Naresh Pal Gangwar: నీట్ పేపర్ లీక్ నిరసనలు.. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం.. కొత్త కార్యదర్శి ఎవరంటే?
- ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిని తొలగించిన కేంద్రం
- కొత్త కార్యదర్శి నరేశ్ పాల్ గంగ్వార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Naresh Pal Gangwar Higher Education Secretary: NEET-UG పరీక్షలో అక్రమాల ఆరోపణలు, పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న వినీత్ జోషిని ఆ పదవి నుంచి తప్పిస్తూ, ఆయన స్థానంలో నరేశ్ పాల్ గంగ్వార్ ను నియమించింది. ఈ మేరకు గురువారం అర్ధరాత్రి కేంద్ర ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఎవరు నరేశ్ పాల్ గంగ్వార్?
నరేశ్ పాల్ గంగ్వార్ 1994 బ్యాచ్కు చెందిన రాజస్థాన్ కేడర్ IAS అధికారి. ఆయన ఇప్పటివరకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక, పాడి పరిశ్రమల మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా విధులు నిర్వహించారు. గతంలో పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో జాయింట్ సెక్రటరీగా కూడా పనిచేశారు. రాజస్థాన్ విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పొందిన గంగ్వార్, కేంద్రంతో పాటు రాజస్థాన్ ప్రభుత్వంలో కూడా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా సేవలందించారు.
Also Read
- Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి రాఖీ కట్టిన మహిళా మంత్రులు.. ‘నన్ను సపరేట్ చేయకండి’ అంటూ కొండా కీలక సురేఖ వ్యాఖ్యలు..!
- Bhatti Vikramarka: ‘హట్టి గోల్డ్ మైన్స్’ సందర్శించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.!
- Lunar Eclipse 2026: ప్రారంభమైన చంద్రగ్రహణం (వీడియో).. సూతక కాలంపై పూర్తి వివరాలు?
- Mood of the Nation: సీఎం అయిన 3 నెలలకే ప్రధాని రేసులోకి తలపతి విజయ్!
వినీత్ జోషికి కొత్త బాధ్యతలు
1992 బ్యాచ్కు చెందిన మణిపూర్ కేడర్ IAS అధికారి వినీత్ జోషిని ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి పదవి నుంచి బదిలీ చేసి, పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శిగా నియమించారు.
NEET వివాదం ఎలా మొదలైంది?
NEET-UG పరీక్షలో పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి. ఈ ఘటనపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) జూన్ 20 నుంచి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసనలు చేపట్టింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, పేపర్ లీక్కు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని CJP ప్రధాన డిమాండ్గా పెట్టుకుంది.
సోనం వాంగ్చుక్ దీక్షతో మరింత ఊపందుకున్న ఉద్యమం
జూన్ 28న ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఈ నిరసనలో పాల్గొని నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. దీంతో ఉద్యమం మరింత ఉధృతమైంది. జూలై 20న CJP ‘చలో పార్లమెంట్’ కార్యక్రమానికి పిలుపునివ్వగా, నిరసనకారులు, ఢిల్లీ పోలీసుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
చర్చలకు సిద్ధమని కేంద్రం
ఈ పరిణామాల అనంతరం కేంద్ర ప్రభుత్వం పలుమార్లు CJP ప్రతినిధులను చర్చలకు ఆహ్వానించింది. అయితే, కేంద్ర మంత్రులే జంతర్ మంతర్ లేదా నిరసన ప్రాంతానికి సమీపంలోని వేదికకు రావాలని CJP స్పష్టం చేసింది. NEET వివాదం, పేపర్ లీక్ కేసులు, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వరుస చర్యలు తీసుకుంటుండగా, రానున్న రోజుల్లో ఈ అంశంపై మరిన్ని కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Odala Revu Fishermens: 23 రోజుల ఉత్కంఠకు తెర.. క్షేమంగా స్వగ్రామానికి చేరుకున్న ఓడలరేవు మత్స్యకారులు!
-
Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్లో ‘రష్మిక మందన్న’
-
Bhogi: ‘భోగి’ రక్షాబంధన్ పోస్టర్ బ్లాస్ట్.. అదిరిపోయిన శర్వానంద్ లుక్
ట్రెండింగ్
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!
-
5 స్టార్ డ్రాప్ రెసిస్టన్స్ తో వాటర్, డస్ట్కు ఫుల్ ప్రొటెక్షన్.. 7,200mAh బ్యాటరీతో Vivo Y31t 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
8,340mAh బ్యాటరీ, 300% ఆడియో బూస్ట్, IP69K రేటింగ్ తో REDMI Note 17 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?