Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం 8 గంటల విచారణ తర్వాత సీబీఐ అధికారులు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఈ రోజు ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు. తాజాగా 5 రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గతేడాది ఆగస్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెరపైకి వచ్చింది. ఇందులో ఏ-1గా మనీష్ సిసోడియాను పేర్కొంది సీబీఐ. గత ఆదివారమే ఆయన్ను విచారణకు రమ్మని కోరగా..బడ్జెట్ తయారీలో బీజీగా ఉన్నానని సమయంలో కోరడంతో నిన్న ఆదివారం విచారణకు హాజరుకావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది. విచారణకు వెళ్లే కొన్ని గంటల ముందు, సిసోడియా తనకు జైలుకు వెళ్లడం అంటే భయం లేదని, భగత్ సింగ్ అనుచరుడిని అంటూ పరోక్షంగా అరెస్ట్ పై సంకేతాలు ఇచ్చారు.
Also Read
- BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
- Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
- Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
- Rajasthan ATS: జైష్ స్లీపర్ సెల్ అనుమానిత మహిళ అరెస్టు.. ఆన్లైన్లో పాకిస్తానీ ఉగ్రవాదిని వివాహం చేసుకున్నట్లు వెల్లడి
Read Also: Ranbir Kapoor: రణబీర్ కపూర్ అందులో ఉన్నట్టా? లేనట్టా?
ఈ కేసులో డిజిటల్ డివైస్ లను నుంచి డిలీట్ చేసిన పలు ఫైళ్లు సిసోడియా అరెస్ట్ కు కారణం అయినట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ మధ్యం కేసు తర్వాత సిసోడియా 18 మొబైళ్లను, 4 సిమ్ కార్డులను ఛేంజ్ చేసినట్లు సీబీఐ తెలిపింది. గతేడాది గోవా ఎన్నికల సమయంలో ఈ స్కామ్ లో వచ్చిన డబ్బు రూ.100 కోట్లను ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉపయోగించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుతో తెలుగు రాష్ట్రాలకు కూడా లింకులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే సిసోడియాను అరెస్ట్ చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేస్తూ.. ప్రతిపక్షాలను అణిచివేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది సీబీఐ అధికారులు మనీష్ సిసోడియా అరెస్టును వ్యతిరేకించినట్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క కాంగ్రెస్, సీపీఎం మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు సిసోడియా అరెస్ట్ ను తప్పుపట్టాయి. ఈ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాస్టర్ మైండ్ అని ఆయనను అరెస్ట్ చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం డిమాండ్ చేసింది. సిసోడియా అరెస్టును సమర్థించింది.
తాజావార్తలు
-
BSNL మాస్టర్ స్ట్రోక్.! అన్లిమిటెడ్ కాలింగ్, డేటా మాత్రమే కాదు.. OTT సబ్స్క్రిప్షన్స్ కూడా..
-
Oscars Academy :’RRR’ ఎడిటర్కు ఆస్కార్ గౌరవం.. ఇక విజేతలను ఎంపిక చేసే హక్కు కూడా!
-
Amazon Zoox: స్టీరింగ్ లేదు.. డ్రైవర్ లేడు.. అమెజాన్ కొత్త రోబోట్యాక్సీ.. పెయిడ్ రైడ్స్కు రంగం సిద్ధం
-
Animal Ambulance: జంతువుల ప్రాణాలు కాపాడేందుకు తొలి EV బైక్ అంబులెన్స్ షురూ.!
-
Divija Prabhakar: ఎంతో కస్టపడి సినిమా చేశాం.. ‘వెంకట్రామయ్య గారి తాలూకా’ అందరికీ నచ్చుతుంది!
ట్రెండింగ్
-
Viral Video: ఎవరయ్యా ఈయన.. మద్యం మత్తులో 11KV విద్యుత్ స్తంభం ఎక్కి తీగలపై పడుకున్నాడు.!
-
Iron Box Cleaning : ఐరన్ బాక్స్ కింద మరకలా..? 5 నిమిషాల్లో కొత్తదానిలా..!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో భారత్లో లాంచ్ అయిన OnePlus Nord Buds 4.. ధర ఎంతంటే.?
-
Benefits of Hugging: భార్యాభర్తలు కౌగిలించుకుని నిద్రపోతే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే.!
-
Jamun Juice: యాంటీఆక్సిడెంట్ల పవర్హౌస్.. ‘నేరేడుపండు జ్యూస్’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!