AAP: ఢిల్లీ ప్రజలకు ఆప్ హామీల జల్లు.. ప్రతీ మహిళకు నెలకు రూ. 2100
- ఢిల్లీ ప్రజలపై ఆప్ హామీల జల్లు..
- మేనిఫెస్టోని విడుదల చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ..
- ఢిల్లీ ఎన్నికలకు మరో వారం రోజులు మాత్రమే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AAP: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో అధికార ఆప్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ముఖ్యంగా ఆప్, బీజేపీ మధ్య భారీ పోటీ నెలకొంది. పోటాపోటీగా ఇరు పార్టీలు ప్రజలపై హామీల వర్షం కురిపిస్తున్నాయి. తాజాగా, ఆప్ మరోసారి ఢిల్లీ ప్రజలపై హామీల జల్లు కురిపించింది. సోమవారం తన మానిఫెస్టోని విడుదల చేసింది.
Read Also: USA: ట్రంప్ గురుద్వారాలను కూడా వదలడం లేదు.. అక్రమ వలసదారుల కోసం వేట..
Also Read
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
- Ganja Seized: ఒడిశా నుంచి యూపీకి కారులో గంజాయి తరలింపు.. ముగ్గురు అరెస్ట్..
నిరుద్యోగులు లేని రాజధానిగా ఢిల్లీని మారుస్తాంమని, అధికారంలోకి రాగానే యువతకు ఉద్యోగాలు, మహిళా సమ్మాన్ యోజన పథకం కింద అర్హులైన మహిళలకు నెలకు రూ. 2100 అందిస్తామని వెల్లడించింది. సంజీవని పథకం కింద 60 ఏళ్లు నిండిన వారికి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందించడంతో పాటు నీటి సరఫరా బిల్లులు మాఫీ, 24 గంటల పాటు నీటి సరఫరాని కల్పిస్తామని చెప్పింది. యూరప్ తరహాలో రోడ్ల నిర్మాణం, యమూనా నది క్లీన్ చేయడం, విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు ఢిల్లీ మెట్రో ప్రయాణంలో 50 శాతం రాయితీ, రేషన్ కార్డులు మంజూరు, డ్రైనేజీ వ్యవస్థ పరిష్కారాలు చూపిస్తామని చెప్పింది. ఆటో, టాక్సీ, ఈ- రిక్షా డ్రైవర్ల కుమార్తెల వివాహాలకు రూ. లక్ష సాయం,వారి పిల్లలకు ఉచిత కోచింగ్, జీవిత బీమా అందిస్తామని వెల్లడించింది.
ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 05న ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 08న ఫలితాలు విడుదలవుతాయి. గత రెండు పర్యాయాలుగా ఢిల్లీని ఆప్ ఏలుతోంది. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ శాయశక్తులు ఒడ్డుతోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా తన పూర్వవైభవాన్ని సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. ఢిల్లీలో ముక్కోణపు పోటీ నెలకొంది.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!