Kerala: బీజేపీ కార్యకర్త హత్య కేసులో దోషులుగా 9 మంది సీపీఎం నేతలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kerala: 2005లో కేరళలో జరిగిన బీజేపీ కార్యకర్త ఎలాంబిలాయి సూరజ్ హత్య కేసులో 9 మంది సీపీఎం కార్యకర్తలను కోర్టు దోషులుగా తేల్చింది. దోషుల్లో సీఎం పినరయి విజయన్ ప్రెస్ సెక్రటరీ సోదరుడు కూడా ఉన్నాడు. శుక్రవారం వీరిందరిని కోర్టు దోషులుగా నిర్ధారించింది. దోషులుగా తేలిని వారిలో టీకే రజీష్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ఇతను 2012లో జరిగిన టిపీ చంద్రశేఖరన్ హత్య కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. మరో దోషి పీఎం మనోరాజ్, ఇతను సీఎం పినరయి విజయన్ సెక్రటరీ పీఎం మనోజ్ సోదరుడు.
Read Also: World Happiness Countries: ఎనిమిదోసారి టాప్ ప్లేస్ లో ఫిన్లాండ్.. మరి భారత్ ఎన్నో స్థానంలో ఉందంటే
Also Read
- Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. "డీలిమిటేషన్ బిల్లు" పై ఫోకస్..
- Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
- DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
- Tamil Nadu: ఇక విజయ్-ఉదయనిధి-అన్నామలై చుట్టే తమిళ రాజకీయాలు..
తలస్సేరి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు జడ్జి కేటీ నిసార్ అహ్మద్ శుక్రవారం తీర్పు వెలువరించారు. మార్చి 24న శిక్షలు ఖరారు చేయనున్నారు. సీపీఎంను వీడి బీజేపీలో చేరిన తర్వాత, రాజకీయ శత్రుత్వం కారణంగా సూరజ్పై దాడి చేసినట్లు ప్రాసిక్యూషన్ వాదించింది. కేసు వివరాల ప్రకారం.. ఆగస్టు 07, 2005న ఉదయం 8.40 గంటల ప్రాంతంలో, ముజప్పిలంగాడ్ టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ సమీపంలో ఆటోరిక్షాలో వచ్చిన దుండగులు సూరజ్ను నరికి చంపారు.
మొత్తం 12 మంది నిందితుల్లో ఒకరు నిర్దోషిగా విడుదల కాగా, మరో ఇద్దరు విచారణ సమయంలో మరణించారు. రాజకీయ హింసా చరిత్ర కలిగిన కేరళలో ఈ కేసు రాజకీయ వివాదానికి కారణమైంది. తీర్పు వెలువడిన తర్వాత కన్నూర్ జిల్లాలో ఉద్రిక్తత నెలకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, ఈ ఏడాది జనవరిలో కేరళ సెషన్స్ కోర్టు 2021లో జరిగి బీజేపీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసులో 15 మంది నిందితులకు మరణశిక్ష విధించింది. ఈ 15 మందినికి నిషేధిత పాపులర్ ఫ్రండ్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ)తో సంబంధాలు ఉన్నాయి. బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ని డిసెంబర్ 19, 2021న తన ఇంట్లో తన కుటుంబం ముందే దారుణంగా దాడి చేసి చంపారు.
తాజావార్తలు
-
Delimitation Bill: బీజేపీకి ఇదే మంచి సమయం.. టీఎంసీ సంక్షోభం, డీఎంకే అసంతృప్తి.. “డీలిమిటేషన్ బిల్లు” పై ఫోకస్..
-
CM Revanth Reddy : పాలమూరుకు జలకళ.. పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తాం
-
RCB Player: ‘ఐపీఎల్లో ఒక్క ఛాన్స్ రాలేదు.. అదంతా కోహ్లీ వల్లనే’.. ఆర్సీబీ ప్లేయర్ ఎమోషనల్..
-
Nagpur: ప్రియురాలి కోసం మైనర్ ఎంతకు తెగించాడు.. అర్ధరాత్రి గిడ్డంగికెళ్లి ఏం చేశాడంటే..!
-
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి జ్వాలలు.. కర్ణాటక కాంగ్రెస్లో లుకలుకలు..
ట్రెండింగ్
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!