Dussehra Rally: షిండే వర్గానికి కోర్టు షాక్.. ఆ పార్క్లో దసరా వేడుకలకు ఉద్ధవ్కు అనుమతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dussehra Rally: మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేనేతృత్వంలోని శివసేనకు బాంబే హైకోర్టులో శుక్రవారం ఊరట లభించింది. ముంబైలోని ప్రముఖ శివాజీ పార్క్లో దసరా ర్యాలీని నిర్వహించేందుకు ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేనకు హైకోర్టు అనుమతి ఇవ్వడంతో శివసేనకు చెందిన ఏక్నాథ్ షిండే వర్గానికి ఈరోజు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీకి దావాపై వివాదం పరిష్కారమయ్యే వరకు పిటిషన్పై నిర్ణయం తీసుకోవద్దని షిండే వర్గం చేసిన అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది.
ముంబై పోలీసులు లేవనెత్తిన శాంతిభద్రతల ఆందోళనల ఆధారంగా ప్రముఖ శివాజీ పార్క్ వద్ద దసరా ర్యాలీ నిర్వహించేందుకు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనతో పాటు ఏక్నాథ్ షిండే వర్గానికి బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ గతంలో అనుమతి నిరాకరించింది. బీఎంసీ నిర్ణయాన్ని థాకరే వర్గం సవాల్ చేసింది. బీఎంసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఉద్ధవ్ నేతృత్వంలోని శివసేన దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఆర్డీ ధనూకా, జస్టిస్ కమల్ ఖాటా డివిజన్ బెంచ్ విచారణ జరిపింది. బీఎంసీ ఆదేశాలు న్యాయ ప్రక్రియకు విరుద్ధంగా ఉన్నాయని తెలిపింది. అక్టోబరు 2 నుంచి 6 వరకు శివాజీ పార్కును ఉపయోగించుకునేందుకు అనుమతి మంజూరు చేసింది. శాంతిభద్రతలకు విఘాతం కలిగించరాదని షరతు విధించింది.
Also Read
ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన వర్గం ఎమ్మెల్యే సదా సర్వాంకర్ కూడా బహిరంగ సభ నిర్వహణకు అనుమతించాలని బీఎంసీకి దరఖాస్తు చేశారు. ఈ దరఖాస్తును కూడా బీఎంసీ సెప్టెంబరు 21న తిరస్కరించింది. ఇరు వర్గాలు దరఖాస్తు చేసినందు వల్ల శాంతిభద్రతల సమస్య తలెత్తుతుందని స్థానిక పోలీసులు హెచ్చరించారని తెలిపింది.
AIIMS-Delhi: ఎయిమ్స్ కొత్త డైరెక్టర్గా డాక్టర్ ఎం.శ్రీనివాస్ నియామకం
శివసేన పార్టీ ఆవిర్భవించిన 1966 నుంచి ప్రతి ఏటా ముంబైలోని శివాజీ మహారాజ్ పార్క్లో దసరా వేడుకలను శివసేన నిర్వహిస్తోంది. అయితే కరోనా వల్ల గత రెండేళ్లుగా దసరా ఉత్సవాలు జరుగలేదు. మరోవైపు శివసేనలో చీలిక వల్ల ఈ ఏడాది శివాజీ పార్క్లో దసరా బహిరంగ సభ నిర్వాహణకు రెండు వర్గాలు పోటీ పడ్డాయి. అయితే ఉద్ధవ్ ఠాక్రేకు అనుకూలంగా బాంబే హైకోర్టు స్పందించింది. మరోవైపు సీఎం ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన రెబల్ వర్గం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ గ్రౌండ్లో దసరా వేడుకలకు ఇప్పటికే బీఎంసీ నుంచి అనుమతి పొందింది. ఉద్ధవ్ ఠాక్రే ఆగస్టులో ఏక్నాథ్ షిండేపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమానికి అనుమతి లభిస్తుందో లేదో పార్టీకి ఖచ్చితంగా తెలియదని అన్నారు. ఏది జరిగినా శివాజీ పార్క్ వద్ద దసరా ర్యాలీ నిర్వహిస్తానని ఠాక్రే చెప్పారు. అక్టోబరు 5న జరగనున్న ఈ ర్యాలీలో మహారాష్ట్ర పరిణామాలపై పెద్ద ఎత్తున ప్రసంగించనున్నారు.
తాజావార్తలు
-
Akhilesh Yadav: రామమందిరంలో కానుకలు మాయం?.. అఖిలేష్ సంచలన ఆరోపణ
-
Harish Rao : రేవంత్కు రైతుల శాపం తప్పదు.. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది
-
Pakistan: చేతులెత్తేసిన పాకిస్థాన్ ప్రభుత్వం.. అవస్థలు పడుతున్న జనం! ఏం జరిగిందంటే..
-
Vijay Antony: బిగ్ షాక్.. సినిమా ఇండస్ట్రీకి విజయ్ ఆంటోని గుడ్ బై..
-
Pant Video: ఏంటి పంత్ భయ్యా ఆ కొట్టుడు.. నువ్వు కొట్టిన దెబ్బకు డ్రోన్ పగిలి గ్రౌండ్లో పడిపోయిందిగా..?
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!