26/11 Mumbai Attack: ముంబై దాడి సూత్రధారులు “భారీ మూల్యం” చెల్లించాల్సిందే.. ఇజ్రాయిల్ వార్నింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
26/11 Mumbai Attack: 26/11 ముంబయి దాడికి ప్లాన్ చేసినవారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే అని ఇజ్రాయిల్ పార్లమెంట్ స్పీకర్ అన్నారు. తొలిసారిగా భారత్ పర్యటకు వచ్చిన అమీర్ ఓహానా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు. ముంబై దాడికి ప్లాన్ చేసిన లష్కరేతోయిబా ఉగ్రవాది ఎవరైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. భారత్, ఇజ్రాయిల్ రెండు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ముందుకు రావాలని ఆయన అన్నారు.
Read Also: World Idli Day: ఇడ్లీనా మజాకా.. గతేడాది 3.3 కోట్ల ప్లేట్ల ఇడ్లీల డెలివరీ..
Also Read
- Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
- NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
- Supreme Court: 'గృహిణులు జాతి నిర్మాతలు'.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
- Kalyan Banerjee: "నీ అల్లుడు కావాలా? మాలాంటి నమ్మకస్తులు కావాలా?" మమతకు కల్యాణ్ బెనర్జీ అల్టిమేటం!
ఇజ్రాయిల్ ప్రధాని బెంజిమెన్ నెతన్యాహుకు అత్యంత సన్నిహితుడిగా అమీర్ ఓహానా ఉన్నారు. గత ఏడాది పదవి స్వీకరించిన తర్వాత తొలిసారి విదేశీ పర్యటన కోసం భారత్ వచ్చారు. 2008 ముంబై అటాక్స్ లో 207 మంది మరణించారు. ఇందులో 178 మంది భారతీయులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులు యూదులను, ఇజ్రాయిల్, పాశ్చత్య దేశాల వారిని టార్గెట్ చేస్తూ కాల్పులకు తెగబడ్డారు. ముఖ్యంగా యూదులు ఎక్కువగా ఉండే నారిమన్ హౌజ్ పై దాడికి తెగబడ్డారు. ఇది భారత్ పైన మాత్రమే కాదు యూదులపై జరిగిన దాడిగా ఇజ్రాయిల్ స్పీకర్ అభివర్ణించారు.
స్పీకర్ గా నా మొదటి పర్యటన ఎక్కడికి వెళ్లాలో అని ఆలోచిస్తున్న సమయంలో భారతదేశాన్ని ఎంపిక చేసుకున్నట్లు వెల్లడించారు. భారత్ అభివృద్ధి చెందుతున్న ప్రధాన శక్తి అని.. ఇజ్రాయిల్ లో సంబంధాలు బలంగా ఉన్నాయని ఆయన అన్నారు. మొదటి ప్రపంచయుద్ధం సమయంలో ఇజ్రాయిల్ లోని హైఫా నగరాన్ని రక్షించేందుకు పోరాడిన భారతీయ సైనికులకు నిశాళులు అర్పించారు. ఆయనతో పాటు చట్టసభ సభ్యుడు మైఖేల్ బిటన్, ఇజ్రాయెల్-భారత్ ఇంటర్ పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్ ఛైర్మన్ అమిత్ హలేవి కూడా ఉన్నారు. ఈ ప్రతినిధి బృందం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జైశంకర్ మరియు ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్తో పాటు పలువురు ఇతర అధికారులను కలవనున్నారు.
తాజావార్తలు
-
Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
-
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు బిగ్ షాక్.. రాజ్యసభ ఆశలు ఆవిరి
-
వృద్ధాప్యాన్ని తిప్పికొట్టే ‘ER-100’ ఇంజెక్షన్.. తొలి రోగికి డోస్ సక్సెస్! ఇక మానవులు అమరులు అవుతారా?
-
Allu Aravind: ఇప్పుడు లవ్ స్టోరీస్ అన్నిటికీ ఓయోలో ఎండ్ కార్డ్.. అల్లు అరవింద్ సంచలనం
-
NITI Aayog Meeting: మోడీ అధ్యక్షతన నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ భారత్పై ఫోకస్
ట్రెండింగ్
-
Parenting Tips: డిజిటల్ చెరలో బాల్యం.. రోబోలుగా మారుతున్న పిల్లలు! పేరెంట్స్ ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లే, 50MP కెమెరాతో Tecno Pova 8 లాంచ్.. ధర ఎంతంటే.?
-
Mohammed Siraj Wedding: హీరోయిన్తో మహ్మద్ సిరాజ్ పెళ్లి.. జూన్లోనే ముహూర్తం!
-
Ben Stokes: ఇంగ్లండ్ క్రికెట్లో కీలక పరిణామం.. బెన్ స్టోక్స్కు భారీ షాక్!
-
30 రోజుల బ్యాటరీ, ఆఫ్లైన్ మ్యాప్స్తో Cheetah 2 Pro, Cheetah 2 Ultra భారత్లో లాంచ్..!