Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాకు 5 రోజుల సీబీఐ కస్టడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manish Sisodia: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం 8 గంటల విచారణ తర్వాత సీబీఐ అధికారులు ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియాను అరెస్ట్ చేశారు. ఈ రోజు ఢిల్లీలోని రోస్ ఎవెన్యూ కోర్టు ముందు హాజరుపరిచారు. ఐదు రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు. తాజాగా 5 రోజుల పాటు సీబీఐ కస్టడీకి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
గతేడాది ఆగస్టులో ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెరపైకి వచ్చింది. ఇందులో ఏ-1గా మనీష్ సిసోడియాను పేర్కొంది సీబీఐ. గత ఆదివారమే ఆయన్ను విచారణకు రమ్మని కోరగా..బడ్జెట్ తయారీలో బీజీగా ఉన్నానని సమయంలో కోరడంతో నిన్న ఆదివారం విచారణకు హాజరుకావాలని సీబీఐ సమన్లు జారీ చేసింది. విచారణకు వెళ్లే కొన్ని గంటల ముందు, సిసోడియా తనకు జైలుకు వెళ్లడం అంటే భయం లేదని, భగత్ సింగ్ అనుచరుడిని అంటూ పరోక్షంగా అరెస్ట్ పై సంకేతాలు ఇచ్చారు.
Also Read
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
- Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
- NEET paper leak: నీట్ పేపర్ లీక్పై కేంద్రం సీరియస్.. ఎన్టీఏలో భారీ ప్రక్షాళన..
Read Also: Ranbir Kapoor: రణబీర్ కపూర్ అందులో ఉన్నట్టా? లేనట్టా?
ఈ కేసులో డిజిటల్ డివైస్ లను నుంచి డిలీట్ చేసిన పలు ఫైళ్లు సిసోడియా అరెస్ట్ కు కారణం అయినట్లు సీబీఐ వర్గాలు పేర్కొంటున్నాయి. ఢిల్లీ మధ్యం కేసు తర్వాత సిసోడియా 18 మొబైళ్లను, 4 సిమ్ కార్డులను ఛేంజ్ చేసినట్లు సీబీఐ తెలిపింది. గతేడాది గోవా ఎన్నికల సమయంలో ఈ స్కామ్ లో వచ్చిన డబ్బు రూ.100 కోట్లను ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఉపయోగించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుతో తెలుగు రాష్ట్రాలకు కూడా లింకులు ఉన్నాయి.
ఇదిలా ఉంటే సిసోడియాను అరెస్ట్ చేయడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ, కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీలను దుర్వినియోగం చేస్తూ.. ప్రతిపక్షాలను అణిచివేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది సీబీఐ అధికారులు మనీష్ సిసోడియా అరెస్టును వ్యతిరేకించినట్లుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క కాంగ్రెస్, సీపీఎం మినహా అన్ని ప్రతిపక్ష పార్టీలు సిసోడియా అరెస్ట్ ను తప్పుపట్టాయి. ఈ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ మాస్టర్ మైండ్ అని ఆయనను అరెస్ట్ చేయాలని ఢిల్లీ కాంగ్రెస్ విభాగం డిమాండ్ చేసింది. సిసోడియా అరెస్టును సమర్థించింది.
తాజావార్తలు
-
PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
-
Shani Parivartan 2026: మే 17న శని నక్షత్ర మార్పు.. ఈ 4 రాశుల వారికి అదృష్ట యోగం
-
Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
-
Bandi Bhagirath : పోలీసుల ఎదుట లొంగిపోయిన బండి భగీరథ్.!
-
Silver: బంగారం తర్వాత ఇప్పుడు వెండి.. కేంద్రం కీలక నిర్ణయంతో పెరగనున్న ధరలు..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..