Operation Sindoor: ఆపరేషన్ సిందూర్తో పాక్లో 9 విమానాలు ధ్వంసం! ఆధారాలివే!
- ఆపరేషన్ సిందూర్తో పాక్లో 9 విమానాలు ధ్వంసం!
- ఉపగ్రహ చిత్రాల ద్వారా దృశ్యాలు వెలుగులోకి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా మే 7న భారత్.. పాకిస్థాన్పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఆపరేషన్లో 100 మంది ఉగ్రవాదులు హతం కాగా.. పాకిస్థాన్ వైమానిక స్థావరాలు నాశనం అయ్యాయి. తాజాగా పాకిస్థాన్కు చెందిన 9 విమానాలు ధ్వంసం అయినట్లుగా సమాచారం అందుతోంది. వైమానిక స్థావరాలతో పాటు సైనిక ఆస్తులకు భారీగా నష్టం వాటిల్లినట్లు వర్గాలు పేర్కొంటున్నాయి.
ఇది కూడా చదవండి: Spying: జ్యోతి మల్హోత్రాతో సంబంధం ఉన్న మరో యూట్యూబర్ అరెస్ట్
Also Read
పాకిస్థాన్ వైమానికి దళానికి చెందిన ఆరు యుద్ధ విమానాలు, రెండు ఖరీదైన నిఘా విమానాలు, పదికి పైగా సాయుధ డ్రోన్లు, ఒక సీ -130 పెర్క్యులస్ రవాణా విమానం ధ్వంసం అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
నాలుగు రోజుల పాటు సాగిన ఆపరేషన్ సిందూర్లో అధిక విలువ కలిగిన రెండు ఎయిర్బోర్న్ విమానాలు నాశనం అయినట్లు సమాచారం. ఇక పాకిస్థాన్ భోలారి వైమానిక స్థావరంలో ఉంచిన స్వీడిష్ మూలానికి చెందిన మరో ఏఈడబ్లయూసీ విమానం.. ఉపరితల క్రూయిజ్ క్షిపణి దాడిలో ధ్వంసమైందని తెలుస్తోంది. ఇది పూర్తిగా ధ్వంసమైనట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా అర్థమవుతోంది.
ఇది కూడా చదవండి: Good Wife : ఏకంగా ఏడు భాషల్లో ప్రియమణి ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్..
ఇక పాకిస్థాన్ పంజాబ్పై లక్ష్యంగా చేసుకున్న డ్రోన్ దాడిలో పీఏఎఫ్ సీ-130 హెర్క్యులస్ విమానం ధ్వంసమైనట్లు ప్రత్యేక ఆపరేషన్లో తేలింది. ఈ C-130 విమానం లాజిస్టికల్ సపోర్ట్ కోసం ఉపయోగించబడుతుంది. డ్రోన్ దాడి జరిగినప్పుడు ముల్తాన్ సమీపంలోని ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ దగ్గర నిలిపి ఉంచారని వర్గాలు తెలిపాయి.
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాలు నిలిపేసింది. వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దు నిలిపేసింది. ఇక మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదలు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు ఘోరంగా దెబ్బతిన్నాయి. దీంతో దాయాది దేశం కాళ్ల బేరానికి రావడంతో భారత్ కాల్పుల విరమణకు అంగీకరించింది.
తాజావార్తలు
-
Polavaram-Tiger: పోలవరం జిల్లాలో మళ్లీ పెద్దపులి సంచారం.. భయం గుప్పెట్లో హడలెత్తిపోతున్న జనాలు!
-
Pakistan: పాకిస్థాన్ డబుల్ గేమ్.. మధ్యవర్తిత్వం పేరుతో ట్రంప్ను ఇలా మోసం చేశారేంట్రా బాబు!
-
Ravi Teja : ‘ఇరుముడి’ తర్వాత రవితేజ డబుల్ ట్రీట్..
-
Shreyas Iyer: పొరపాట్లు చేశా, సరైన ప్లానింగ్ లేదు.. ఓటమిని నిజాయితీగా ఒప్పుకున్న శ్రేయస్ అయ్యర్!
-
NTRNEEL : నందమూరి ఫ్యాన్స్కు మిడ్ నైట్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్
ట్రెండింగ్
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!
-
PM Modi: ఆడంబరాలు వద్దు.. పొదుపు ముద్దు.! దేశాభివృద్ధి కోసం ప్రధాని 10 కీలక సూచనలు..
-
Kathmandu: రన్వేపై మంటల్లో చిక్కుకున్న విమానం.. 278 మంది ప్రయాణికులు.?