Indian Railways: ఇకపై కన్ఫామైన టికెట్ ఉంటేనే ప్లాట్ఫామ్ పైకి అనుమతి.. రైల్వే కీలక నిర్ణయం.
- ఇకపై కన్ఫామ్ టికెట్ ఉంటేనే ప్లాట్ఫామ్ పైకి ప్రయాణికులు..
- రద్దీని తగ్గించేందుకు రైల్వే కీలక నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Railways: రైల్వే స్టేషన్లలో రద్దీని నియంత్రించేందుకు భారత రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కన్ఫామ్ టికెట్ ఉన్న ప్రయాణికులను మాత్రమే ప్లాట్ఫామ్పైకి అనుమతించనున్నారు. దేశంలో అతిపెద్దవైన 60 రైల్వే స్టేషన్లలో ఈ విధానాన్ని అమలు చేయనున్నారు. స్టేషన్లలో రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికుల భద్రతను నిర్ధారించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ, ముంబై, కోల్కతా వంటి ముఖ్యమైన స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి.
Read Also: Hizbul Mujahideen: హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాది అరెస్ట్.. యూపీలో దాడులకు కుట్ర..
Also Read
- Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
భారత రైల్వే పండగలు, సెలవుల సమయంలో రద్దీని ఎదుర్కొంటున్నాయి. చాలా మంది తమ బంధువుల్ని దింపడానికి, లేదా వారిని తీసుకెళ్లేందుకు రైల్వే స్టేషన్లకు వస్తుంటారు. ఇది రద్దీకి దారి తీస్తోంది. కొత్త నిబంధనల వల్ల ఇలాంటి వారిని స్టేషన్లోకి అనుమతించరు. దేశంలోని 60 అతిపెద్ద రైల్వే స్టేషన్లలో ఈ నిబంధనల్ని అమలు చేస్తారు. ఈ జాబితాలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్, ఛత్రపతి శివాజీ టెర్మినస్-ముంబై, హౌరా జంక్షన్, చెన్నై సెంట్రల్, బెంగళూర్ సిటీ రైల్వే స్టేషన్ ఉన్నాయి. జన రద్దీ నియంత్రణ అవసరాలను బట్టి అదనపు స్టేషన్ల జాబితాను చేర్చనున్నారు.
ప్రయాణికులు ముందస్తు బుకింగ్ టికెట్ బుకింగ్ చేసుకోవాలని, వారు రైల్వే స్టేషన్కి వచ్చిన సమయంలో టికెట్ కన్ఫామ్ అయినట్లు నిర్ధారించుకోవాలి. ఈ కొత్త విధానం ప్లాట్ఫామ్లపై రద్దీని తగ్గించాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రైల్వే ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించిన తర్వాత ఈ నిర్ణయం తీసకున్నారు. ఎంపిక చేసిన స్టేషన్ పరిసరాల్లో కెమెరాలను ఏర్పాటు చేయనున్నారు. పెద్ద రైల్వే స్టేషన్లలో వార్ రూమ్లను ఏర్పాటు చేయనున్నారు. రద్దీగా ఉన్న సమయంలో అధికారుల మధ్య సమన్వయానికి ఇది ఉపయోగపడుతుంది. సర్వీస్ స్టాఫ్ని సులభంగా గుర్తించేందుకు కొత్త యూనిఫాంను జారీ చేయనున్నారు.
తాజావార్తలు
-
CM Chandrababu: తీవ్ర తాగునీటి సంక్షోభం.. వచ్చే ఏడాది నుంచి శాశ్వత పరిష్కారం.!
-
Central Government Schemes: రైతులకు 3 అద్భుత కేంద్ర పథకాలు.. ఏటా రూ.6,000.. నెలకు రూ.3,000 పెన్షన్..!
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
ట్రెండింగ్
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!