫ్లైట్లో ఎక్కించినట్లు చెప్పారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!