Her Voice Her Story: భారతీయ సంగీతాన్ని మలుపు తిప్పిన మహిళల కథ.. ‘హర్ వాయిస్.. హర్ స్టోరీ’
Her Voice Her Story: బెంగళూరులో భారతీయ సంగీత సామ్రాజ్యంలో మహిళల గాత్ర ప్రస్థానాన్ని వివరిస్తూ ‘హర్ వాయిస్.. హర్ స్టోరీ’ (Her Voice. Her Story) అనే అద్భుతమైన ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యింది. నిజానికి సంగీతానికి భాష లేదు.. కానీ ఆ సంగీతానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మహిళల గొంతును లోకానికి వినిపించిన ఒక గొప్ప మలుపు గురించి మీలో ఎంత మందికి తెలుసు. ఒకప్పుడు మహిళల పాట కేవలం దేవాలయాలు, రాజాస్థానాలు లేదా కొంతమంది ప్రముఖుల మధ్యే వినిపించేది.
READ ALSO: Rukmini Vasanth: ఆ నటుడితో ప్రేమలో రుక్మిణి వసంత్.. ఫొటో లీక్?
Also Read
- Titanic Life Jacket: 114 ఏళ్ల కిందటి విషాదానికి సాక్ష్యం.. వేలంలో రూ.8 కోట్లు పలికిన టైటానిక్ లైఫ్ జాకెట్!
- Hindu Funeral Traditions: హిందూమతంలో పసిబిడ్డలను ఎందుకు దహనం చేయరో తెలుసా? అసలు కారణం ఇదేనా!
- Kedarnath: కేదార్నాథ్కు ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? స్కంద పురాణంలో ఉన్న అసలు రహస్యం ఇదే!
- Chanakya Niti: విలువల ముసుగులో మోసపోకండి! ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో నేర్పిస్తున్న చాణక్య నీతి
కానీ 1902లో భారతదేశానికి ‘గ్రామఫోన్ రికార్డింగ్’ సాంకేతికత పరిచయమైంది. ఈ చిన్న మార్పు ఒక పెద్ద సామాజిక విప్లవానికి దారితీస్తుందని ఆ రోజుల్లో ఎవరు అనుకొని ఉండరు. నాలుగు గోడల మధ్య బంధీ అయిన మహిళా స్వరాలు గ్రామఫోన్ రికార్డుల ద్వారా దేశంలోని మారుమూల ఇళ్లలోకి సైతం వెళ్లగలిగాయి. తాజాగా స్టార్ అయిన ఈ ప్రదర్శనలో మనం కేవలం సంగీతాన్ని మాత్రమే కాకుండా, ఆనాడు పురుషాధిక్య సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎందరో మహనీయుల గురించి తెలుసుకోవచ్చు.
భారతదేశంలో మొట్టమొదటి రికార్డింగ్ స్టార్ గౌహర్ జాన్, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గొప్ప సంఘ సంస్కర్త బెంగళూరు నాగరత్నమ్మ, తమ అద్భుతమైన గాత్రంతో ఆనాడు లక్షలాది మందిని ఉర్రూతలూగించిన సంగీత కళాకారిణులు జద్దన్ బాయి, జానకీ బాయి, వీరితో పాటు సేలం గోదావరి, కోయంబత్తూర్ తాయి వంటి వారు తమ కళా నైపుణ్యంతో ఒక కొత్త పరిశ్రమనే ఎలా నిర్మించారో ఈ ప్రదర్శన మనకు కళ్లకు కడుతుంది. ఈ ఎగ్జిబిషన్ కేవలం పాటల ప్రదర్శన మాత్రమే కాదు, ఇది సాంకేతికత, లింగ వివక్ష, జ్ఞాపకాలు, పవర్ (అధికారం) గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది. చరిత్రలో పేరు దక్కించుకున్న వారే కాకుండా, అసలు పేర్లు తెలియని ఎంతో మంది మహిళా గాయనీమణుల కృషిని కూడా ప్రదర్శిస్తున్నారు. మీరు బెంగళూరులో ఉన్నట్లయితే ఈ అపురూప ప్రదర్శనను సందర్శించే అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇండియన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ మ్యూజియం (IME) & ప్రెస్టీజ్ సెంటర్ (PCPA). ప్రెస్టీజ్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, కోణనకుంటె, బెంగళూరులో ఈ కార్యక్రమం జనవరి 17, 2026 నుంచి జనవరి 25 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. ఇందులో స్పెషల్ ఏంటి అంటే.. అందరికీ ప్రవేశం ఉచితం. నిజానికి మన సంస్కృతిని, మన గడ్డపై నుంచి వినిపించిన గొప్ప స్వరాలను గౌరవించడానికి ఇదొక మంచి అవకాశం. మీ పిల్లలను, పెద్దలను వెంటబెట్టుకొని ఈ సంగీత ప్రయాణంలో భాగస్వామ్యం అయితే మీ జీవితంలో అదొక మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
READ ALSO: Global Gold Reserves: ప్రపంచంలో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉందో తెలుసా.. ఈ రేసులో భారత్ ప్లేస్ ఇదే!
తాజావార్తలు
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Tollywood Star Hero: ధురందర్ డైరెక్టర్ తో సినిమాకి తెలుగు స్టార్ హీరో యత్నాలు?
-
NTV ఎఫెక్ట్..! డ్యూటీ వదిలి చేపలు పట్టిన 60 మంది CRPF పోలీసుల బదిలీ
-
Hero Dupes: డబ్బు పెట్టే వాడికి లేని నొప్పి మనకెందుకు? .. జేడీ కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!