Lok sabha: లోక్సభలో ఈ-సిగరెట్పై దుమారం.. చర్యలుంటాయని స్పీకర్ హెచ్చరిక
- లోక్సభలో ఈ-సిగరెట్పై దుమారం
- టీఎంసీ ఎంపీపై బీజేపీ ఎంపీ ఆరోపణలు
- చర్యలుంటాయని స్పీకర్ హెచ్చరిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోక్సభలో ఈ-సిగరెట్పై దుమారం చెలరేగింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఈ-సిగరెట్ తాగుతుంటే చూసినట్లుగా బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పీకర్ ఓం బిర్లా దృష్టికి తీసుకొచ్చారు. దేశమంతా ఈ-సిగరెట్పై బ్యాన్ ఉన్నట్లుగా అనురాగ్ ఠాకూర్ తెలిపారు. దీంతో లోక్సభ సభ్యులను ఉద్దేశించి స్పీకర్ రూల్ పాస్ చేశారు. ఇకపై సభలో ఎవరైనా సిగరెట్ తాగినట్లుగా తన దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Rahul Gandhi: భయంతో తప్పుడు భాష మాట్లాడారు.. అమిత్ షా ప్రసంగంపై రాహుల్ గాంధీ అభ్యంతరం
Also Read
- Danish Kaneria: "రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?".. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
- Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. "బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు"
- Dharmendra Pradhan Education: ధర్మేంద్ర ప్రధాన్ ఎంత వరకు చదువు, ఆస్తుల వివరాలు మీకు తెలుసా?
- Rahul Gandhi on NEET Paper Leak: "యువత భవిష్యత్తును ఎక్కువగా దెబ్బతీసింది మీరే".. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ కౌంటర్
ప్రశ్నోత్తరాల సమయంలో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. సభలో ఈ-సిగరెట్లు తాగడానికి అనుమతిస్తారా? అంటూ స్పీకర్ను అడిగారు. అందుకు ఓం బిర్లా ససేమిరా అన్నారు. దీంతో అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా సభలో తృణమూల్ ఎంపీ ఈ-సిగరెట్ తాగుతున్నారని తెలిపారు. అతని పేరు మాత్రం చెప్ప దల్చుకోలేదన్నారు. దేశ వ్యాప్తంగా ఈ-సిగరెట్లు నిషేధించబడ్డాయని.. అయినప్పటికీ సభలో తాగుతున్నట్లు తెలిపారు. చాలా రోజులుగా తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇలా చేస్తున్నారని.. వెంటనే దర్యాప్తు చేయాలని కోరారు.
ఇది కూడా చదవండి: India-UN: ఆప్ఘనిస్థాన్లో పాక్ దాడులను ఖండిస్తున్నాం.. యూఎన్లో భారత్ ప్రకటన
ఓం బిర్లా జోక్యం చేసుకుంటూ.. సభలో సభ్యులు గౌరవాన్ని కాపాడుకోవాలని.. లేదంటే చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. పార్లమెంటరీ సంప్రదాయాలు, నియమాలకు కట్టుబడి ఉండాలని కోరారు. ఇకపై ఇలాంటివి తన దృష్టికి వస్తే చర్య తీసుకుంటానని వార్నింగ్ ఇచ్చారు.
2019 నాటి నుంచి ఎలక్ట్రానిక్ సిగరెట్ల నిషేధం ఉంది. భారతదేశంలో పూర్తిగా నిషేధించారు. తయారు చేయడం, దిగుమతి చేసుకోవడం, విక్రయించడం, పంపిణీ చేయడం, నిల్వ చేయడం లేదా ప్రకటన చేయడం చట్టవిరుద్ధం. పార్లమెంట్ రూల్ బుక్ ప్రకారం ధూమపానం నిషేధించబడిందని పేర్కొంది.
తాజావార్తలు
-
Danish Kaneria: “రాముడు, మోడీ, హిందుత్వాన్ని తిట్టడమే నిరసనా?”.. సీజేపీ ఆందోళనలపై పాక్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు..
-
RAW NTR: ఊహించని ట్విస్ట్.. ‘రా ఎన్టీఆర్’కు గుడ్బై.. అసలు ఏమైంది?
-
Abhijit Deepke: అభిజిత్ దీప్కే సంచలన ఆరోపణలు.. “బీజేపీ కార్యకర్తలు రాళ్లు విసిరారు, ముందే రాళ్లు తెచ్చుకున్నరు”
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
ట్రెండింగ్
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!
-
6 ఏళ్ల తర్వాత ‘S’ సిరీస్ కమ్బ్యాక్.. ప్రీమియం ఫీచర్లతో అతి త్వరలో రాబోతున్న Vivo S2 స్మార్ట్ ఫోన్.!
-
అల్ట్రా స్లిమ్ డిజైన్, 200MP కెమెరా, 5000mAh బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్ Samsung Galaxy Z Fold8 Ultra లాంచ్.!
-
Samsung కొత్త స్మార్ట్వాచ్లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!