ASER report: ఇంగ్లీష్ రావట్లేదు, లెక్కలు చేయలేకపోతున్నారు.. గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థుల పరిస్థితి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ASER report: గ్రామీణ భారతదేశంలో విద్యార్థుల చదువులు అంతంత మాత్రంగా ఉన్నట్లు ASER 2023 ‘బియాండ్ బేసిక్స్’ సర్వేలో వెల్లడైంది. గ్రామీణ ప్రాంతాల్లో 14-18 ఏళ్ల మధ్య ఉన్న పిల్లలు సులభమైన సాధారణ ఇంగ్లీష్ వ్యాఖ్యలను కూడా చదవలేకపోతున్నారని తేలింది. దీంతో పాటు లెక్కలు చేయడంలో కూడా విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటున్నారని వార్షిక విద్యా స్థితి నివేదిక ప్రకారం ( ASER) 2023 బుధవారం వెల్లడించింది. ప్రభుత్వాలు తన విధానాలను రూపొందించేందుకు ASER నివేదికలను ఉపయోగించుకుంటాయి.
Read Also: RBI Governor : ప్రపంచానికి భారత్ పై పెరిగిన విశ్వాసం.. వృద్ధి రేటు 7 శాతానికి మించి ఉంటుందని అంచనా
Also Read
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
- Bangladesh: భారత్, పాకిస్థాన్ను దాటేసిన బంగ్లాదేశ్.. ఏ విషయంలోనో తెలుసా?
- Pakistan: పాకిస్తాన్ మరోసారి.. భారత విమానాలపై గగనతల ఆంక్షలు పొడగింపు..
26 రాష్ట్రాల్లోని 28 జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. మొత్తం 34,745 మంది పాల్గొన్నారు. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు మినహా అన్ని రాష్ట్రాల్లో ఒక గ్రామీణ జిల్లాలో సర్వే చేశారు. ఈ రెండు రాష్ట్రాల్లో మాత్రం రెండు జిల్లాల చొప్పున సర్వే చేశారు. ప్రథమ్ ఫౌండేషన్ ప్రచురించిన వార్షిక నివేదికలో 14-18 ఏళ్ల మధ్య ఉన్న విద్యార్థుల్లో సగం మంది మ్యాథమెటిక్స్ డివిజన్ ప్రాబ్లమ్స్ చేయలేకపోతున్నారు. 25 శాతం మంది తమ మాతృభాషలో క్లాస్ 2 స్థాయి పాఠ్యాంశాలనను స్పష్టంగా చదవలేకపోతున్నారు. డివిజన్ ప్రాబ్లమ్స్( 3 అంకెల సంఖ్యను ఒక అంకె సంఖ్యతో భాగించడం) చేయడానికి కష్టపడుతున్నారు. నిజానికి 3-4 తరగతుల స్థాయి పిల్లలు ఇలాంటి లెక్కల్ని చేయాలి.
ఇక ఇంగ్లీష్ విషయానికి వస్తే 57.3 శాతం విద్యార్థులు ఇంగ్లీష్ చదవగలుగుతున్నప్పటికీ.. దీనిలో మూడో వంతు పిల్లలు మాత్రమే వాటి అర్థాలను చెప్పగలుగుతున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రాంతీయ భాషల్లో క్లాస్-2 లెవల్ వ్యాఖ్యాలను చదవడంలో మగ పిల్లలతో(70.9) పోలిస్తే, ఆడ పిల్లలు(76 శాతం) మెరుగ్గా ఉన్నారు. ఇక అంకగణితం, ఇంగ్లీష్లో బాలికల కన్నా బాలురు మెరుగ్గా ఉన్నారు.
తాజావార్తలు
-
OTR : వైసీపీ నేతలతో టచ్.. టీడీపీ ఎమ్మెల్యేతో మ్యాచ్? కాకినాడలో హాట్ టాపిక్
-
Story Board : ఇరాన్ యుద్ధం గల్ఫ్ కు చేసిన నష్టమేంటి..? దుబాయ్ గతానికి, ప్రస్తుతానికి తేడా ఏంటి..?
-
Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
-
Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
-
Ex-Girlfriend Murder: నీకు కాబోయే భార్యను చంపేశా.. వరుడికి మాజీ ప్రియుడి షాకింగ్ కాల్..
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!