Her Voice Her Story: భారతీయ సంగీతాన్ని మలుపు తిప్పిన మహిళల కథ.. ‘హర్ వాయిస్.. హర్ స్టోరీ’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Her Voice Her Story: బెంగళూరులో భారతీయ సంగీత సామ్రాజ్యంలో మహిళల గాత్ర ప్రస్థానాన్ని వివరిస్తూ ‘హర్ వాయిస్.. హర్ స్టోరీ’ (Her Voice. Her Story) అనే అద్భుతమైన ఎగ్జిబిషన్ స్టార్ట్ అయ్యింది. నిజానికి సంగీతానికి భాష లేదు.. కానీ ఆ సంగీతానికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్రలో మహిళల గొంతును లోకానికి వినిపించిన ఒక గొప్ప మలుపు గురించి మీలో ఎంత మందికి తెలుసు. ఒకప్పుడు మహిళల పాట కేవలం దేవాలయాలు, రాజాస్థానాలు లేదా కొంతమంది ప్రముఖుల మధ్యే వినిపించేది.
READ ALSO: Rukmini Vasanth: ఆ నటుడితో ప్రేమలో రుక్మిణి వసంత్.. ఫొటో లీక్?
Also Read
- Conch Shell Facts: శంఖం రహస్యం తెలుసా? పూజలో ఉపయోగించే ఈ వస్తువు వెనుక ఆశ్చర్యకరమైన నిజాలు
- Chanakya Niti: ఎంత కోపం వచ్చినా ఇలా కంట్రోల్ చేసుకోండి.. చాణక్యుడి 5 విజయ మంత్రాలు ఇవే!
- Kaivalya Vohra: 22 ఏళ్లకే బిలియనీర్.. సక్సెస్ అంటే ఇదే! ఒక్క యాప్తో ఇండియాను మార్చిన జెన్-జెడ్ కుర్రోడు..
- ఇండియాలో EMI కల్చర్ ఎలా మొదలైందో తెలుసా? భారతదేశాన్ని మార్చిన ఆ వ్యక్తి ఇతనే!
కానీ 1902లో భారతదేశానికి ‘గ్రామఫోన్ రికార్డింగ్’ సాంకేతికత పరిచయమైంది. ఈ చిన్న మార్పు ఒక పెద్ద సామాజిక విప్లవానికి దారితీస్తుందని ఆ రోజుల్లో ఎవరు అనుకొని ఉండరు. నాలుగు గోడల మధ్య బంధీ అయిన మహిళా స్వరాలు గ్రామఫోన్ రికార్డుల ద్వారా దేశంలోని మారుమూల ఇళ్లలోకి సైతం వెళ్లగలిగాయి. తాజాగా స్టార్ అయిన ఈ ప్రదర్శనలో మనం కేవలం సంగీతాన్ని మాత్రమే కాకుండా, ఆనాడు పురుషాధిక్య సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎందరో మహనీయుల గురించి తెలుసుకోవచ్చు.
భారతదేశంలో మొట్టమొదటి రికార్డింగ్ స్టార్ గౌహర్ జాన్, కర్ణాటక సంగీత విద్వాంసురాలు, గొప్ప సంఘ సంస్కర్త బెంగళూరు నాగరత్నమ్మ, తమ అద్భుతమైన గాత్రంతో ఆనాడు లక్షలాది మందిని ఉర్రూతలూగించిన సంగీత కళాకారిణులు జద్దన్ బాయి, జానకీ బాయి, వీరితో పాటు సేలం గోదావరి, కోయంబత్తూర్ తాయి వంటి వారు తమ కళా నైపుణ్యంతో ఒక కొత్త పరిశ్రమనే ఎలా నిర్మించారో ఈ ప్రదర్శన మనకు కళ్లకు కడుతుంది. ఈ ఎగ్జిబిషన్ కేవలం పాటల ప్రదర్శన మాత్రమే కాదు, ఇది సాంకేతికత, లింగ వివక్ష, జ్ఞాపకాలు, పవర్ (అధికారం) గురించి మనల్ని ఆలోచింపజేస్తుంది. చరిత్రలో పేరు దక్కించుకున్న వారే కాకుండా, అసలు పేర్లు తెలియని ఎంతో మంది మహిళా గాయనీమణుల కృషిని కూడా ప్రదర్శిస్తున్నారు. మీరు బెంగళూరులో ఉన్నట్లయితే ఈ అపురూప ప్రదర్శనను సందర్శించే అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ కార్యక్రమ నిర్వాహకులు ఇండియన్ మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ మ్యూజియం (IME) & ప్రెస్టీజ్ సెంటర్ (PCPA). ప్రెస్టీజ్ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్, కోణనకుంటె, బెంగళూరులో ఈ కార్యక్రమం జనవరి 17, 2026 నుంచి జనవరి 25 వరకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు జరుగుతుంది. ఇందులో స్పెషల్ ఏంటి అంటే.. అందరికీ ప్రవేశం ఉచితం. నిజానికి మన సంస్కృతిని, మన గడ్డపై నుంచి వినిపించిన గొప్ప స్వరాలను గౌరవించడానికి ఇదొక మంచి అవకాశం. మీ పిల్లలను, పెద్దలను వెంటబెట్టుకొని ఈ సంగీత ప్రయాణంలో భాగస్వామ్యం అయితే మీ జీవితంలో అదొక మరిచిపోలేని జ్ఞాపకంగా మిగిలిపోతుంది.
READ ALSO: Global Gold Reserves: ప్రపంచంలో ఎవరి దగ్గర ఎక్కువ బంగారం ఉందో తెలుసా.. ఈ రేసులో భారత్ ప్లేస్ ఇదే!
తాజావార్తలు
-
Tollywood: సీక్వెల్ కావాలంటున్న స్టార్ హీరో.. ‘నో’ అంటున్న డైరెక్టర్!
-
BC Reservations: అసెంబ్లీ ముందుకు బీసీ రిజర్వేషన్ బిల్లు.. స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్స్..
-
RC17: రామ్ చరణ్ ఊరమాస్ మేకోవర్.. సుకుమార్ పక్కా స్కెచ్!
-
Explainer: పాక్ కొత్త పొత్తులు, పాత కక్షలు.. దాయాది దారి ఎటు?
-
Tamil Nadu: “విజయ్ ప్రియమైన త్రిషకు డిప్యూటీ సీఎం పదవి ఎప్పుడు.?” అన్నాడీఎంకే నేత సంచలన వ్యాఖ్యలు..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..