RBI Governor : ప్రపంచానికి భారత్ పై పెరిగిన విశ్వాసం.. వృద్ధి రేటు 7 శాతానికి మించి ఉంటుందని అంచనా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RBI Governor : భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతోంది. దీని ప్రభావం వల్ల భారత్పై ప్రపంచానికి నమ్మకం పెరుగుతోంది. తాజాగా దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఈ సమావేశంలో, శక్తికాంత దాస్ భారతదేశ ఆర్థిక వృద్ధి గురించి చాలా మాట్లాడారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధి చెందుతుందని దాస్ చెప్పారు. అయితే ఎన్ఎస్ఓ దానిని మరింత పెంచింది. భారతదేశ వృద్ధి రేటు 7 శాతానికి మించి ఉంటుందని ఎన్ఎస్ఓ అంచనా వేసింది. అంతేకాకుండా, ద్రవ్యోల్బణం మితంగానే కొనసాగుతుందని అంచనా.
Read Also:IND vs AFG: విరాట్ కోహ్లీ కెరీర్లో ఇదే తొలిసారి.. స్టేడియం మొత్తం గప్చుప్!
Also Read
- Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
- Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
భారతదేశంపై అంతర్జాతీయ విశ్వాసం ఆల్ టైమ్ హైలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ వృద్ధి అంచనా 7 శాతంగా ఉంది. NSO (నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్) 7.3శాతం తెలిపిందని శక్తికాంతదాస్ పేర్కొన్నారు. ఇటీవలి సంవత్సరాలలో ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక సంస్కరణలు భారత ఆర్థిక వ్యవస్థ మధ్యస్థ, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పెంచాయని దాస్ చెప్పారు. సవాలుగా ఉన్న ప్రపంచ స్థూల ఆర్థిక వాతావరణం మధ్య, భారతదేశం వృద్ధి, స్థిరత్వానికి ఉదాహరణగా నిలుస్తోంది. ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సమావేశంలో ‘హై గ్రోత్, లో రిస్క్ ఇండియా స్టోరీ’ అనే అంశంపై నిర్వహించిన సీఐఐ సెషన్లో ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ ఆర్థిక రంగంలో ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టిందన్నారు.
Read Also:Mahesh Babu: అయిదు సెంచరీలు కొట్టిన ఏకైక సౌత్ హీరో…
ఎలాంటి ఆటంకాలు లేకుండా పురోగమించే అవకాశం ఉందని, మార్కెట్లు సానుకూలంగా స్పందించాయని శక్తికాంతదాస్ తెలిపారు. అయినప్పటికీ, అంతర్జాతీయ ప్రమాదాలు, వాతావరణ ప్రమాదాలు మిగిలి ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జిడిపి వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఆర్బిఐ గవర్నర్ తెలిపారు. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుందని ఆయన అన్నారు. ఇటీవలి గ్లోబల్ షాక్ల నుండి బయటపడ్డాము. బలమైన విదేశీ మారక ద్రవ్య నిల్వలతో బాహ్య సంతులనాన్ని సులభంగా నిర్వహించవచ్చని దాస్ అన్నారు. 2022 వేసవి కాలం నుంచి ప్రధాన ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందని ఆయన చెప్పారు. 2024-25లో భారత ఆర్థిక వ్యవస్థ ఏడు శాతం వృద్ధి చెందుతుందని ఆశిస్తున్నామని ఆయన చెప్పారు. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని రెండు శాతం తేడాతో నాలుగు శాతం వద్ద ఉంచే బాధ్యతను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ప్రభుత్వం అప్పగించింది.
తాజావార్తలు
-
Dharmendra Pradhan: నీట్పై చర్చకు సిద్ధం.. విద్యార్థుల పేరుతో రాజకీయాలు వద్దు రాహుల్..
-
CKYC: బ్యాంకు కస్టమర్స్ కు అలర్ట్.. మీ CKYC నంబర్ తెలుసా?.. ఇలా తెలుసుకోండి
-
Jana Nayagan : విజయ్ ముందు భారీ టార్గెట్స్.. ఫస్ట్ డే వసూళ్లలో రజనీకాంత్ డామినేట్
-
Astrology: జూలై 22 బుధవారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని శుభవార్త..!
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!