NEET Paper Leaks Case: నీట్ పేపర్ లీకేజీకి నిరసన.. నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్..
- నేడు దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్..
- ఏపీ-తెలంగాణలోనూ విద్యాసంస్థల బంద్కు పిలుపు..
- నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా బంద్..
- బంద్కు పిలుపునిచ్చిన విద్యార్థి- యువజన సంఘాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NEET Paper Leaks Case: నీట్, నెట్ పరీక్షల లీకేజీపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరుతూ నేడు దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు బంద్ కు పిలుపునిచ్చాయి. పాఠశాలలు, కళాశాలల బంద్ చేయాలని కోరుతూ.. ఏఐఎస్ఎఫ్, పీడీఎస్యూ, పీడీఎస్వో, ఎస్ఎఫ్ఐ, ఎన్ఎస్యూఐ విద్యార్థి సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో ఏపీ, తెలంగాణలోనూ విద్యాసంస్థల బంద్కు పిలుపు నిచ్చారు. ఎన్టీఏ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. గత ఐదేళ్లలో 65 పేపర్ లీకేజీ ఘటనలు జరిగాయి. నీట్, నెట్ పరీక్షల లీకేజీపై పార్లమెంట్లో ప్రధాని మోడీ సమగ్ర విచారణ జరిపి విద్యార్థులకు న్యాయం చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. నీట్, నెట్ మాత్రమే కాదు.. గత కొన్నేళ్లుగా అన్ని పరీక్షల పేపర్ లీకేజీల వల్ల విద్యార్థులు, అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విద్యాశాఖపై మండిపడుతున్నాయి. పరీక్షలు వారి జీవితాలకు సంబంధించినవని, విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
Read also: Telangana Narcotics Police: బంపర్ ఆఫర్.. గంజాయి సమాచారం ఇవ్వండి రూ.2 లక్షలు పొందండి..
Also Read
- Cheyutha Pension : చేయూత పింఛన్కు రేపే డెడ్లైన్.. మిస్ అయితే కష్టమే.!
- Harish Rao : రూ.500 కోట్ల భూమి రూ.87 కోట్లకేనా.?రేవంత్కు హరీశ్ రావు లేఖ..!
- TG SAFE: ఫుడ్ లవర్స్ అలర్ట్.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న చట్నీస్, పిస్తా హౌస్ సహా ఈ 7 రెస్టారెంట్లు!
- TG EAPCET: తెలంగాణ ఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
మరోవైపు అకడమిక్ క్యాలెండర్ ప్రకారం జూలై 17న తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించగా.. ఆ రోజు తెలంగాణలోనే కాకుండా ఏపీలో కూడా సెలవు ప్రకటించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలకు కూడా ఈ సెలవు వర్తిస్తుందని తెలిపారు. ఆ రోజు తెలుగు రాష్ట్రాల్లో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. అలాగే ఈ నెలలో మరో సెలవు కూడా రాబోతోంది. జులై 27న పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రానున్నాయి. ఎందుకంటే ఆ రోజు తెలంగాణ ప్రభుత్వం బోనాలు పండుగను పురస్కరించుకుని సెలవు ప్రకటించింది. తెలంగాణలోని ప్రధాన పండుగల్లో బోనాలు ఒకటి. 7 జూలై 2024న గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి మొదటి బోనం సమర్పించి బోనాలు ప్రారంభమవుతాయి. ఈ క్రమంలో జూలై 27వ తేదీని రాష్ట్ర సెలవు దినంగా ప్రకటించారు. ఆ రోజు శనివారం, మరుసటి రోజు జూలై 28 ఆదివారం కావడంతో రెండు రోజుల సెలువు రాబోతోందని ప్రభుత్వం ప్రకటించింది.
NTV తెలుగు వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!