Rahul Gandhi: వక్ఫ్ తర్వాత ఆర్ఎస్ఎస్ టార్గెట్ అదే..
- వక్ఫ్ బిల్లు తర్వాత ఆర్ఎస్ఎస్ టార్గెట్ కాథలిక్ సంస్థలే.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi: వక్ఫ్ సవరణ బిల్లు-2025ని పార్లమెంట్ ఆమోదించింది. అయితే, ఆమోదం పొందినప్పటికీ దీనిపై రచ్చ ఆగడం లేదు. కాంగ్రెస్, ఇతర ఇండీ కూటమి పార్టీల నేతలు వక్ఫ్ బిల్లును ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఈ వివాదాల నేపథ్యంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. వక్ఫ్ తర్వాత ఆర్ఎస్ఎస్ కాథలిక్ చర్చిలను, క్రైస్తవ సమాజాన్ని టార్గెట్ చేయబోతోందని హెచ్చరించారు.
ఆర్ఎస్ఎస్ వెబ్సైట్ వ్యాసంలో భారతదేశంలో కాథలిక్ సంస్థలకు 7 కోట్ల హెక్టార్ల భూమి ఉందని, అవి అతిపెద్ద ప్రభుత్వేతర భూ యజమానులుగా ఉన్నాయని పేర్కొందని రాహుల్ గాంధీ ఎక్స్లో ట్వీట్ చేశారు. వక్ఫ్ బిల్లు ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తుందని నేను చెప్పాను. కానీ భవిష్యత్తులో ఇతర వర్గాలను లక్ష్యంగా చేసుకోవడానికి ఇది ఒక ఉదాహరణ. ఆర్ఎస్ఎస్ క్రైస్తవుల వైపు దృష్టి మరల్చడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇటువంటి దాడుల నుంచి ప్రజల్ని రక్షించే ఏకైక కవచం రాజ్యాంగం, దానిని రక్షించడం అందరి విధి’’ అని ట్వీట్ చేశారు.
Also Read
- Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
- Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
- MK Stalin: రాహుల్గాంధీకి వెరైటీగా బర్త్డే విషెస్ చెప్పిన స్టాలిన్
- Rahul Gandhi: ఖర్గే ఆధ్వర్యంలో బర్త్డే కేక్ కట్ చేసిన రాహుల్ గాంధీ.. అభిమానులతో ఫొటోలు
Read Also: Amit Shah: మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం..
వక్ఫ్ బిల్లు ఆమోదం సమయంలో కాంగ్రెస్, రాహుల్ గాంధీ బీజేపీ, ఆర్ఎస్ఎస్ తర్వాతి టార్గెట్ క్రైస్తువులే అని చెప్పారు. ఆర్ఎస్ఎస్ వ్యాసంలో భారతదేశంలో కాథలిక్ సమాజం చేతిలో 7 కోట్ల ఎకరాలు ఉన్నాయని స్పష్టంగా పేర్కొందని, తదుపరి వారి టార్గెట్ కాథలిక్ కమ్యూనిటీనే అని కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితల ఆరోపించారు.
‘‘భారతదేశంలో ఎవరికి ఎక్కువ భూమి ఉంది..? కాథలిక్ చర్చి వర్సెస్ వక్ఫ్ బోర్డు చర్చ’’ అనే టైటిల్తో కూడిన వ్యాసంలో, కాథలిక్ సంస్థల కింద ఉన్న భూమిలో ఎక్కువ భాగాన్ని బ్రిటిష్ పాలనలో 1927 ఇండియన్ చర్చి చట్టం ద్వారా స్వాధీనం చేసుకుందని ఆరోపించింది. వలసవాద కాలంలో లీజుకు తీసుకున్న భూమిని ఇకపై చర్చి ఆస్తిగా గుర్తించబోమని పేర్కొన్న 1965 ప్రభుత్వం ఉత్తర్వులను ఉదహరించింది. అంతకుముందు వక్ఫ్ బిల్లు ముస్లిం హక్కుల్ని కాలరాస్తుందని కాంగ్రెస్ ఆరోపించింది. ఇదిలా ఉంటే, కేరళ కాథలిక్ బిషప్స్ కౌన్సిల్ వక్ఫ్ బిల్లుకు మద్దతు తెలియజేయడం గమనార్హం.
https://twitter.com/RahulGandhi/status/190839863927527449
తాజావార్తలు
-
Kuldeep Yadav: కుల్దీప్ స్థానానికి ముప్పు..? టీమిండియాలో అసలు నిజాలు వెల్లడించిన కోచ్..
-
Kesar Mango Record: పండ్ల రాజు గిర్ కేసర్ మామిడి.. 10 ఏళ్ల రికార్డులు బద్దలు
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Parastoo Ahmadi: హిజాబ్ ధరించనందుకు గాయనికి 74 కొరడా దెబ్బలతో శిక్ష
-
Uddhav Thackeray: అధికారం కోసం కాదు, సిద్ధాంతాల కోసమే పదవిని వదులుకున్నా: ఉద్ధవ్ ఠాక్రే
ట్రెండింగ్
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు