IND vs NZ Final: ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్పై రూ. 5,000 కోట్ల బెట్టింగ్స్.. ఐదుగురు బుకీలు అరెస్టు
- ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్పై రూ. 5,000 కోట్ల బెట్టింగ్స్
- ఐదుగురు బుకీలను అరెస్టు
- బుకీలు అండర్ వరల్డ్తో సంబంధాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మార్చి 9న భారత్-కివీస్ మధ్య ఫైనల్ పోరు జరుగనున్నది. టైటిలే లక్ష్యంగా ఇరు జట్లు బరిలోకి దిగనున్నాయి. ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ వేళ జోరుగా బెట్టింగ్ జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఆదివారం దుబాయ్లో జరగనున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్పై రూ. 5,000 కోట్ల బెట్టింగ్స్ జరిగాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐదుగురు బుకీలను అరెస్టు చేశారు.
Also Read:Raghunandan Rao: అక్కడ చర్చ చేద్దాం రండి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రఘునందన్రావు సవాల్
Also Read
- Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
- Monsoon Shock: 125 ఏళ్ల తర్వాత ముఖం చాటేసిన వరుణుడు.. ఐదో అత్యంత పొడి జూన్గా రికార్డ్
- SC ST Atrocities Act: బాంబే హైకోర్టు సంచలన తీర్పు.. ఇస్లాంలోకి మారితే SC/ST ఎట్రాసిటీ యాక్ట్ వర్తించదు!
- Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
అంతర్జాతీయ బుకీలకు భారత జట్టు ఫేవరెట్ అని బెట్టింగ్ ముఠాలను ట్రాక్ చేస్తున్న వర్గాలు తెలిపాయి. చాలా మంది బుకీలు అండర్ వరల్డ్తో సంబంధాలు కలిగి ఉన్నారని, ప్రతి పెద్ద మ్యాచ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద బుకీలు దుబాయ్లో కలుస్తారని తెలిపారు. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ముఠా ‘డి కంపెనీ’ దుబాయ్లో పెద్ద క్రికెట్ మ్యాచ్లపై బెట్టింగ్లో పాల్గొంటుందని అధికార వర్గాలు తెలిపాయి.
Also Read:Rahul Gandhi: “రాహుల్ గాంధీనే మాకు పెద్ద ఆస్తి”.. గుజరాత్ వ్యాఖ్యలపై బీజేపీ సెటైర్లు..
ఇటీవల జరిగిన ఇండియా-ఆస్ట్రేలియా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ మ్యాచ్పై బెట్టింగ్కు పాల్పడినందుకు పర్వీన్ కొచ్చర్, సంజయ్ కుమార్ అనే ఇద్దరు బుకీలను అరెస్టు చేశారు. ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను ఉపయోగించి లైవ్ పందాలు కాస్తుండగా ఇద్దరు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. బెట్టింగ్లో ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాలు, వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Also Read:Indian Railways: ఇకపై కన్ఫామైన టికెట్ ఉంటేనే ప్లాట్ఫామ్ పైకి అనుమతి.. రైల్వే కీలక నిర్ణయం.
పర్వీన్ కొచ్చర్ లక్కీ.కామ్ అనే బెట్టింగ్ వెబ్సైట్ నుండి మాస్టర్ ఐడిని కొనుగోలు చేసి, దానితో బెట్టింగ్ ఐడీలను సృష్టించి, వాటిని పంటర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి లావాదేవీపై సిండికేట్ 3 శాతం కమీషన్ వసూలు చేసినట్లు అధికారులు తెలిపారు. పర్వీన్ కొచ్చర్ ప్రతి మ్యాచ్ లో రూ. 40 వేల లాభం పొందినట్లు విచారణలో చెప్పాడని అధికారులు వెల్లడించారు. ఈ మొత్తం నెట్వర్క్ దుబాయ్ కేంద్రంగా జరుగుతున్నట్లు గుర్తించారు. ఢిల్లీలో అరెస్టయిన ఐదుగురిలో ముగ్గురు మనీష్ సహాని, యోగేష్ కుకేజా, సూరజ్, దుబాయ్తో సంబంధాలు కలిగి ఉన్నారు. వారి నుంచి పోలీసులు రూ.22 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Alpha Movie Remunerations: హీరోల రేంజ్లో ఆలియా రెమ్యూనరేషన్.. అక్షరాల ఎన్ని కోట్లో తెలుసా?
-
TG Cabinet Meeting : జూలై 2న తెలంగాణ కేబినెట్ కీలక సమావేశం.!
-
Mumbai: ముంబైలో ఘోరం.. స్కూల్ వ్యాన్పై కూలిన భారీ వృక్షం.. 11 ఏళ్ల విద్యార్థి మృతి
-
Kitchen Tips: ఫ్రిజ్ శబ్దం పెరిగిందా.? టెక్నీషియన్ను పిలవకుండా ఇంట్లోనే ఇలా చేయండి.!
-
రూ.6,650 కోట్లతో రాబోతున్న OYO ఐపీఓ.. కానీ ఆ డబ్బంతా దేనికి వాడుతున్నారో తెలిస్తే షాకవుతారు!
ట్రెండింగ్
-
Income Tax Returns: ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు అలెర్ట్.. జూలైలో మిస్ కాకూడని ముఖ్యమైన డెడ్లైన్లు ఇవే.!
-
Spider Control : వర్షాకాలంలో సాలీళ్ల బెడదా.? ఈ సహజమైన స్ప్రేలతో చెక్ పెట్టండి.!
-
Weight Loss Dosa : నూనె తక్కువ, ప్రోటీన్ ఎక్కువ..! ఆరోగ్యకరమైన మసూర్ బెలే దోస రెసిపీ
-
Black Jamun: నేరేడు పండు.. చిన్న పండులో బోలెడు ఆరోగ్య రహస్యాలు.. పోషకాలు మెండు కూడా.!
-
Jai Moondra: వాడు మనోడు కాదు.. పగోడు.. మొత్తం పరువు తీసేశాడుగా!