Mumbai: జనాలపైకి దూసుకుపోయిన ఆర్టీసీ బస్సు.. నలుగురు మృతి, 29 మందికి గాయాలు
- ముంబై నగరంలో ఆర్టీసీ బస్సు బీభత్సం..
- పాదచారులపైకి దూసుకెళ్లిన బెస్ట్కు చెందిన బస్సు..
- ప్రమాదంలో 4 మృతి, 29 మందికి గాయాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai: ముంబైలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సోమవారం (డిసెంబర్ 9) రాత్రి 9.30 గంటల సమయంలో బృహన్ ముంబయి ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్ (బెస్ట్)కు చెందిన బస్సు కుర్లా స్టేషన్ నుంచి అంధేరికీ వెళ్తుండగా బ్రేక్లు ఫెయిల్ కావడంతో ప్రమాదం జరిగినట్టు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. అయితే, ఆ బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ కాంట్రాక్ట్ డ్రైవర్గా డ్యూటీ చేస్తున్నారు. బస్సు ప్రమాదానికి గల కారణాల్ని గుర్తించేందుకు ఆర్టీఓ అధికారి రవి గైక్వాడ్ నిపుణుల బృందం విచారణ చేస్తోంది. జాయింట్ కమీషనర్ ఆఫ్ పోలీస్ సత్యనారాయణ చౌదరి స్వయంగా కుర్లా పోలీస్ స్టేషన్లో డ్రైవర్ను ఎంక్వైరీ చేస్తున్నారు.
Read Also: pushpa 2 : ఓవర్సీస్ లో మైల్ స్టోన్ మార్క్ అందుకున్న పుష్ప రాజ్
Also Read
- Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
- Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
- Howrah Police: నేరస్థుల గుండెల్లో సువేందు సర్కార్ రైళ్లు.. పేరుమోసిన నేరస్థుడిని లోదుస్తుల్లో తీసుకెళ్లిన హౌరా పోలీసులు
- Fee Refund: నీట్ యూజీ పరీక్ష ఫీజు రిఫండ్.. దరఖాస్తుకు రెండు రోజులే సమయం..
ఇక, కుర్లాలోని ఎస్జీ బార్వేరోడ్లో ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలవ్వడంతో పాదచారులపై దూసుకుపోగా.. ప్రమాదంలో నలుగురు మృతులు శివమ్ కశ్యప్, కనీజ్ ఫాతిమా, అఫీల్ షా, అనమ్ షేక్ లు చనిపోగా.. మరో 29మంది తీవ్రంగా గాయపడ్డారు. అలాగే, మరో ఐదారు ఆటోలు, 10 ద్విచక్రవాహనాలు కూడా పూర్తిగా ధ్వంసమయ్యాయి.
Read Also: Belagavi: బెళగావిపై రెండు రాష్ట్రాలు మళ్లీ ఘర్షణ.. ఆదిత్య ఠాక్రే, సిద్ధరామయ్య మధ్య మాటల యుద్ధం!
కాగా, ఈ ఘోర ప్రమాదంపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు బస్సు డ్రైవర్ సంజయ్ మోర్ని అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ప్రమాదంలో గాయపడ్డ వారిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అయితే, బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో జరిగిన ప్రమాదాన్ని చూసిన స్థానికులు ఉగ్రదాడి తరహాలో ఉండడంతో భయపడ్డారు. పలువురు ప్రాణ భయంతో అక్కడి నుంచి దూరంగా పారిపోయారు. ఇక, క్విక్ రెస్పాన్స్ టీమ్, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగింది.
#Mumbai : Out of control BEST bus mows down several pedestrians and vehicles in Kurla West, Mumbai, late Monday evening.
Four dead and several others injured.
Police said all the injured have been rushed to Bhabha Hospital. pic.twitter.com/oOlWtSxX1p— Saba Khan (@ItsKhan_Saba) December 9, 2024
తాజావార్తలు
-
Ropeway Stops Mid-Air: గాలిలో ఉండగానే అకస్మాత్తుగా ఆగిపోయిన రోప్వే.. చిక్కుకుపోయిన వందలాది మంది పర్యాటకులు
-
Shiva Rajkumar: రామ్చరణ్కు నేషనల్ అవార్డ్ పక్కా.. ‘పెద్ది’పై కన్నడ సూపర్ స్టార్ శివన్న సంచలన వ్యాఖ్యలు!
-
Tamil Nadu: అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకేలో చేరిక
-
Ram Charan : రామ్ చరణ్ తన బాడీగార్డ్కు రోజుకు ఎంత ఇస్తున్నాడో తెలుసా ?
-
Venkatesh Iyer: సడన్గా వెంకటేశ్ అయ్యర్కు హైప్.. తొలి క్వాలిఫయర్ మ్యాచ్లో కోహ్లీతో ఓపెనర్గా రంగంలోకి..
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?