Rahul Gandhi: వక్ఫ్ తర్వాత ఆర్ఎస్ఎస్ టార్గెట్ అదే..
- వక్ఫ్ బిల్లు తర్వాత ఆర్ఎస్ఎస్ టార్గెట్ కాథలిక్ సంస్థలే.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: వక్ఫ్ సవరణ బిల్లు-2025ని పార్లమెంట్ ఆమోదించింది. అయితే, ఆమోదం పొందినప్పటికీ దీనిపై రచ్చ ఆగడం లేదు. కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పార్టీల నేతలు వక్ఫ్ బిల్లును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. వక్ఫ్ తర్వాత ఆర్ఎస్ఎస్ కాథలిక్ చర్చిలను, క్రైస్తవ సమాజాన్ని టార్గెట్ చేయబోతోందని హెచ్చరించారు.
ఆర్ఎస్ఎస్ వెబ్సైట్ వ్యాసంలో భారతదేశంలో కాథలిక్ సంస్థలకు 7 కోట్ల హెక్టార్ల భూమి ఉందని, అవి అతిపెద్ద ప్రభుత్వేతర భూ యజమానులుగా ఉన్నాయని పేర్కొందని రాహుల్ గాంధీ ఎక్స్లో ట్వీట్ చేశారు. వక్ఫ్ బిల్లు ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తుందని నేను చెప్పాను. కానీ భవిష్యత్తులో ఇతర వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. ఆర్ఎస్ఎస్ క్రైస్తవుల వైపు దృష్టి మరల్చడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇటువంటి దాడుల నుంచి ప్రజల్ని రక్షించే ఏకైక కవచం రాజ్యాంగం, దానిని రక్షించడం అందరి విధి’’ అని ట్వీట్ చేశారు.
Also Read
- Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కుర్చీల కొట్లాట.. త్వరలోనే హైకమాండ్ కీలక నిర్ణయం!
- EV Subsidy: మీరు ఈవీ వెహికిల్ ఇంకా తీసుకోలేదా..? ఇదే కరెక్ట్ సమయం.. మరోసారి సబ్సిడీ పెంపు..!
- Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
- Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్పై తీవ్ర విమర్శలు
Read Also: Amit Shah: మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం..
వక్ఫ్ బిల్లు ఆమోదం సమయంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ తర్వాతి టార్గెట్ క్రైస్తువులే అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ వ్యాసంలో భారతదేశంలో కాథలిక్ సమాజం చేతిలో 7 కోట్ల ఎకరాలు ఉన్నాయని స్పష్టంగా పేర్కొందని, తదుపరి వారి టార్గెట్ కాథలిక్ కమ్యూనిటీనే అని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల ఆరోపించారు.
‘‘భారతదేశంలో ఎవరికి ఎక్కువ భూమి ఉంది..? కాథలిక్ చర్చి వర్సెస్ వక్ఫ్ బోర్డు చర్చ’’ అనే టైటిల్తో కూడిన వ్యాసంలో, కాథలిక్ సంస్థల కింద ఉన్న భూమిలో ఎక్కువ భాగాన్ని బ్రిటిష్ పాలనలో 1927 ఇండియన్ చర్చి చట్టం ద్వారా స్వాధీనం చేసుకుందని ఆరోపించింది. వలసవాద కాలంలో లీజుకు తీసుకున్న భూమిని ఇకపై చర్చి ఆస్తిగా గుర్తించబోమని పేర్కొన్న 1965 ప్రభుత్వం ఉత్తర్వులను ఉదహరించింది. అంతకుముందు వక్ఫ్ బిల్లు ముస్లిం హక్కుల్ని కాలరాస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇదిలా ఉంటే, కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలియజేయడం గమనార్హం.
https://twitter.com/RahulGandhi/status/190839863927527449
తాజావార్తలు
-
Action King Arjun: ‘పాలిటిక్స్ అంటే పైసల గేమ్.. నా దగ్గర అంత డబ్బు లేదు’ పొలిటికల్ ఎంట్రీపై యాక్షన్ కింగ్ అర్జున్ క్లారిటీ!
-
Rishab Pant: పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో LSG.. తప్పులేదంటూ రిషభ్ పంత్కు సునీల్ గవాస్కర్ మద్దతు..
-
YS.Jagan: మెగా డీఎస్సీనా? దగా డీఎస్సీనా? చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన జగన్
-
Virat Kohli Record: అరుదైన ఘనతకు చేరువలో విరాట్ కోహ్లీ.. నంబర్-1 ప్లేయర్గా చరిత్ర!
-
Karnataka Politics: కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కుర్చీల కొట్లాట.. త్వరలోనే హైకమాండ్ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!