Two Trains: ఒకే ట్రాక్పై ఎదురెదురుగా వచ్చిన ట్రైన్లు.. తృటిలో తప్పిన ప్రమాదం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశా రాజధాని భువనేశ్వర్లో గురువారం భారీ రైలు ప్రమాదం తృటిలో తప్పింది. సిగ్నలింగ్ లోపమో లేదా మానవ తప్పిదమో తెలియదు కానీ, ఒకే రైల్వే ట్రాక్పైకి రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చాయి. భువనేశ్వర్లోని జార్పాడా వంతెన సమీపంలో జూన్ 11న జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. లోకో పైలట్లు, రైల్వే సిబ్బంది సమయస్ఫూర్తితో అప్రమత్తం కావడంతో ఒకే లైన్పై వస్తున్న ఆ రెండు రైళ్లు కొద్దిపాటి దూరంలోనే ఆగిపోయాయి. క్షణం ఆలస్యమైనా ఊహించని రీతిలో భారీ విపత్తు సంభవించి ఉండేదని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు.
ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ముప్పు..
సాధారణంగా ఒకే ట్రాక్పైకి రెండు రైళ్లు రావడం అనేది అత్యంత ప్రమాదకరమైన విషయం. అయితే, ఈ ఘటనలో ఒక పెద్ద ఊరట లభించింది. ఎదురెదురుగా వచ్చిన ఆ రెండు రైళ్లు ప్రయాణికులతో వెళ్తున్నవి కావు. అవి కేవలం ఖాళీ బోగీలతో ప్రయాణిస్తున్న ‘ఎంప్టీ ట్రైన్ రేక్స్’ . ఒకవేళ అవి గనుక ప్యాసింజర్ లేదా ఎక్స్ప్రెస్ రైళ్లు అయి ఉంటే, ఈ పాటికి వందలాది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవి. రెండు రైళ్లలోనూ ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఎవరికీ గాయాలు కాకుండానే ఈ గండం గడిచిపోయింది.
Also Read
- Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ 'నో ఛాన్స్'.!
- Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
- US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
- Ishan Kishan: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో పేలిన పాకెట్ డైనమెట్.. నెం.1 బ్యాటర్గా ఇషాన్ కిషన్.!
భయాందోళనలో స్థానికులు..
రెండు రైళ్లు ఎదురెదురుగా నిలిచి ఉండటాన్ని గమనించిన పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఒకే ట్రాక్పై రెండు రైళ్లు ఎలా వస్తాయంటూ రైల్వే నిర్వహణ తీరుపై మండిపడ్డారు. ఈ సమాచారం అందిన వెంటనే ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
ఈ అసాధారణ ఘటన కారణంగా ఆ మార్గంలో సాధారణ రైలు రాకపోకలకు పెద్దగా అంతరాయం కలగలేదని తూర్పు తీర రైల్వే అధికారులు స్పష్టం చేశారు. అయితే, అసలు ఈ పొరపాటు ఎక్కడ జరిగింది? స్టేషన్ మాస్టర్ల మధ్య కమ్యూనికేషన్ లోపమా? లేక సిగ్నలింగ్ వ్యవస్థ వైఫల్యమా? అనే కోణంలో ఉన్నత స్థాయి దర్యాప్తునకు అధికారులు ఆదేశించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఏది ఏమైనప్పటికీ, ఒక పెద్ద ప్రమాదం తప్పడంతో అటు రైల్వే అధికారులు, ఇటు ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడికి మళ్లీ నిరాశే.. ఇంగ్లండ్తో తొలి టీ20లోనూ ‘నో ఛాన్స్’.!
-
ENG vs IND 1st T20: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్! ప్లేయింగ్ XI లో ఎవరెవరంటే?
-
Kayadu Lohar: అందుకే హిట్లున్నా లేకున్నా వరుస ఆఫర్లు!
-
Pawan Kalyan: సోషల్ మీడియా దుర్వినియోగంపై ఉక్కుపాదం మోపుతాం.. ‘ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్’ పేరుతో దూషణలు ఇక కుదరవు.!
-
US: అమెరికాలో విషాదం.. ఆకస్మిక వరదల్లో ఏపీ యువకుడు మృతి
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?
-
అందుబాటులోకి Aadhaar App కొత్త వెర్షన్..ఫేస్ ఆథెంటికేషన్, మొబైల్ నంబర్ అప్డేట్లతో పాటు మరిన్ని సేవలు.!