Amit Shah: మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టులు లేకుండా చేస్తాం..
- 2026 మార్చి నాటికి దేశంలో మావోస్టులు లేకుండా చేస్తాం: అమిత్ షా..
- మావోయిస్టులు లొంగిపోవాలని సూచన..
Amit Shah: 2026 మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టుల నుంచి విడిపిస్తామని మరోసారి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు. బస్తర్ పాండు కార్యక్రమంలో జరిగిన సభలో షా ప్రసంగిస్తూ.. బస్తర్లో మావోయిజం అంతమయ్యే దళలో ఉందని, వచ్చే ఏడాది నాటికి భారతదేశంలో ‘‘లాల్ ఆతంక్’’ పట్టు నుంచి విముక్తి చేయడానికి బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన చెప్పారు.
Read Also: Fake Doctor: దారుణం.. హార్ట్ సర్జరీలు చేసిన “ఫేక్ డాక్టర్”.. ఏడుగురి మృతి..
Also Read
గత మూడు నెలల్లో 521 మంది నక్సల్స్ లొంగిపోయారని, 2024లో మొత్తం 881 మంది నక్సల్స్ లొంగిపోయానని చెప్పారు. లొంగిపోయే వారికి జనజీవన స్రవంతిలోకి తీసుకుంటామని అమిత్ షా హామీ ఇచ్చారు. అదే విధంగా ఆయుధాలు చేతపట్టిన వారు భద్రత దళాలను ఎదుర్కుంటారని హెచ్చరించారు. బస్తర్ ఇకపై భయానికి చిహ్నం కాదని, భవిష్యత్తుకు చిహ్నమని అన్నారు.
గతంలో రాజకీయ నాయకులు ఈ ప్రాంతాన్ని సందర్శించకుండా, అభివృద్ధిని అడ్డుకున్నారని ఆయన విమర్శించారు. ఇక్కడ నాయకులు ప్రసంగాలు చేయకుండా ఆపేవారు, ముఖ్యమంత్రి వెళ్లవద్దని చెబుతారు, కానీ ఇప్పుడు మేము 50,000 మంది ఆదివాసీ సోదరులు, సోదరీమణులతో రామనవమి, అష్టమిని జరుపుకుంటున్నామని ఆయన చెప్పారు. అమిత్ షా పాల్గొన్న ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, ఉపముఖ్యమంత్రి విజయ్ వర్మ షా కూడా హాజరయ్యారు. క్యాబినెట్ మంత్రులు కేదార్ కశ్యప్, రాం విచార్ నేతమ్, బీజేపీ స్టేట్ ప్రెసిడెందట్ కిరణ్ సింగ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముందు అమిత్ షా దంతేవాడలోని మా దంతేశ్వరి ఆలయంలో ప్రార్థనలు చేశారు.
తాజావార్తలు
-
Shreyas Iyer: మాపై కేఎల్ రాహుల్ 152 కొట్టడమే.. మా గెలుపుకు కారణం: శ్రేయస్ అయ్యర్
-
Land Rates: ORR-RRR మధ్య చైనా తరహా పార్కులు.. మే 1 నుంచే తెలంగాణలో భూమి ధరలు పెంపు..
-
PM Modi: మే 4 తర్వాత బెంగాల్లో మాఫియా, గుండాల అంతం ఖాయం..
-
Vizag ROB Collapse: విశాఖలో ప్రమాదం.. కూలిన నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి
-
Payal Rajput Lover హీరోగా సినిమా.. ఆరోజే రిలీజ్
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!