MP: ఆస్పత్రిలో అమానుషం.. వృద్ధుడిని ఈడ్చికెళ్లిన సిబ్బంది. వైద్యులు సస్పెండ్
- మధ్యప్రదేశ్లో ఆస్పత్రిలో అమానుషం
- వృద్ధుడిని ఈడ్చికెళ్లిన సిబ్బంది
- ఇద్దరు వైద్యులు సస్పెండ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మధ్యప్రదేశ్లోని ప్రభుత్వాస్పత్రిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఒక వృద్ధుడిని వైద్య సిబ్బంది కనికరం లేకుండా ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇద్దరు వైద్యులపై సస్పెండ్ వేటు వేసింది.
ఇది కూడా చదవండి: Rajni : జైలర్ 2 తెలుగు రాష్ట్రాల రైట్స్.. అతిగా ఆశపడుతున్న మేకర్స్
Also Read
- Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
- Coimbatore R*ape Case: సంచలనంగా మారిన కోయంబత్తూరు ఘటన.. విజయ్ సర్కార్పై తీవ్ర విమర్శలు
- Petrol, Diesel Price Hike: మళ్ళీ భారీగా పెరిగిన డీజిల్, పెట్రోల్ ధరలు
- Karnataka Tragedy: కర్ణాటకలో ఘోర విషాదం.. ముత్యపుచిప్పల కోసం మృత్యు ఒడిలోకి! నదిలో మునిగి ఎనిమిది మంది మృతి..
ఏప్రిల్ 17న నౌగావ్ పట్టణానికి చెందిన ఉద్ధవ్ సింగ్ జోషి (77).. భార్య వైద్య పరీక్షల కోసం ఛతర్పూర్లోని జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చాడు. ఏమైందో ఏమో తెలియదు గానీ ఇద్దరు వ్యక్తులు.. జోషిని లాక్కెళ్లారు. టైమ్ స్లాట్ స్లిప్ తీసుకుని చాలా సేపు క్యూలో ఉన్నానని.. తన వంతు వచ్చినప్పుడు డాక్టర్ రాజేష్ మిశ్రా అభ్యంతరం చెప్పి చెంపదెబ్బ కొట్టాడని జోషి ఆరోపించాడు. అప్పటికే ఆ స్థలం రద్దీగా ఉందని.. క్యూలో నిలబడే విషయంలో డాక్టర్ మిశ్రా అభ్యంతరం వ్యక్తం చేశాడని సివిల్ సర్జన్ జీఎల్ అహిర్వర్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Gaza-Israel: 15 మంది వైద్యుల హత్య.. ఉద్దేశపూర్వకంగా జరగలేదన్న ఐడీఎఫ్
ఘటనపై క్లారిటీ రాలేదు గానీ.. వృద్ధుడిని ఈడ్చుకెళ్లిన దృశ్యాలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మిశ్రా, అహిర్వార్కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కఠిన చర్యలు తీసుకున్నారు. వైద్య సేవల నుంచి మిశ్రాను తొలగించారు. ఇక ఈ వ్యవహారంలో నిర్లక్ష్యం వహించినందుకు సబార్డినేట్లను నియంత్రించడంలో విఫలమైనందుకు అహిర్వార్ను కూడా రాష్ట్ర ఆరోగ్య శాఖ సస్పెండ్ చేసింది. అంతేకాకుండా నివేదిక సమర్పించాలంటూ జిల్లా కలెక్టర్ పార్థ్ జైస్వాల్ ఆదేశాలను కూడా అహిర్వర్ విస్మరించారు. షోకాజ్ నోటీసు జారీ చేసినా స్పందించకపోవడం వేటు పడింది. అంతేకాకుండా ఈ సంఘటనకు సంబంధించి రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ ఉద్యోగి రాజేంద్ర ఖరేను కూడా తొలగించాలని కలెక్టర్ జైస్వాల్ సిఫార్సు చేసినట్లు అధికారి తెలిపారు.
ఇది కూడా చదవండి: Suriya : సూర్య కోసం దుబాయ్ లో మకాం వేసిన వెంకీ అట్లూరి
ఇదిలా ఉంటే వృద్ధుడిని ఈడ్చికెళ్లిన ఘటనలో పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్లు 115(2), 296, 3(5), మరియు 351(3) కింద నౌగావ్ పోలీస్ స్టేషన్లో మిశ్రాపై ‘జీరో ఎఫ్ఐఆర్’ నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. ఎఫ్ఐఆర్ను ఛతర్పూర్లోని కొత్వాలి పోలీస్ స్టేషన్కు బదిలీ చేసినట్లు ఆయన తెలిపారు.
• 75 साल के बुजुर्ग को #छतरपुर जिला अस्पताल के डॉक्टर्स और अस्पताल स्टाफ द्वारा न सिर्फ लात-घूंसे मारे गए, बल्कि बेरहमी से घसीटकर अस्पताल से बाहर फेंक दिया गया!
• पत्नी के इलाज के लिए आए बुजुर्ग का कसूर सिर्फ इतना था कि वे लंबी लाइन में लंबे वक्त तक खड़े नहीं हो पा रहे थे,… pic.twitter.com/VAB1MeMb1s
— Jitendra (Jitu) Patwari (@jitupatwari) April 20, 2025
తాజావార్తలు
-
IPL 2026 Playoffs: ఆర్సీబీ లేదా జీటీకే ఐపీఎల్ 2026 టైటిల్.. ఎస్ఆర్హెచ్, ఆర్ఆర్లకు కష్టమే!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Trisha: విజయ్, అజిత్, సూర్య.. ముగ్గురు స్టార్ హీరోల కెరీర్ బెస్ట్ హిట్స్ ఇచ్చిన ఒకే హీరోయిన్..!
-
Google Chrome Security Warning: క్రోమ్ యూజర్లకు ప్రభుత్వం వార్నింగ్.. మీ బ్యాంక్ ఖాతా ఎప్పుడైనా ఖాళీ కావొచ్చు..!
-
Prabhas: రెండు ఎకరాల్లో ప్రభాస్ అల్ట్రా లగ్జరీ మ్యాన్షన్?
ట్రెండింగ్
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!