26/11 Mumbai Attack: 26/11 ముంబయి దాడికి ప్లాన్ చేసినవారు భారీ మూల్యాన్ని చెల్లించాల్సిందే అని ఇజ్రాయిల్ పార్లమెంట్ స్పీకర్ అన్నారు. తొలిసారిగా భారత్ పర్యటకు వచ్చిన అమీర్ ఓహానా నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్ కు వచ్చారు. ముంబై దాడికి ప్లాన్ చేసిన లష్కరేతోయిబా ఉగ్రవాది ఎవరైనా భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని అన్నారు. భారత్, ఇజ్రాయిల్ రెండు ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అన్ని దేశాలు ముందుకు రావాలని ఆయన అన్నారు.